India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్బాద్- అలప్పుజ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ ట్రైన్కు తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
తాడేపల్లిగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్ల ఇన్స్టా రీల్స్ మార్ఫింగ్పై కేసు నమోదైంది. బాధితురాళ్ల వివరాల ప్రకారం.. తాము INSTA రీల్స్ చేస్తామని, వాటిని గంగాధర్ అనే వ్యక్తి డౌన్లోడ్ చేసుకుని ముఖాలు మార్చి నగ్న చిత్రాలు తయారు చేసి వేధిస్తున్నాడని విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ స్పందించి నిందితుడిది కృష్ణా జిల్లా మోపిదేవిగా గుర్తించి అక్కాచెల్లెళ్లకు న్యాయం చేస్తామన్నారు.
విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి అనే వ్యక్తిని పట్టుకున్నారు.
కైకలూరు- ముదినేపల్లి మార్కెట్లో అసాధారణంగా రూప్చంద్ రేటు, అటు శీలావతి రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధరణంగా కేజీ రూప్ చంద్ను పెంచడానికి రైతుకు అన్నీ ఖర్చులు కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. నేడు మార్కెట్లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలకడంతో రూ.15 నుంచి రూ.20లు రైతుకు గిట్టుబాటు అవుతుంది. చేపల సాగు లాభాల బాట పట్టడం శుభసూచకం అని రైతులంటున్నారు.
* కృష్ణా: యువతకు శుభవార్త చెప్పిన APSSDC
* కృష్ణా: రోడ్డు ప్రమాదంలో 16 నెలల బాలుడి మృతి
* జగ్గయ్యపేట ఫ్యాక్టరీ ఘటన.. మరో వ్యక్తి మృతి
* కంచికచర్ల వద్ద ఘోర విషాదం.. ముగ్గురి మృతి
* విజయవాడలో అర్ధరాత్రి కారు బీభత్సం
* కృష్ణా జిల్లాలో తగ్గని ఉల్లి, టమాటా ధరలు
* విజయవాడలో కారు డ్రైవర్ ఆత్మహత్య
* కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
* ఎన్టీఆర్ జిల్లాలో 65 పోస్టల్ ఉద్యోగాలు
విజయవాడ పోలీస్ కమీషనరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీపీ రాజశేఖర్ బాబు 68 అర్జీలను స్వీకరించినట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విజయవాడ కమీషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్జీలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని సీపీ ఆదేశించారని కమీషనరేట్ స్పష్టం చేసింది.
ఏలూరు జిల్లా అధికారులతో సోమవారం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయా శాఖల ముఖ్య అధికారులు, కలెక్టర్ సెల్వి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశించి మంత్రి కొలుసు మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేద్దామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.
నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ-గూడూరు విక్రమసింహపురి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.12744 విజయవాడ-గూడూరు రైలును ఈ నెల 17 నుంచి, నం.12743 గూడూరు-విజయవాడ రైలును ఈ నెల 18 నుంచి యథావిధిగా నడుపుతామన్నారు.
కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1403 సర్వే బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.
వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ విని సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Sorry, no posts matched your criteria.