India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్టీఆర్ జిల్లాలో చేపడుతున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టి పూర్తయిన, చేపడుతున్న పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని రెండు దశలలో చేపట్టడం జరిగిందన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. పలు అంశాలపై సమీక్షించిన ఆమె పలు శాఖల అధికారులను మూలధన, వ్యయం ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా సీపీఓకు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణి తదితరులు పాల్గొన్నారు.
కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో కొండ రాళ్లు విడిగిపడి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు కార్మికులపై పడటంతో ముగ్గురు మృతి చెందగా.. <<13632186>>వారిలో ఒకరి ఆచూకీ గుర్తించారు.<<>> మిగిలిన ఇద్దరికోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతులది జి. కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంగా తెలుస్తుంది.
కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో విషాదం చోటు చేసుకుంది. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్, రాళ్లు పెద్ద మొత్తంలో జారి కింద డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు <<13582186>>ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటివరకు నలుగురికి<<>> చేరింది. విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నిరుద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ జులై 16 నుంచి 22 వరకు రోజుకు 2 గంటల పాటు ఇస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ http://engineering.apssdc.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని సూచించింది.
కృష్ణా జిల్లాలో రెగ్యులర్, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలపై రేపు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వారి పరిధిలోని ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
విజయవాడ మీదుగా సికింద్రాబాద్, గూడూరు మధ్య ప్రయాణించే సింహపురి ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12710/12709 సింహపురి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12710 ట్రైన్ను నవంబర్ 8 నుంచి, 12709ట్రైన్ను నవంబర్ 9 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు.
విజయవాడ, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్లను ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆరు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.12712 చెన్నై సెంట్రల్-విజయవాడ, నం.12711 విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.