Krishna

News July 14, 2024

సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: సీఎం చంద్రబాబు

image

మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏపీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.

News July 14, 2024

కృష్ణా: టుడే టాప్ న్యూస్

image

*విజయవాడ రైల్వే డివిజన్‌పై CBI దృష్టి, * జగన్‌పై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు, *ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి, *విజయవాడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డు క్లోజ్, * కృష్ణా: ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు, * కేతిరెడ్డి చెప్పిన మాట నిజం: పేర్ని నాని, *ఫారిన్ అమ్మాయితో..NTR జిల్లా అబ్బాయి పెళ్లి, , *ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా: MP బాలశౌరి, *మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు,

News July 14, 2024

కృష్ణా: మాజీ మంత్రి స్మారకార్థం అంబులెన్స్ అందజేత

image

మాజీ మంత్రి దివంగత పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ ఆదివారం ఆయన స్మారకార్థం అధునాతన ఆంబులెన్స్ అందజేసింది. ఈ మేరకు పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఆదివారం సీఎం చంద్రబాబుకు అంబులెన్స్‌ను అందజేశారు. కాగా ఉపేంద్ర 1996-99 మధ్య విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 

News July 14, 2024

విజయవాడ: టీటీ ర్యాంకింగ్ టోర్నీలో యశ్వంత్‌కు కాంస్యం

image

రాజమండ్రిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో విజయవాడకు చెందిన యశ్వంత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అండర్-11 సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. యశ్వంత్ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు. అనంతరం యశ్వంత్‌ను కోచ్ దామోదరరెడ్డి, భార్గవి, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

News July 14, 2024

విజయవాడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

image

విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు ముసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

News July 14, 2024

కృష్ణా: గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిలకలపూడి (మచిలీపట్నం)లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు చిలకలపూడిలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 

News July 14, 2024

ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.

News July 14, 2024

కృష్ణా: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో BA, BCom, BSc, BBA, BCA, B.A.O.L విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి 14 వరకు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.

News July 14, 2024

విజయవాడలో కిలో టమాటా ధర రూ.64

image

విజయవాడ రాజీవ్ గాంధీ హోల్‌సేల్ మార్కెట్‌ యార్డులో శనివారం టమాటా ధర స్వల్పంగా పెరిగింది. ఈ నెల 12న కిలో రూ.50 పలుకగా 13న గరిష్ఠంగా రూ.54 పలికింది. వర్షాల కారణంగా తోటల్లో టమాటాలు దెబ్బతినడంతో ధర పెరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ కాలేశ్వరరావు మార్కెట్‌లో మొదటి రకం టమాటాను గరిష్ఠంగా రూ.64కు అమ్ముతున్నారు. 

News July 14, 2024

కృష్ణా: పోలవరం ఎడమ కాల్వపై మంత్రి నిమ్మల సమీక్ష

image

పోలవరం ఎడమ కాల్వ స్థితిగతులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమీక్ష జరిపారు. ఎడమ కాల్వ ప్రస్తుత స్థితిగతులు, ఉమ్మడి కృష్ణా తదితర ప్రాంతాలకు నీటి సరఫరా తదితర అంశాలపై నిమ్మల అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.