India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విజయవాడ సితార జంక్షన్ బైపాస్ రోడ్డు వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిట్టి నగర్కి చెందిన బాయని లావణ్య అనే మహిళ దుర్మరణం చెందింది. కుమారుడి బైకుపై వెళుతుండగా ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద వెనుక నుంచి రైల్వే డిపార్ట్మెంట్ కి చెందిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడికి స్వల్ప గాయాలు అవ్వగా ఆసుపత్రికి తరలించారు.

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.18111 టాటా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 1, 15, 22, 29వ తేదీలలో ఏలూరు మీదుగా కాక నిడదవోలు-భీమవరం-గుడివాడ మార్గం గుండా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.18111 టాటా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 1, 15, 22, 29వ తేదీలలో ఏలూరు మీదుగా కాక నిడదవోలు-భీమవరం-గుడివాడ మార్గం గుండా విజయవాడ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.

ఏపీ ఐసెట్-2024 పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్ కౌన్సిలింగ్కై రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు నేటితో ముగియనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను https://cets.apsche.ap.gov.in వెబ్సైట్లో చేసుకోవాలని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) సూచించింది. ధృువపత్రాల పరిశీలన అనంతరం మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 10న ఉంటుందని APSCHE స్పష్టం చేసింది.

బంటుమిల్లి రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న నరసమ్మ అనే మానసిక వికలాంగురాలిపై వెంకటేశ్వరరావు(50) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో మహిళను నిగ్గదీసిన బంధువులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వాసు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కృష్ణా వర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఈడీ, స్పెషల్ బీఈడీ విద్యార్థులకై నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13 నుంచి Y20తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్సిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలంది.

టైలరింగ్ చేసుకునే ఓ మహిళపై దాడి చేసిన ఐదుగురిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. జులై 29 రాత్రి దుకాణంలో ఉండగా ఖాసీం అనే యువకుడు మద్యం తాగి వచ్చి దుర్భాషలాడాడు. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెతో గొడవ పడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఉషాదుర్గ సోదరుడిపై రాయితో దాడి చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాసిం, నాగుర, మబి, షకీలా, నాగురా తల్లిపై కేసు నమోదు చేశారు.

గుణదల కార్మెల్ నగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి వెల్త్ క్లాస్ రూమ్ పేరుతో వాట్సాప్ మేసేజ్ వచ్చింది. అందులో వచ్చిన మాటలు నమ్మిన సదరు వ్యక్తి.. విడతల వారీగా రూ.36.72లక్షలను పెట్టుబడిగా 13 బ్యాంకు ఖాతాలకు పంపించారు. అతని పేరుతో మొత్తం రూ.1.24 కోట్లు లాభం వచ్చిన విత్ డ్రా కాలేదు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు.

జిల్లాలో వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఆ మేరకు పనులు చేపట్టాలని కలెక్టర్ డీ.కే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం మచిలీపట్నం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉపాధి హామీ గృహ నిర్మాణం, టిడ్కో, విద్యుత్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కృషి చేయాలని ఎస్పీ గంగాధర రావు అన్నారు. కృష్ణా జిల్లా పోలీసు అధికారులతో మచిలీపట్నంలో బుధవారం ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవన్నారు. యువత గంజాయి బారిన పడకుండా విద్యాలయాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.