Krishna

News July 30, 2024

VJA: బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు

image

అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు సోమవారం సంచలన తీర్పునిచ్చారు. విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికను గురుసాయిచంద్ర పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2019 సెప్టెంబర్ 29న చంద్ర సాయి, గొల్లసాయి, తరుణ్ బాలికను రూంకు తీసుకెళ్లి మత్తుమందు కలిపి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News July 30, 2024

కృష్ణా: MBA/ MCA పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలలలో MBA/ MCA విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13, Y14, Y15, Y16, Y17, Y18తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలంది.

News July 29, 2024

శివచంద్రారెడ్డికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివచంద్రారెడ్డి గన్‌మెన్లను ఇటీవల ఉపసంహరించడంపై హైకోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

News July 29, 2024

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

image

విజయవాడ శివారు గొల్లపూడి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ అని స్థానికులు గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 29, 2024

కృష్ణా: ‘1వ తేదీనే పింఛన్ల పంపిణీ పూర్తవ్వాలి’

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు 100% పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉద్యోగులను ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 2,42,321, ఎన్టీఆర్ 2,35,477 మందికి గత నెలలో పింఛన్ అందజేశారు. ఆగస్ట్ నెలలో ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50-100 మంది లబ్ధిదారులు ఉండేలా సంబంధిత అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.

News July 29, 2024

రెండో విడత కౌన్సెలింగ్‌ జాబితా ఆగస్టు 3న విడుదల 

image

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు అర్హుల జాబితాను ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లు అడ్మిషన్లు కన్వీనర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 736 సీట్లు మిగిలిపోయాయన్నారు. వాటి భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

News July 29, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో నేడు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.

News July 29, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు పడే అవకాశం

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో సోమవారం అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA అధికారులు పేర్కొన్నారు.

News July 29, 2024

ప్రజలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్ బాలాజీ

image

నేడు (సోమవారం) కలెక్టరేట్లో ఉ.10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.

News July 28, 2024

విజయవాడ: ఆర్చర్ ధీరజ్ మ్యాచ్ వీక్షణకు స్క్రీన్ ఏర్పాటు

image

పారిస్ ఒలింపిక్స్ 2024లో సోమవారం జరగనున్న ఆర్చరీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వీక్షణకు విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు. అకాడమీలో శిక్షణ పొందిన బొమ్మదేవర ధీరజ్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు దేశానికి పతాకం అందించడం ఖాయమని అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ తెలిపారు.