Krishna

News June 24, 2024

కృష్ణా: రద్దైన రైళ్లను పునరుద్ధరించిన రైల్వే

image

ట్రాఫిక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండ్రుప్‌కర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.12805 విశాఖపట్నం- లింగంపల్లి, నం.12806 లింగంపల్లి- విశాఖపట్నం రైళ్లను రేపు మంగళవారం నుంచి యథావిధిగా నడుపుతామన్నారు.

News June 24, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్‌కి నివేదించనున్నారు.

News June 24, 2024

తొలి కేబినెట్ భేటీలో కొల్లు రవీంద్ర, పార్థసారథి

image

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. తొలి మంత్రి వర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News June 24, 2024

మచిలీపట్నం: గుండెపోటుతో మార్నింగ్ వాకర్ మృతి

image

మచిలీపట్నం మున్సిపల్ మెయిన్ పార్కులో విషాదం చోటు చేసుకుంది. స్థానిక పంబలగూడెంకు చెందిన కర్ణపు శంకర్ రెడ్డి వాకింగ్ చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అదే పార్కులో వాకింగ్ చేస్తున్న డాక్టర్ చంద్రశేఖర్, ఇనగుదురుపేట సీఐ విద్యాసాగర్ CPR చేసినా ఫలితం లేకపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

News June 24, 2024

ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది సర్వే చేయాలి: డీఎంహెచ్ఓ సుహాసిని

image

జిల్లాలోని అన్ని గ్రామాల్లో సోమవారం నుంచి వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాలు జారీ చేశారు. అనుమానిత డయోరియా, మలేరియా, డెంగీ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News June 24, 2024

ANU: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన డిగ్రీ 5వ సెమిస్టర్(BA, BCom, BCA, BAOL) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 2వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడవచ్చంది.

News June 24, 2024

నేడు మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతల స్వీకరణ

image

రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 7.50ని.లకు రాష్ట్ర సచివాలయంలో బ్లాక్ నెంబర్ 3, రూమ్ నెంబర్ 207లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులకు రవీంద్ర ప్రత్యేక ఆహ్వానాలు పంపారు.

News June 24, 2024

కృష్ణా: రేపటితో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

image

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన LLB కోర్సు 1వ, BA.LLB కోర్సు 5వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు రేపటిలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు

News June 24, 2024

విజయవాడ: వరల్డ్ కప్‌లో ధీరజ్‌కు రెండు పతకాలు

image

అట్లాంటా టర్కీలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ పతకాలు కైవసం చేసుకున్నాడు. రికర్వ్ రౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, మిక్సీడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ పతకాలు సాధించి వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో బెర్త్ సాధించాడు. ఈ సందర్భంగా ధీరజ్ ను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

News June 24, 2024

కృష్ణా: స్పందన ఇకపై ‘మీ కోసం’

image

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం పేరు మారింది. ప్రభుత్వ మార్పిడితో స్పందన కార్యక్రమాన్ని ‘మీ కోసం’ కార్యక్రమంగా పేరు మార్చారు. మీ కోసం పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

error: Content is protected !!