India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కనెక్ట్ టు ఆంధ్రాకు దేవీ సీఫుడ్స్ సంస్థ రూ.5 కోట్ల విరాళాన్ని అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిమిత్తం ఈ మొత్తాన్ని అందించినట్లు తెలిపింది. రూ.5 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోట్రు బ్రహ్మానందం శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి అందించారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల నాయకత్వంపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్కి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటలు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల ఎన్నిక పారదర్శకంగా జరగలేదన్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనుచరగణం అభ్యర్థుల ఎంపికలో క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని మండిపడ్డారు.
కూరగాయలు ధరలు భారీగా పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రైతు మార్కెట్లో కేజీ రూ.50గా విక్రయిస్తుండగా.. టమాటా ధర రిటైల్ మార్కెట్లో రూ.70 నుంచి రూ.90 పలుకుతోంది. రాబోయే రోజుల్లో దీని ధరలు ఎంత పెరుగుతాయో అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో రేకెత్తుతోంది. ఇక మిగతా కూరగాయలు పరిస్థితి కూడా ఇలానే ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ.44 ఉంటే, కాకరకాయ రూ.48, బెండ రూ.60, బీరకాయ రూ.55గా ఉన్నాయి.
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసిన వ్యక్తిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలు మేరకు పెనమలూరుకు చెందిన మహిధర్ అనే వ్యక్తి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుడు అనిల్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.15లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.
రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావును కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో నెలకొన్న శాంతిభద్రతల గురించిన నూతన డీజీపీకి ఎస్పీ వివరించారు.
జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై సమీక్షించారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో క్రీడాకారులు, ప్రజల సౌకర్యార్థం కేలో ఇండియా ప్రాజెక్ట్ ద్వారా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
2021, 22, 23, 24 సంవత్సరాలలో డిప్లొమా, ITI పాసైన వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నైపుణ్య శిక్షణ & ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 28లోపు రిజిస్టర్ చేసుకోవాలని APSSDC సూచించింది. ఎంపికైన వారికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించి తిరుపతిలోని శ్రీసిటీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది.
జిల్లాలో ఎక్కడ అతిసార వ్యాధి ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. శుక్రవారం నాడు జరిగిన రాష్ట్రవ్యాప్త కాన్ఫరెన్స్లో భాగంగా ఢిల్లీ రావు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలింది అన్న ప్రచారం ఉండకూడదని అన్నారు. వర్షాకాల నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు.
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో నవంబర్- 2023లో నిర్వహించిన LLB కోర్సుల 5, 9వ సెమిస్టర్ల రీ వాల్యుయేషన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
జిల్లాలో డయారియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ వైద్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి ఆయన హాజరయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.