India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A. LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25,27,30, ఆగస్టు 1వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
విజయవాడ-గూడూరు మధ్య నిర్మిస్తున్న 3వ రైల్వే లైన్ పనులు 233 కి.మీ. మేర పూర్తయ్యాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 288 కి.మీ. మేర నిర్మిస్తున్న ఈ లైన్లో పలు చోట్ల వంతెనలు నిర్మించామని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ లైన్ పనులు పూర్తై అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో వాణిజ్యం ఊపందుకోవడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలతో మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని B.A. LL.B కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన నాలుగవ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 25,27,30, ఆగస్టు 1వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
గంపలగూడెం మండలం పెనుగొలనులో సుబాబుల్ లోడుతో వెళుతున్న లారీకి బుధవారం విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో ఆర్సీఎం చర్చి వద్ద విగతజీవిగా పడి ఉన్న లారీ డ్రైవర్ను చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్-డీ(మూడో ఏడాది) కోర్సు చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 3, 5, 8, 10, 12, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
ప్రేమించిన వ్యక్తి 2 నెలలుగా మాట్లాడటం లేదని ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు యువతి సోదరుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిజియోథెరపి చదవిన యువతికి 6 నెలల కిందట ఓ ప్రొఫెసర్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తనను నమ్మించి మోసం చేశాడని, 2 నెలలుగా మాట్లాడట్లేదనే మనస్తాపంతో యువతి ఈ నెల 23న ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చాగల్లు-రాజమండ్రి సెక్షన్ల మధ్య ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ- కాకినాడ పోర్ట్ మెము ఎక్స్ప్రెస్ రైళ్లను యధావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ రైళ్లను యధావిధిగా నడుపుతామన్నారు.
విజయవాడ భవానిపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. భవానిపురం హెడ్ వాటర్ వర్క్ వద్ద మంగళవారం మధ్యాహ్నం మృతదేహం ఉందని స్థానికుల ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 సంవత్సరాల వరకు ఉంటుందని వారు వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.
DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం అభ్యర్థులు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు ఈ.కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నెం.8, అశోక్నగర్లోని స్టడీ సర్కిల్లో కుల, ఆదాయ, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కాకినాడ టౌన్(CCT)- లింగంపల్లి(LPI) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07445 CCT- LPI రైలును జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వారంలో 3 రోజులు, నం.07446 LPI- CCT రైలును జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు వారంలో 3 రోజులు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.