Krishna

News June 20, 2024

ఉప ముఖ్యమంత్రిని కలిసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్

image

విజ‌య‌వాడ‌ క్యాంపు కార్యాల‌యంలో బుధవారం ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ బాధ్య‌త‌ల స్వీక‌రణ సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌ డిల్లీరావు బుధవారం మ‌ర్యాద‌ పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News June 19, 2024

నేను ఎవరి భూములను ఆక్రమించుకోలేదు: మాజీ మంత్రి

image

మాజీమంత్రి పెనమలూరు వైసీపీ ఇన్‌ఛార్జ్ జోగి రమేశ్‌పై వస్తున్న భూ ఆక్రమణలపై ఆయన స్పందించారు. తనపై భూ అక్రమాల గురించి వచ్చే వార్తలు కేవలం ఎల్లో మీడియా కల్పిస్తున్న కథనాలే అన్నారు. తాను ఎటువంటి ఆక్రమణలకు పాల్పడలేదని ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకున్న భూమి కూడా న్యాయపరంగా కొన్నామని తెలిపారు.

News June 19, 2024

మాజీ మంత్రి రోజాపై బుద్ధా వెంకన్న ఫైర్

image

రుషి కొండలోని పర్యాటక స్థలంలో పర్యాటన భవనాలు నిర్మించడం తప్పా అంటూ Xలో మాజీ మంత్రి రోజా చేసిన పోస్టుకు మాజీ MLC TDP నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. రుషి కొండపై కట్టిన నిర్మాణాలు నాడేమో CM ఉండడానికని చెప్పిన రోజా ఇప్పుడేమో పర్యాటకుల కోసం నిర్మించామని చెబుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి రోజాపై ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు ఏంటో బయటికి వస్తాయని అన్నారు.

News June 19, 2024

విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దమ్మాలపాటి.?

image

కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. 1991లో దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు.

News June 19, 2024

విజయవాడ: రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా దుమ్మలపాటి

image

సీనియర్ న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్‌ని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి. కాగా ఆయన 2016 మే 28 నుంచి 2019 ఏజీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. ఈ నెల 20న తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ఆయన చంద్రబాబు అరెస్ట్, కేసుల నేపథ్యంలోఆయన అలుపెరగని న్యాయపోరాటాలు చేశారు.

News June 19, 2024

కృష్ణా: అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

image

పెడన మండలంలోని కొంకేపూడికి చెందిన రైతు శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు శ్రీనివాసరావుకి సుబ్బారావు, వెంకటేశ్వరరావుల మధ్య పొలం హక్కుల విషయమై విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపం చెందిన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 19, 2024

విజయవాడలో గంజాయి పట్టివేత.. నిందితుల అరెస్ట్

image

నగరంలో మంగళవారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ గణేశ్ తెలిపిన వివరాల మేరకు విజయవాడకు చెందిన గణేశ్, శివకుమార్ అనే వ్యక్తులు సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తుండగా దాడి పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రెండున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News June 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

News June 18, 2024

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

image

విజయవాడ- జక్కంపూడి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కొత్తపేట సీఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన హర్షవర్ధన్ కంచికచర్లలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. కాలేజీ పూర్తవగానే మంగళవారం మధ్యాహ్నం విజయవాడ బయలుదేరి ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో లారీ టైరు అతనిపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 18, 2024

గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణపై కలెక్టర్ సమీక్ష

image

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణలో భాగంగా అభివృద్ధికి భూములను ఇచ్చిన రైతులు, భూ యజమానులకు చెల్లించవలసిన నష్టపరిహారంపై, తగిన ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి గన్నవరం విమానాశ్రయ విస్తరణ సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

error: Content is protected !!