India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ అద్నాన్ నయీం చేసిన కృషి సఫలీకృతమైంది. ఏ చిన్న పొరపాటుకు అస్కారం లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇరువురు అధికారులు ఎంతో సమస్వయంతో వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల మార్గదర్శకాలకు లోబడి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసిన కలెక్టర్, ఎస్పీలు జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.
యూపీఎస్సీ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ నిర్వహించనున్న నేపథ్యంలో యూపీఎస్సీ అధికారులు.. పరీక్షా కేంద్రాలున్న జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ డిల్లీరావు క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. విజయవాడలో పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా, పీజీ కోర్సుల పరీక్షలకు(ఇయర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు రేపు శుక్రవారంలోగా నిర్ణీత ఫీజు రూ.960 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
గుడివాడ గడ్డపై TDP జెండాను మళ్లీ రెపరెపలాడించిన వెనిగండ్ల రాముకి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. TDP నుంచి YCPలోకి వెళ్లిన కొడాలి నానికి ధీటుగా నిలిచిన వెనిగండ్ల 53వేల మెజార్టీతో గుడివాడను చంద్రబాబుకు కానుకగా సమర్పించారని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. NRI అయిన రాము విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడంలో సహాయపడతారని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.
మచిలీపట్నం లోక్సభకు జరిగిన తాజా ఎన్నికలలో NOTAకు మొత్తం 12,126 ఓట్లు పడ్డాయి. వీటిలో EVMలలో 12,008, పోస్టల్ బ్యాలెట్లలో 1,18 ఓట్లు పడ్డాయి. కాగా పోటీ చేసిన 15 మంది అభ్యర్థులలో విజేతగా నిలిచిన బాలశౌరి(జనసేన), చంద్రశేఖర్(వైసీపీ), గొల్లు కృష్ణ(కాంగ్రెస్) తర్వాత NOTAకు అత్యధికంగా ఓట్లు పడటంతో NOTA 4వ స్థానంలో నిలిచింది.
విజయవాడ సెంట్రల్ నుంచి 2019 ఎన్నికల్లో 25 ఓట్లతో ఓడిపోయిన బొండా ఉమా మహేశ్వరరావు తాజా ఎన్నికల్లో భారీ మెజారిటీ(68886)తో గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్పై విజయం సాధించిన విజయం తెలిసిందే. వెల్లంపల్లికి వచ్చిన 61148 ఓట్ల కంటే ఉమాకు వచ్చిన మెజారిటీనే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బొండాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పెనుగంచిప్రోలుకు చెందిన కార్తీక్, వత్సవాయి మం.వేమవరానికి చెందిన నాగరాజు మధ్య NTR స్టిక్కర్ తొలగించే విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కార్తీక్తో బలవంతంగా బైకుపై ఉన్న స్టిక్కర్ తీయించిన నాగరాజు, వీడియో కూడా తీసినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపై కొద్దిసేపటికే వేమవరం సమీపంలో అనుమానాస్పదరీతిలో కార్తీక్ డెడ్బాడీ కనిపించిందని, వత్సవాయి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 13 చోట్ల టీడీపీ, రెండు చోట్ల బీజేపీ, ఒక స్థానంలో జనసేన గెలుపొందాయి. జనసేన నుంచి గెలిచిన మండలి బుద్ధ ప్రసాద్కు మంత్రి పదవి దక్కుతుందనే టాక్ నడుస్తోంది. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు కూడా మంత్రి పదవులు రేసులో ఉన్నట్లు టాక్. వీరితో పాటు టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, బొండా ఉమా, తంగిరాల సౌమ్య, తదితరులు మంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
➤ సీనియర్లు: మండలి బుద్ధప్రసాద్(4వసారి), పార్థసారథి(4వసారి), గద్దె రామ్మోహన్(3వసారి), శ్రీరామ్ తాతయ్య(3వసారి) బోడె ప్రసాద్(2వసారి), బొండా ఉమ(2వసారి), వసంత కృష్ణప్రసాద్(2వసారి), తంగిరాల సౌమ్య(2వసారి), కొల్లు రవీంద్ర(2వసారి), కామినేని శ్రీనివాస్(2వసారి)
➤ తొలిసారి: వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, సుజనా చౌదరి, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు
హిందూపూర్ MLAగా హ్యాట్రిక్ విక్టరీ సాధించిన బాలయ్యను విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని ఇతర టీడీపీ నేతలతో కలిసి అభినందించారు. ఈ మేరకు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన బాలయ్యను టీడీపీ నాయకులు చిన్ని, బొండా ఉమా, పట్టాభి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. MLAగా మూడవసారి ఎన్నికైన బాలయ్యకు జిల్లా నేతలు శుభాకాంక్షలు తెలుపగా భారీ మెజారిటీతో గెలిచిన చిన్ని, ఉమాలను ఆయన అభినందించారు.
Sorry, no posts matched your criteria.