Krishna

News June 3, 2024

విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్ల దారి మళ్లింపు 

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను(నం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా జూలై 14 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 3, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూన్ 30 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
*నం.07767 రాజమండ్రి- విజయవాడ
*నం.07459 విజయవాడ- రాజమండ్రి

News June 3, 2024

మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో యువకుడి మృతి

image

మంగినపూడి బీచ్‌లో సోమవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బీచ్‌కి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్‌కి 9 మంది స్నేహితులు వచ్చారు. వారంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో యువకుడు బీచ్‌లోకి కొట్టుకుపోయాడన్నారు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరుకి చెందిన భానుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.

News June 3, 2024

RTV సర్వే: ఉమ్మడి కృష్ణాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా.!

image

ఉమ్మడి కృష్ణాలో TDP-8, YCP-6, JSP-1, BJP-1 చోట్ల గెలుస్తాయని RTV సర్వే తెలిపింది. VJA వెస్ట్-ఆసిఫ్, సెంట్రల్-ఉమా, ఈస్ట్-రామ్మోహన్, నందిగామ-జగన్, మైలవరం-కృష్ణప్రసాద్, తిరువూరు-స్వామిదాస్, జగ్గయ్యపేట-తాతయ్య, గుడివాడ-రాము, పెనమలూరు-బోడె ప్రసాద్, పామర్రు-అనిల్, గన్నవరం-వెంకట్రావు, పెడన- రాము, మచిలీపట్నం-రవీంద్ర, అవనిగడ్డ-బుద్దప్రసాద్, నూజివీడు-ప్రతాప్, కైకలూరు- కె.శ్రీనివాస్ గెలబోతున్నారని పేర్కొంది.

News June 3, 2024

కృ‌ష్ణా: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం

image

ఈ నెల 4న ఓట్ల లెక్కింపులో భాగంగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8గంటలకు పోస్టల్ ఓట్లు లెక్కింపు ప్రారంభించనుండగా 8.30ని.లకు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. అయితే పోస్టల్ ఓట్ల సంఖ్య తక్కువే అయినప్పటికీ వీటి ఫలితమే ఆలస్యంగా రానుంది. పోస్టల్ ఓట్ల లెక్కింపునకు అధిక సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

News June 3, 2024

కృష్ణా: నిఘా నీడలో ఓట్ల లెక్కింపు

image

కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న కౌంటింగ్ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 110 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లతో సహా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం సీసీ కెమెరాల ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియామకాన్ని అధికారులు చేపట్టారు.

News June 3, 2024

ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ డిల్లీ రావ్

image

కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.ఆదివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో డిల్లీరావు మాట్లాడుతూ.. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. జాయింట్ కలెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

News June 2, 2024

కరకట్టపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చల్లపల్లి మండలం నడకుదురు వద్ద కరకట్టపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని గ్రామానికి చెందిన కుంభా నాంచారయ్య అనే వ్యక్తి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ.. వ్యాపారం చేసుకుని జీవించే నాంచారయ్య బైక్ అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించి 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చి మోపిదేవి అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

News June 2, 2024

మచిలీపట్నం: కౌంటింగ్ హాల్లో గందరగోళం సృష్టిస్తే చర్యలు

image

ఈ నెల 4వ తేదీన కృష్ణా విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎవరైనా సరే, గందరగోళం సృష్టిస్తే తక్షణమే బయటకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీంతో కలిసి కలెక్టరేట్‌లో ఆర్ఓలు, డీఎస్పీలతో ఓట్ల లెక్కింపు, శాంతి భద్రతల పర్యవేక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News June 2, 2024

యనమలకుదురులో గర్భిణి సూసైడ్

image

విజయవాడ శివారు యనమలకుదురులో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. కావ్య అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. కావ్య ఐదు నెలల గర్భవతిగా ఉందని ఇటీవల భర్త స్కానింగ్ చేయించాడు. ఆడపిల్లని తేలడంతో భర్త అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అది ఇష్టంలేని కావ్య ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

error: Content is protected !!