India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులపై సర్వత్ర ఉత్కంఠ నెలపొంది. జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, మండలి బుద్ధప్రసాద్ మంత్రి పదవులు రేసులో ఉన్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారిలో వీరిద్దరు సీనియర్లు కావటంతోపాటు సామాజిక వర్గ సమీకరణాలు కూడా వీరికి కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గం నుంచి రవీంద్రకు, పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధప్రసాద్కు మంత్రి పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత వెనిగండ్ల రాము తాజా ఎన్నికలలో 53,040 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి కొడాలి నానిపై గెలుపొందారు. గుడివాడలో తన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన రాము ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. రాముకు ఇవే తొలి ఎన్నికలు కాగా మొట్టమొదటి ఎన్నికలలోనే 53,040 ఓట్ల మెజారిటీతో గెలుపొంది గుడివాడ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
గుడివాడ నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకోలేక, గుడివాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్ అనే వాలంటీర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాలంటీర్ మృతితో గుడివాడలో విషాదం నెలకొంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ ఘనవిజయం సాధించారు. నిర్ణీత రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి శివనాథ్ 2,82,085 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై విజయం సాధించారు. టీడీపీ ఘనవిజయంతో ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన కూటమి శ్రేణులు ఫుల్ జోష్లో సంబరాలు చేసుకుంటున్నాయి.
విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ కారణంగా కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 1 నుంచి జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ.. తాజాగా రైల్వే వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
*నం.17329 హుబ్లీ- విజయవాడ
*నం.17330 విజయవాడ- హుబ్లీ
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ (వైసీపీ)పై 2,16,938 ఓట్ల మెజార్టీ సాధించారు. బాలశౌరికి 7,12,149 ఓట్లు రాగా సింహాద్రి చంద్రశేఖర్ కు 4,95,211 ఓట్లు వచ్చాయి.
రేపు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఏలూరు, గుంటూరు జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
గన్నవరం నియోజకవర్గ ఫలితం అభ్యర్థుల మధ్య దోబూచులాడుతోంది. మొదట్లో వల్లభనేని ముందంజలో ఉండగా.. చివర్లో యార్లగడ్డ వెంకట్రావు ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. 22 రౌండ్లు ముగిసేసరికి 36564 ఓట్ల మెజార్టీతో కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ముందంజలో ఉన్నారు. మరో రౌండ్ ఫలితం రావాల్సి ఉంది.
రాష్ట్రంలో టీడీపీ కూటమి తరఫున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం చిన్ని 2,43,850 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా కూటమి ఎంపీ అభ్యర్థులలో నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,56,235 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు.
ఏపీలో బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఏడింటిలో ఆధిక్యంలో ఉంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులలో విజయవాడ పశ్చిమ MLA అభ్యర్థి సుజనా చౌదరి 10 రౌండ్లు ముగిసేసరికి 31,891 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ.. టాప్లో ఉన్నారు. మొత్తం పశ్చిమలో 19 రౌండ్లలో కౌంటింగ్ జరగాల్సి ఉండగా 10 రౌండ్లు పూర్తయ్యేసరికి సుజనా భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
Sorry, no posts matched your criteria.