India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంగళగిరి TDP రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో YCP నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నాయకులను అరెస్టు చేయగా.. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న విజయవాడ YCP నాయకులు అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. 2021 అక్టోబర్ 19న TDP కార్యాలయంపై YCP నాయకులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CC కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిందితుల జాబితా తయారు చేశారు.

ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ నుంచి విజయనగరానికి సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడలో బయలుదేరే ఈ బస్సు తర్వాతి రోజు ఉదయం 5 గంటలకు విజయనగరం చేరుకుంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఉదయం 6.50 గంటలకు విజయనగరంలో బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు విజయవాడ చేరుకుంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని RTC విజ్ఞప్తి చేసింది.

విజయవాడ రూరల్ పడమటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున కవల పిల్లలు మృతి చెందారు. <<13556286>>తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉండగా కొద్దిసేపటికి ఆమే కన్నుమూశారు.<<>> వివరాల్లోకి వెళితే.. గంగూరు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రశాంత్ సతీమణి మాధవి, ప్రైవేటు ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల కవలలు ఆ తర్వాత తల్లి కూడా మృతి చెందినట్లు మాధవి బంధువులు ఆరోపిస్తున్నారు.

క్లబ్ మహీంద్రా ఛైర్మన్ సీపీ గుర్నాని, ఆయన బృందంతో సీఎం చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో హాస్పిటాలిటీ, టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఎదురు చూస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నానంటూ చంద్రబాబు ఈ మేరకు ట్వీట్ చేశారు. గుర్నాని బృందంతో అమరావతిలో జరిపిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల వాతావరణం, వనరుల గురించి వివరించానని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్సుఖియా(NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.05952 NTSK- SMVB రైలును జులై 4 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి గురువారం, నం.05951 SMVB- NTSK రైలును జులై 8 నుంచి నవంబర్ 4 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డీఈఓ సుబ్బారావుతో కలిసి బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యకలాపాలపై కలెక్టర్ సృజన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలు ప్రవేశాలు, బోధనా సిబ్బంది, మౌలిక వసతులు, పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి-మార్చి 2024లో నిర్వహించిన డిగ్రీ(ఇయర్ ఎండ్)పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 4వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు http://anucde.info/ వెబ్సైట్ చూడాలని సూచించింది.

రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యంతో ప్రజల ఆరోగ్య రక్షణ తద్వారా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదం చేస్తాయని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లో అధికారులతో బుధవారం ఆమె సమావేశం నిర్వహించారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల పరిధిలో మంజూరైన పనులు, చేపట్టిన పనులు, వాటిలో పురోగతి తదితరాలపై చర్చించారు.

మండల పరిధిలోని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జంక్షన్ సీఐ నవీన్, నరసింహమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఇతని వయస్సు 60 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. అతని చేతిపై ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉందని నిలువు చారల చొక్కా, గళ్ల లుంగి ధరించి ఉన్నాడని తెలిపారు. సమాచారం తెలిసినవారు హనుమాన్ జంక్షన్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ(సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.
Sorry, no posts matched your criteria.