India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిరుద్యోగ యువత మెగా DSC నోటిఫికేషన్ విడుదలతో ఉత్సాహం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలో 2,636 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో జిల్లాలో కేవలం 180 పోస్టులనే చూపించారని, 1,000కి పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయని DSC అభ్యర్థులు చెబుతున్నారు. తాజా నోటిఫికేషన్తో జిల్లాలో గరిష్ఠంగా టీచర్ పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 85 మంది ఒప్పంద ఉపాధ్యాయులను, అధ్యాపకులను గురువారం నుంచి విధుల్లోకి తీసుకున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ DCO సుమిత్రాదేవి ఒక ప్రకటన విడుదల చేశారు. 2024 విద్యా సంవత్సరంలో SSC, ఇంటర్ ఫలితాలలో ఆయా ఉపాధ్యాయులు సాధించిన ఉత్తమ ఫలితాల ఆధారంగా వారిని మరలా విధుల్లోకి చేర్చుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
కృత్తివెన్నులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారిపై కంటైనర్, మినీ వ్యాన్ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
కృష్ణా జిల్లా పరిధిలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన కింది రైళ్లను యధావిధిగా నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.* నం.07864 గుంటూరు- విజయవాడ* నం.07628 విజయవాడ- గుంటూరు* నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్* నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. ఏయే ఫలితాలు విడుదల అయ్యాయంటే.. ☞ ఫార్మ్-డీ 1వ సెమిస్టర్ ☞ LLB కోర్సు 5వ సెమిస్టర్ ☞ బీ ఫార్మసీ 1వ సెమిస్టర్
మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా కడప వెళ్లే తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్లను మార్చినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.17488 విశాఖపట్నం- కడప ట్రైన్కు 18521నంబరు, నం.17487 కడప- విశాఖపట్నం ట్రైన్కు 18522 నెంబరు కేటాయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయవాడలో బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య రెడ్డి CM ప్రమాణ స్వీకార బందోబస్త్లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా గురువారం ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేట తరలించారు.
Sorry, no posts matched your criteria.