Krishna

News May 28, 2024

తొలి ఫలితం SC నియోజకవర్గాల్లో.. గెలుపు ఎవరిదో?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో ప్రారంభం కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తొలి ఫలితాలు SC నియోజకవర్గాలైన నందిగామ, పామర్రుల నుంచి వెలువడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరి ఈ తొలి ఫలితాల్లో ఎవరిది ( వైసీపీ or కూటమి ) పై చేయి కానుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

గుడివాడతో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం

image

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌‌కు గుడివాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపన అనంతరం జరిగిన 1983, 85 ఎన్నికలలో ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించారు. అనంతరం ఆయన స్మారకార్థం గుడివాడలో ఎన్టీఆర్ పేరు మీద స్టేడియం నిర్మించారు. రెండు సార్లు తనను గెలిపించి అసెంబ్లీకి పంపించిన గుడివాడ గురించి ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా చెబుతుండేవారు. నేడు ఎన్టీఆర్ జయంతి.

News May 28, 2024

విజయవాడలో సీఎం జగన్‌పై దాడి కేసులో నేడు తీర్పు

image

ఏప్రిల్ 13న విజయవాడలో జగన్‌పై గులకరాయి దాడి కేసు విచారణలో భాగంగా నేడు తీర్పు రానుంది. ఈ కేసు విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీశ్‌ను అక్రమంగా ఇరికించారని అతడి తరఫు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ సతీశ్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనుంది.

News May 28, 2024

పామర్రులో తొలి ఫలితం వచ్చే అవకాశం

image

కృష్ణా జిల్లాకు సంబంధించి జూన్ 4న మచిలీపట్నంలోని కృష్ణా వర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అన్ని నియోజకవర్గాలకు 14 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు పక్రియ కొనసాగిస్తారు. కాగా, జిల్లాలో తొలి ఫలితం పామర్రుది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రౌండ్ల సంఖ్య 17 కాగా, అభ్యర్థులు 8 మందే పోటీలో ఉన్నారు. దీంతో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత మచిలీపట్నం ఫలితం రావొచ్చని చెబుతున్నారు.

News May 28, 2024

నందిగామ ఫలితం 4 గంటల్లోనే..

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో తొలి ఫలితం నందిగామ నుంచి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 4 గంటల్లోనే ఇక్కడ విజేత ఎవరో తేలిపోనుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిమ్రా, నోవా కాలేజీల్లో లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.

News May 28, 2024

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాయాబజార్ రీరిలీజ్

image

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, SV రంగారావు నటించిన ‘మాయాబజార్'(1957) సినిమా ఈ నెల 28న రీరిలీజ్(కలర్ ప్రింట్) కానుంది. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి సందర్బంగా విజయవాడలోని ఊర్వశి కాంప్లెక్స్, స్వర్ణ మల్టీఫ్లెక్స్ థియేటర్‌లలో ఈ సినిమా 28, 29వ తేదీలలో రెండు రోజులపాటు ప్రదర్శించనున్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.

News May 27, 2024

కృష్ణా: రేపు పాలీసెట్ కౌన్సిలింగ్ జరిగే ర్యాంకుల వివరాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు మంగళవారం పాలీసెట్-2024లో 12,001- 27,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

News May 27, 2024

ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ముకేశ్ కుమార్ మీనా

image

జూన్ 4న ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. నేడు నిమ్రా కళాశాలలో కలెక్టర్ ఢిల్లీ రావు, సీపీ రామకృష్ణతో కలిసి స్వయంగా స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీనా మాట్లాడుతూ.. కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు సలహాలు జారీ చేశారు.

News May 27, 2024

కృష్ణా: డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) 2024 ఫిబ్రవరి- మార్చిలో నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలు నేడు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డిప్లొమా కోర్సులు(ఇయర్ ఎండ్), డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సుల(సెమిస్టర్ ఎండ్) ఫలితాలు నేడు విడుదల చేశామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు http://www.anucde.info/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ ట్యాబ్ చూడాలని సూచించాయి.

News May 27, 2024

కృష్ణా వర్సిటీలో ఓట్లు లెక్కించేది ఈ రూమ్‌లలోనే

image

జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లను జూన్ 4న కృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూమ్‌లను కేటాయించారు. రూమ్ నం.301Aలో గన్నవరం, రూమ్ నం.101Aలో గుడివాడ, రూమ్ నం.134Aలో పెడన, రూమ్ నం.118Aలో మచిలీపట్నం, రూమ్ నం.322Bలో అవనిగడ్డ, రూమ్ నం.129Aలో పామర్రు, రూమ్ నం.201Aలో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు.

error: Content is protected !!