India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం బ్యారేజీ 68వ కానా పైనుంచి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు ఆమెను బయటకు తీశారు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పదవ తరగతి సప్లిమెంటరీ అడ్వాన్స్డ్ పరీక్షలు కృష్ణా జిల్లాలో ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 24 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సోషల్ స్టడీస్ పరీక్షకు 1950 మంది విద్యార్థులకు 594 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన 07 కేంద్రాలను సందర్శించగా ఒక్కమాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
మండలంలోని తొర్రగుంటపాలెంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొర్రగుంటపాలెం వచ్చే రోడ్లో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని హైడ్రో మిషన్ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తిని చిల్లకల్లు ధర్మవరపాడు గ్రామ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా క్షేత్రస్థాయిలో పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నేడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి 2,36,726 పెన్షన్లలో 1,80,216 పెన్షన్ దారులకు బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
కృష్ణా వర్సిటీ డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ జ్ఞానమణి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 5,622మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 2,641మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అలాగే 7,354మంది సప్లిమెంటరీ విద్యార్థులు పరీక్షలు రాయగా 46.11శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అనంతరం ఉపకులపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయం ఇవ్వని విధంగా తాము రికార్డు సమయంలో ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు.
నూజివీడు మండలం గొల్లపల్లిలో జరగాల్సిన ఓ పెళ్లిలో ట్విస్ట్ నెలకొంది. తాళికట్టే వేళ వధువు కళ్లు తిరిగి పడిపోయింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, పెళ్లి పెద్దలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే.. పెళ్లి ఇష్టం లేక కావాలనే ఇలా చేసినట్లు వధువు చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. దీంతో 2 కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వధువు మైనర్. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మండలంలోని మోర్సపూడిలో శ్రీనివాస హాజరి కంపెనీలో గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహానికి సుమారు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కంపెనీలో ఉత్తరపు గేటు సమీపంలో ఈ మృతదేహం ఉన్నట్లుగా నూజివీడు రూరల్ ఎస్సై తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
నూజివీడులోని YSR హార్టికల్చర్ వర్సిటీలో రెండేళ్ల ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. SSC పాసైన విద్యార్థులు https://drysrhu.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ పి. విజయలక్ష్మి చెప్పారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి సీట్లు భర్తీ చేస్తామని ఆమె తెలిపారు.
అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కానూరు సనత్నగర్కు చెందిన షేక్ ముస్కాన్కు, గుంటూరుకు చెందిన షేక్ మహ్మద్ రఫీకి ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటై కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. నేడు విజయవాడలో సీపీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా, నోవా కళాశాలలో జూన్ 4వ తేదిన జరుగు ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.