India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారా లోకేశ్కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే, లోకేశ్ను అధ్యక్షుడిగా ప్రకటించాలన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడిని ఎలాగూ కేబినెట్లోకి తీసుకుంటారని, దీంతో ఎటువంటి వివాదాలు ఉండవన్నారు. ఈ క్రమంలో లోకేశ్కు అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలనే వ్యాఖ్యలపై మీ కామెంట్.
కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
కాలిఫోర్నియాలో తొలి మహిళా జడ్జిగా జయ బాడిగ ఇటివల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు X వేదికగా అభినందనలు తెలిపారు. జయ బాడిగ విజయవాడకు చెందిన వారు కావడం గర్వకారణమని అన్నారు. ఆమె పదవి కాలాన్ని విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని అన్నారు.
కృష్ణా నది వద్ద శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని వన్ టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి తెలిపారు. కృష్ణానది వద్ద స్థానికులు గుర్తుతెలియని మృతదేహం ఉందన్న ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా 50 సంవత్సరాల వ్యక్తి గల మృతదేహం లభ్యమైందని సీఐ తెలిపారు. ఆ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
బెంగుళూరు రేవ్ పార్టీలో అరెస్టై రిమాండ్కు పంపబడ్డ వారిలో విజయవాడ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్వాహకులలో విజయవాడకు చెందిన బుకీ వాసు A1గా, వన్టౌన్కు చెందిన D. నాగబాబు A3గా FIR నమోదైనట్లు తాజాగా సమాచారం వెలువడింది. బుకీ వాసు పుట్టినరోజు సందర్భంగా పార్టీ నిర్వహించగా పోలీసుల దాడులలో రేవ్ పార్టీ ఘటన వెలుగు చూసింది.
విధులలో అలసత్వం ప్రదర్శించిన జగ్గయ్యపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం ఎం. వాణి, విజయవాడ మొగల్రాజపురం BSRK హైస్కూల్ హెచ్ఎం ఎల్. రమేశ్ను DEO యూవీ. సుబ్బారావు తాజాగా సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకల కారణంగా వాణిని, విద్యాశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రమేశ్ను సస్పెండ్ చేసినట్లు DEO సుబ్బారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
బాపులపాడు మండలం రంగన్నగూడెంకి చెందిన తుమ్మల కృష్ణ చైతన్య ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2023లో జాతీయ స్థాయిలో 74వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం అమరావతి సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. IFSలో జాతీయ ర్యాంక్ సాధించిన కృష్ణ చైతన్యను పలువురు అభినందించారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని LLB 4వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ (రెగ్యులర్& సప్లిమెంటరీ) పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 4వ తేదీలోపు అపరాధరుసుం లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజుల వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ను తనిఖీ చేసుకోవాలని కోరాయి.
Sorry, no posts matched your criteria.