India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు టీడీపీ నేత గౌరినాథ్ను దారుణంగా హత్యచేయించారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని ప్రజలు ఛీ కొట్టినా, బాబాయ్ని చంపినట్టే జననాన్ని జగన్ చంపుతున్నాడని మండిపడ్డారు. జగన్ హత్యా రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని నేడు ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. కాగా నిన్న కేంద్రమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో గన్నవరంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రేపు ఉదయం విజయవాడలోని A కన్వెన్షన్లో పార్టీనేతలతో సమావేశం కానున్నారు.
మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న దాడుల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటి ముందు ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.
ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల మఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరుకానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగాణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
గన్నవరంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా 12వ తేదీన జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు గామన్ బ్రిడ్జి- దేవరపల్లి- జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. హనుమాన్ జంక్షన్ నుండి వచ్చే వాహనాలు నూజివీడు- మైలవరం- ఇబ్రహీంపట్నం- నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్లో వెల్లడించింది. విజయవాడ- అలంకార్, సాయిరాం స్క్రీన్స్, గుడివాడ- భాస్కర్ కాంప్లెక్స్, ఉయ్యూరు- సాయి మహల్, మచిలీపట్నం- రేవతి & శ్రీ కృష్ణా కాంప్లెక్స్, నూజివీడు-ద్వారకా స్క్రీన్ 2 అన్నారు.
గన్నవరం మండలం కేసరపల్లి IT పార్క్ వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్లే వాహనాలను కత్తిపూడి నుంచి జాతీయ రహదారి 216 మీదుగా ఒంగోలు వైపు మళ్లిస్తామన్నారు. చెన్నై నుంచి విశాఖ వచ్చే వాహనాలు ఒంగోలు, రేపల్లె మీదుగా వయా మచిలీపట్నం- లోసరి బ్రిడ్జి- నరసాపురం- అమలాపురం- కత్తిపూడి విశాఖపట్నం వైపు మళ్లిస్తామన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్లి కోడి గుడ్లు విసిరిన ఘటనలలో పలువురు టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు వారికి మధ్య జరిగిన వాగ్వాదంపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులకు ఆటంకం కలిగించిన దర్శిత్, సత్యసాయి, తదితురులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.
తాజా ఎన్నికల్లో NTR జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP అభ్యర్థులు గెలిచారు. త్వరలో చంద్రబాబు CMగా కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ క్రమంలో NTR నుంచి మంత్రివర్గంలో ఎవరు చోటు దక్కించుకుంటారనే చర్చ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జరుగుతోంది. బొండా ఉమా, వసంత కృష్ణ ప్రసాద్, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య ముందువరుసలో ఉన్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుందని అనకుంటున్నారో COMMENT చేయండి.
Sorry, no posts matched your criteria.