India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాగల్లు-రాజమండ్రి సెక్షన్ల మధ్య ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ- కాకినాడ పోర్ట్ మెము ఎక్స్ప్రెస్ రైళ్లను యధావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు విజయవాడ రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.17257 విజయవాడ- కాకినాడ పోర్ట్, నం.17258 కాకినాడ పోర్ట్- విజయవాడ రైళ్లను యధావిధిగా నడుపుతామన్నారు.

విజయవాడ భవానిపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. భవానిపురం హెడ్ వాటర్ వర్క్ వద్ద మంగళవారం మధ్యాహ్నం మృతదేహం ఉందని స్థానికుల ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 సంవత్సరాల వరకు ఉంటుందని వారు వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.

DSC పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం అభ్యర్థులు 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ స్టడీ సర్కిల్ ఎన్టీఆర్ జిల్లా సంచాలకులు ఈ.కిరణ్మయి తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో పండరీపురం రోడ్ నెం.8, అశోక్నగర్లోని స్టడీ సర్కిల్లో కుల, ఆదాయ, విద్యార్హతల ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు స్టైఫండ్ ఇస్తామన్నారు.

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా కాకినాడ టౌన్(CCT)- లింగంపల్లి(LPI) మధ్య నడిచే స్పెషల్ రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.07445 CCT- LPI రైలును జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు వారంలో 3 రోజులు, నం.07446 LPI- CCT రైలును జూలై 2 నుంచి అక్టోబర్ 1 వరకు వారంలో 3 రోజులు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడతో పాటు గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయన్నారు.

మాజీ సీఎం జగన్ది కిమ్ను తలదన్నే పెత్తందారీ వ్యవహార శైలి అని TDP సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. ‘ఆయన ఇంట్లో ఉంటేనే 986 మందితో రక్షణ. బయటకొస్తే పరదాలతో పాటు 3 రెట్లు అదనం. కుటుంబం, రాజభవనాల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. తాడేపల్లి ప్యాలెస్కు దగ్గర్లోని అరాచకాలు పట్టించుకోలేదు. ప్రజల భద్రత గాలికి వదిలేసి విలాసాలు అనుభవించే నువ్వు పెత్తందారివి కాక మరేంటి?’ అని జగన్ను ఆయన Xలో ప్రశ్నించారు.

విజయవాడలో ఎలాంటి అనుమతులు, ప్లాన్ అప్రూవల్ లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మిస్తున్నారంటూ నగర పాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. విద్యాధరపురం కార్మిక శాఖ స్థలంలో కనీసం ప్లాన్ అప్రూవల్ కూడా లేకుండా నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం పూర్తిగా అక్రమ నిర్మాణమని అధికారులు పేర్కొన్నారు. 7 రోజుల్లోపు సమాధానం ఇవ్వకపోతే కూల్చివేస్తామని వారు వెల్లడించారు.

ఉంగుటూరు- ఆత్కూరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టమాటా లోడుతో వెళుతున్న లారీకి పంక్చర్ పడగా, టైరు మార్చేందుకు అటుగా వెళ్తున్న టాటా మ్యాజిక్ డైవర్ సాయం వచ్చాడు. ఈ క్రమంలో సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి వీరిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు AP పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 508 ఎస్టీటీలతో కలిపి మొత్తం 1213 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

జగ్గయ్యపేటలో డయేరియా కేసుల నమోదైన నేపథ్యంలో 26 చోట్ల నీటి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు NTR జిల్లా డీఎంహెచ్వో సుహాసిని చెప్పారు. క్లోరినేషన్ చేయని నీటిని తాగిన కారణంగానే ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. కొందరు హోటళ్లు, పాస్ట్ఫుడ్ సెంటర్లలో అపరిశుభ్ర ఆహారం తీసుకున్నట్లు చెప్పారు. అతిసారం వ్యాపించిన ప్రాంతాల్లోని ప్రజలు కొన్నిరోజులు మాంసాహారం తినొద్దని సూచించినట్లు ఆమె వివరించారు.

దూరవిద్యా విధానంలో MBA, పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్సిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్ వర్గాలు సూచించాయి.
Sorry, no posts matched your criteria.