Krishna

News June 24, 2024

కృష్ణా: స్పందన ఇకపై ‘మీ కోసం’

image

ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం పేరు మారింది. ప్రభుత్వ మార్పిడితో స్పందన కార్యక్రమాన్ని ‘మీ కోసం’ కార్యక్రమంగా పేరు మార్చారు. మీ కోసం పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News June 23, 2024

వెంకయ్యను కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

image

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ వెంకయ్య నాయుడిని కలిశారు. ఈ మేరకు ఆదివారం ఆయన్ను ఢిల్లీలో కలిసినట్లు ఎంపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ పుష్పగుచ్ఛం అందజేశారు.

News June 23, 2024

ఈనెల 27న తాడిగడపకు సీఎం చంద్రబాబు

image

పెనమలూరు మండలం తాడిగడపలో ఈనెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణాన్ని అధికారులతో కలిసి మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎస్పీ నయీమ్ అస్మి, పాల్గొన్నారు.

News June 23, 2024

పెనమలూరు: వేరే కాపురం పెట్టమన్నందుకు కుమారుడు సూసైడ్

image

తండ్రి తన ఇంట్లో వద్దు వేరే కాపురం పెట్టుకోమన్నాడనే
మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కట్టా దుర్గ, ఆనంద్ ప్రసాద్ భార్యాభర్తలు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కుమారుడిని, తండ్రి ఓంకార్ వేరే కాపురం పెట్టుకోవాల్సిందిగా కొద్ది రోజుల కిందట సూచించాడు. ఈ ఘటనతో కలత చెందిన కుమారుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 23, 2024

కృష్ణా: డిప్యూటీ స్పీకర్‌గా మండలి బుద్ధప్రసాద్..?

image

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై కసరత్తు నడుస్తోంది. అయితే ఈ పదవిని జనసేన తీసుకునే విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ పార్టీ అధినేత పవన్ తెలిపారు. అదే జరిగిదే అవనిగడ్డ MLA మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయిస్తారని టాక్. రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానున్నట్లు సమాచారం.

News June 23, 2024

విజయవాడ: మాచవరం సీఐకు పవన్ కళ్యాణ్ ఫోన్

image

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం మాచవరం ఇన్‌స్పెక్టర్‌ గుణరామ్‌కు ఫోన్‌ చేశారు. ఓ యువతి అదృశ్యం కేసుపై ఆరా తీశారు. జంగారెడ్డిగూడెంకి చెందిన ఓ యువతి విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తూ అదృశ్యమయింది. బాలిక తల్లి మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేగవంతంగా బాలిక ఆచూకీ కనుగొనాలని సీపీ రామకృష్ణను కోరారు. 

News June 23, 2024

జర్నలిస్టుల భీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం: మంత్రి పార్థసారథి

image

జర్నలిస్టుల ప్రమాద భీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని, సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కారం చేస్తామని మంత్రి కొలుసు పార్థ సారథి హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం తాడిగడపలోని మంత్రి కార్యాలయంలో పార్థసారథిని కలిశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

News June 22, 2024

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు బదిలీ

image

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఢిల్లీరావును జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఉన్న పి. సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు.

News June 22, 2024

కృష్ణా జిల్లాలో 2 నెలల పాటు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’

image

జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.

News June 22, 2024

కృష్ణా: బావపై కత్తితో దాడి చేసిన బావమరుదులు

image

తమ చెల్లెల్ని పుట్టింటికి పంపలేదన్న కోపంతో బావపై బావమరుదులు దాడి చేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఆదర్శనగర్‌కు చెందిన అబ్దుల్లా భార్య పుట్టింటికి వెళతానని అడుగగా పంపలేదు. ఈ విషయాన్ని తన అన్నలకు చెప్పడంతో కోపోద్రిక్తులైన వారు శనివారం అర్ధరాత్రి బావ అబ్దుల్లాపై కత్తితో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్దుల్లాను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.