Krishna

News May 21, 2024

కృష్ణా: ఆ 6,289 ఓట్లు ఎవరికి పడ్డాయో.?

image

గుడివాడ అసెంబ్లీ స్థానంలో తాజా ఎన్నికల్లో 82.51% పోలింగ్ నమోదు కాగా 1,68,537 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో పురుషులు 81,119, స్త్రీలు 87,408, ఇతరులు 10 మంది ఓటేశారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు 6,289 ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్లు తమకే పడ్డాయని అటు వైసీపీ, టీడీపీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి వెనిగండ్ల రాము, కొడాలి నాని పోటీ చేస్తుండగా జూన్ 4న తీర్పు వెలువడనుంది.

News May 20, 2024

ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్: కలెక్టర్

image

ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా ఓట్ల లెక్కింపు వేగవంతం అవుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో డెమో నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా లెక్కించాలనే అంశంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.

News May 20, 2024

ఎన్టీఆర్‌కి కొడాలి నాని శుభాకాంక్షలు

image

నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని X వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ.. ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్న పాత ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

News May 20, 2024

కృష్ణా: విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్టినెన్స్ కారణంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం, గుంటూరు మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.17239 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌ను జూన్ 3 వరకు, నం.17240 విశాఖపట్నం- గుంటూరు ట్రైన్‌ను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.

News May 20, 2024

కృష్ణా: ‘ప్రతి 15 రోజులకు శాఖల వారీ సమీక్షలు’

image

జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలయ్యే కార్యక్రమాలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సమీక్షించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతులకు గతంలో మాదిరిగా అవసరమైన ఎరువులు విత్తనాలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

News May 20, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై, భువనేశ్వర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 10 నుంచి జూలై 1 వరకు ప్రతి సోమవారం చెన్నై, భువనేశ్వర్ (నెం.06073), జూన్ 11 నుంచి జూలై 2 వరకు ప్రతి మంగళవారం భువనేశ్వర్, చెన్నై (నెం.06074) మధ్య ఈ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News May 20, 2024

ఇబ్రహీంపట్నంలో చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి

image

విజయవాడ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ రమణ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందు ఆదివారం మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి చెక్‌పోస్ట్ వద్ద విధులకు హాజరయ్యేందుకు వస్తున్న ఏఎస్ఐ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వేగంగా వస్తున్న కారు ఆయనను ఢీ కొంది. కాగా చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయవాడ కమిషనర్ రామకృష్ణ నివాళులర్పించారు.

News May 20, 2024

కృష్ణా: వైసీపీ హ్యాట్రిక్‌కు ఛాన్స్ ఉన్న నియోజకవర్గాలు ఇవే

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరు, పామర్రు వైసీపీకి హ్యాట్రిక్ రేసులో ఉన్నాయి. గతంలో జరిగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ రెండు పర్యాయాలు గెలిచి విజయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందో, కూటమి గెలిచి వైసీపీ హ్యాట్రిక్‌ను అడ్డుకుంటుందో చూడాలి. మరి మీ కామెంట్.

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు రూ.100

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!