India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంపలగూడెం పడమట దళితవాడకు చెందిన గోరంట్ల తిరపయ్య, భార్య జమలమ్మలు షార్ట్ సర్క్యూట్తో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి రేకుల షెడ్డుపై ఉన్న సర్వీస్ వైరుకు, బట్టల ఆరేసుకునే జీఐ వైర్ దగ్గరగా ఉండటంతో షాక్ వచ్చింది. అయితే బట్టలు తీసే ప్రయత్నంలో జములమ్మ (48) షాక్కు గురికాగా, గమనించిన భర్త తిరుపతయ్య (52) భార్యను కాపాడే ప్రయత్నం చేయగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
విజయవాడలోని పెట్రోల్ బంక్ యజమానులను బ్లేడ్ బ్యాచ్ బెదిరిస్తుందని కొన్ని పత్రికల్లో, చానెళ్లలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. విజయవాడకు చెందిన బొజ్జ డానియల్ అనే వ్యక్తి బాటిల్లో పెట్రోల్ కొట్టమని పలు బంకుల వద్దకు వెళ్లి సిబ్బందిని అడిగినట్లు చెప్పారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో డానియల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హార్ట్ స్ట్రోక్కి గురై శస్త్ర చికిత్స చేసిన అనంతరం విజయవాడలోని ఓ ప్రయివేటు హాస్పిటల్లో కోలుకుంటున్న, మాజీ బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుని మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆదివారం పరామర్శించారు. త్వరగా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.
ఎలక్షన్ ఆధారిత కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేయాలనీ ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. జిల్లా పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి, చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
హజ్ యాత్ర నిర్వహణపై కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ అంశంపై తాజాగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి 30 వరకూ గన్నవరం మండలం కేసరిపల్లిలోని జామియా మసీదు వద్ద హజ్ యాత్రికులకై ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిబిరం ద్వారా హజ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇబ్రహీంపట్నంలో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రమణకు తీవ్ర గాయాలయ్యాయి.. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కారు కాలేజ్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న రమణను ఢీకొట్టింది. ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ సాదిక్ హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ కారణంగా రాయనపాడు మీదుగా విశాఖపట్నం(VSKP), మహబూబ్నగర్(MBNR) మధ్య ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.12861 VSKP- MBNR ట్రైన్ను ఈ నెల 19 నుండి జూన్ 3 వరకు, నెం.12862 MBNR- VSKP ట్రైన్ను ఈ నెల 20 నుండి జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా తిరుపతి, కాకినాడ మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నెం.17249 తిరుపతి- కాకినాడ టౌన్ ట్రైన్ను జూన్ 3 వరకు, నెం.17250 కాకినాడ టౌన్- తిరుపతి ట్రైన్లను జూన్ 4 వరకూ రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ప్రయాణికుల సౌకర్యార్ధం విజయవాడ మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య ప్రయాణించే రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నెం. 06095 తాంబరం-సత్రాగచ్చి
ట్రైన్ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం, నెం.06096 సత్రాగచ్చి-తాంబరం ట్రైన్ను జూన్ 7 నుంచి జూలై 5 వరకూ ప్రతి శుక్రవారం పొడిగిస్తున్నట్లు SCR తెలిపింది.
ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై ఎగ్మూరు నుంచి సత్రాగచ్చి (పశ్చిమ బెంగాల్)కు స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం. 06077 ట్రైన్ను జూన్ 1 నుంచి 29 వరకు ప్రతి శనివారం చెన్నై ఎగ్మూరు, సత్రాగచ్చి మధ్య నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.