India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో NDA కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం 41,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ రౌండ్లలో బాలశౌరి 1,32,678 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 91,104 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ ఇప్పటి వరకు 6,895 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 స్థానాల్లో నూజివీడు మినహా మిగిలిన 15 స్థానాలలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉంది.
*మచిలీపట్నం
*అవనిగడ్డ
*పామర్రు
*గుడివాడ
*పెనమలూరు
*పెడన
*కైకలూరు
*విజయవాడ పశ్చిమ
*విజయవాడ తూర్పు
*విజయవాడ సెంట్రల్
*మైలవరం
*తిరువూరు
*నందిగామ
*జగ్గయ్యపేట
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆయనకు భారీ భద్రత కల్పించేలా అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం 155 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి, చంద్రబాబు నివాసానికి టీడీపీ కూటమి శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.
విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి షేక్ ఆసిఫ్సై 5149 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్పై 18911 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేవలం నూజివీడులో మాత్రమే ప్రస్తుతానికి వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీంతో ఉమ్మడి కృష్ణాలో టీడీపీ, జనసేన, BJP శ్రేణులు భారీ స్థాయిలో సంబరాలకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో కార్యాలయాల వద్దకు భారీగా ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.
మచిలీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పేర్ని కిట్టుపై 1979 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.
పామర్రులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్ల కుమార్ రాజా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కైలే అనీల్ పై 2403 ఓట్ల మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు.
విజయవాడ పార్లమెంట్ తొలి రౌండ్లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 13 వేల ఓట్ల ఆధిక్యంలో తన సమీప ప్రత్యర్థి కేశినేని నానిపై ముందంజలో ఉన్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కింది స్థానాల్లో తొలి రౌండ్లలో NDA కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారని సమాచారం వెలువడింది.
తిరువూరు- కొలికపూడి శ్రీనివాస్(టీడీపీ)
గుడివాడ- వెనిగండ్ల రాము(టీడీపీ)
మచిలీపట్నం- కొల్లు రవీంద్ర(టీడీపీ)
విజయవాడ పశ్చిమ- సుజనా చౌదరి(బిజెపి)
విజయవాడ సెంట్రల్- బొండా ఉమ(టీడీపీ)
Sorry, no posts matched your criteria.