India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో, ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించాలని, అందుకు తగిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బాలాజీ అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన చర్చించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలా ఓట్లు లెక్కించాలో పలు సూచనలు చేశారు.
కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలల డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 8,827 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,687 మంది (98.41%) ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే 1,250 మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 51.13 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద రైలు తగిలి వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 వరకు ఉంటుందని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన యెడల రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం రెవెన్యూ, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు.
హజ్ యాత్రీకుల కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హజ్ యాత్ర శిబిరం నిర్వహణపై సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద దుర్గాపురం GST రోడ్డులో మార్గాన ఉన్న ఈద్గా జమా మసీదు వద్ద హజ్ యాత్ర ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
మండలలోని ఉల్లిపాలెం గ్రామ సమీపాన కృష్ణా నదిలో గుర్తు తెలియని మృత దేహం లభ్యమైందని కోడూరు ఎస్ఐ శిరీష తెలిపారు. శుక్రవారం రాత్రి ఉల్లిపాలెం పడవల రేవు సమీపంలో మృతదేహం కని పంపించిందని స్థానికులు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుని వయస్సు 40-45 సంవత్సరాలు ఉంటుందని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖననం చేశామని చెప్పారు.
మైలవరం నుంచి తొత్తులను తెచ్చుకొని పెనమలూరులో గెలవాలనుకున్న జోగి రమేశ్ ప్రయత్నం విఫలమైందని బోడె ప్రసాద్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమపై దాడులు చేశారని మండిపడ్డారు. పోలింగ్ రోజు తనకు రావాల్సిన 1,000 ఓట్లు నష్టపోవడానికి ఆయన కారణమన్నారు. తాము ఒక్క మాట చెప్పి ఉంటే ఆ రోజు జోగి రమేశ్ పోరంకి హైస్కూల్ పరిధి దాటేవారు కాదని చెప్పారు. జూన్ 4న ఆట ప్రారంభమవుతుందని బోడె ప్రసాద్ విజయవాడలో అన్నారు.
విజయవాడలో డాక్టర్ రవళి CPR చేసి అయ్యప్పనగర్కు సాయి(6) ప్రాణాలు కాపాడారు. ఈ నెల 5న ఆడుకుంటూ అపస్మార స్థితిలోకి వెళ్లిన బాలుడిని తల్లిదండ్రులు భుజాన వేసుకొని ఆస్పత్రికి బయల్దేరారు. అటుగా వెళ్తూ వీరిని చూసిన డాక్టర్ ఏమైందని అడిగి, చిన్నారిని పరిక్షీంచారు. ఆపై రోడ్డుపై పడుకోబెట్టి CPR చేశారు. 7 నిమిషాల తర్వాత బాలుడిలో కదలిక రాగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై బాలుడు పూర్తిగా కోలుకున్నాడు.
జిల్లాలో ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. జూన్ 4న వెల్లడయ్యే ఫలితాల కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, అభ్యర్థుల మెజారిటీ, గెలుపోటములపై రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గన్నవరం, గుడివాడలో రూ.లక్షకు రూ.2 లక్షలు ఇచ్చేలా పందేలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తులూ బాగా వెనకేసుకుంటున్నారని, 10 శాతం కమీషన్ తీసుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఎన్టీఆర్ జిల్లా సమాచార శాఖకు మంజూరు చేసిన నికాన్ డీ 850 మోడల్ కెమెరాను గురువారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఆయన కార్యాలయంలో సమాచార శాఖ అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేవలం ఒక ఫోటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుత శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఫోటోగ్రఫీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఒక్క ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం ఇమిడి ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.