India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి కేశినేని నాని కంటే ముందంజలో ఉన్నారు.
ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలలో అల్పాహారం కొరత వచ్చిందని ఏజెంట్ల ఆందోళన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగినటువంటి సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడే కౌంటింగ్ రోజున ఇలాంటి పరిస్థితి వచ్చిందని వారు వాపోయారు. సిబ్బందికి భద్రతా, భోజన ఏర్పాట్లు అక్రమంగా ఉండాలని వారి కోరారు.
విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
*నం.07464 విజయవాడ- గుంటూరు
*నం.07465 గుంటూరు- విజయవాడ
*నం.07976 గుంటూరు- విజయవాడ
మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రత్యేక సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్లో పాల్గొని సిబ్బందిని తేలికగా గుర్తించేలా ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు. మీడియాకు సమాచారాన్ని చేరవేయడంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.
కౌంటింగ్ సెంటర్ల పరిసరాలను రెడ్ జోన్ గా ప్రకటించామని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొత్తంగా 1985 సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. సమస్యలను సృష్టించే 12 వేల మందిని గుర్తించి, బైండోవర్ చేశామన్నారు. ఇప్పటి వరకు 1200 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిఘా పెట్టామని స్పష్టం చేశారు.
3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ సీపీ రామకృష్ణ తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ అధికారులకి, సిబ్బందికి సీపీ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన కౌంటింగ్ పాసులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ మెయిన్టెనెన్స్ కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వచ్చే జన శతాబ్ది ఎక్స్ప్రెస్ను(నం.12077) దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారాలు మినహా జూలై 14 వరకు ఈ ట్రైన్ న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ స్టేషన్ల మీదుగా విజయవాడ చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతూ.. తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూన్ 30 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
*నం.07767 రాజమండ్రి- విజయవాడ
*నం.07459 విజయవాడ- రాజమండ్రి
మంగినపూడి బీచ్లో సోమవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బీచ్కి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్కి 9 మంది స్నేహితులు వచ్చారు. వారంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో యువకుడు బీచ్లోకి కొట్టుకుపోయాడన్నారు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరుకి చెందిన భానుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.
ఉమ్మడి కృష్ణాలో TDP-8, YCP-6, JSP-1, BJP-1 చోట్ల గెలుస్తాయని RTV సర్వే తెలిపింది. VJA వెస్ట్-ఆసిఫ్, సెంట్రల్-ఉమా, ఈస్ట్-రామ్మోహన్, నందిగామ-జగన్, మైలవరం-కృష్ణప్రసాద్, తిరువూరు-స్వామిదాస్, జగ్గయ్యపేట-తాతయ్య, గుడివాడ-రాము, పెనమలూరు-బోడె ప్రసాద్, పామర్రు-అనిల్, గన్నవరం-వెంకట్రావు, పెడన- రాము, మచిలీపట్నం-రవీంద్ర, అవనిగడ్డ-బుద్దప్రసాద్, నూజివీడు-ప్రతాప్, కైకలూరు- కె.శ్రీనివాస్ గెలబోతున్నారని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.