India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాజీపేట సెక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున నం.20806, నం.20805 ఏపీ ఎక్స్ప్రెస్లు(AC) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లు జూన్ 22 నుంచి జులై 5 వరకు విజయవాడ- బల్లార్షా- నాగ్పూర్ మీదుగా కాక విజయనగరం- రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

విజయవాడ శివారు గూడవల్లిలో విద్యార్థిని శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పటమట సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. అనంతపురానికి చెందిన జాహ్నవి చదువు నిమిత్తం గూడవల్లి వచ్చింది. శనివారం విద్యార్థిని ఆకస్మికంగా మృతి చెందడంతో పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. జాహ్నవి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

ఎనికేపాడు నివాసి అయిన పెరూరి సత్యనారాయణ (68), గోవిందమ్మ దంపతులపై శుక్రవారం రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. వారు నిర్వహిస్తున్న కిరాణా షాపుకి వచ్చిన ఒక వ్యక్తి బాబాయ్ అంటూ మాట కలిపి షాపు షటర్ దింపి మరొక ఇద్దరితో కలసి వారిద్దరి చేతులు కట్టేసి రూ.1.80 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం దోచేశారు. ఈ ఘటనపై పటమట పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా CCTV ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

“ఫాదర్స్ డే” సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తన తండ్రి సుబ్బారావు జ్ఞాపకాలను పంచుకున్నారు. రైస్ మిల్ నిర్వహించే తన తండ్రి చాలా ప్రశాంతంగా ఉండేవారని రవీంద్ర చెప్పారు. అందరితో మంచిగా ఉండాలని, ఆప్యాయంగా పలకరించాలని చెప్పేవారన్నారు. తన తండ్రి మాటలే తనలో మార్పు తెచ్చాయన్నారు. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం ఆయన వద్ద నేర్చుకున్నానని రవీంద్ర చెప్పారు.

ప.గో జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన 11నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున ఓ బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి విజయవాడకు తీసుకెళ్లాలని సూచించారు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు.

రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ ద్రోణి కారణంగా ఆదివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పొరుగు జిల్లాలైన ఏలూరు, గుంటూరులో సైతం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని కూర్మనాథ్ చెప్పారు.

పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ టీడీపీలో చేరుతున్నారంటూ శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో కథనాలు హల్చల్ చేశాయి. జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ శనివారం విస్తృతంగా ఆ వార్త చక్కర్లు కొట్టింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రతినిధులు స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీలోకి చేరేది లేదంటూ అవన్నీ తప్పుడు కథనాలని తెలిపారు.

కృష్ణా వర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 1వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.

గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పార్థసారథికి ఉమ్మడి జిల్లాలో ఆ శాఖలో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. టిడ్కో ఇళ్ల కేటాయింపులలోను అనేక సమస్యలున్నాయి. మంత్రి సారథి ఈ సమస్యలు పరిష్కరించి ఉమ్మడి జిల్లావాసులకు మేలు చేయాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.

గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రామకృష్ణ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ అరికట్టే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. జంతువుల అక్రమ రవాణా, వధ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.