India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని కొండిపర్రు గ్రామంలో ఓ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి భరించలేక ఆటో డ్రైవర్ వెంకటేశ్ ఇంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఎన్టీఆర్ జిల్లా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఇరు పార్టీల నుంచి కేశినేని బ్రదర్స్ (వైసీపీ తరఫున కేశినేని నాని, కూటమి తరపున కేశినేని చిన్ని) పోటీ చేస్తుండగా.. జూన్ 4న అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారోనని చూడడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ – 2024లో నిర్వహించిన బీటెక్ 7,8 సెమిస్టర్ (స్పెషల్) పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. పరీక్షల ఫలితాలకై వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in / చెక్ చేసుకోవాలని కృష్ణా విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం తెలిపింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు (సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
సూరాయపాలెంలో ఇటీవల జరిగిన దారిదోపిడీ కేసులో బుధవారం భవానీపురం పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య అనే మహిళను తాడేపల్లికి చెందిన ఎనిమిది మంది యువకులు నగదు కోసం బెదిరించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్రలు, రాడ్లు, పోలీసు టోపీ స్వాధీనం చేసుకున్నామన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 2 ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.20811 విశాఖపట్నం- నాందేడ్(జూన్ 1 నుంచి 29), నం.20811 నాందేడ్- విశాఖపట్నం(జూన్ 2 నుంచి 30) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, 3 ఏసీ త్రీ టైర్ ఎకానమీ కోచ్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకటించిన తేదీల్లో ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశామన్నారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు గురువారం పాలీసెట్-2024లో 43,001- 59,000 వరకు ర్యాంక్లు పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని మూడు హెల్ప్లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం జూన్ 7 సీట్లు కేటాయిస్తామని వారు స్పష్టం చేశారు.
ఆన్లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ.. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
Sorry, no posts matched your criteria.