India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు సంఘటన స్థలంలోని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై కృష్ణలంక సీఐ మురళీకృష్ణ స్పందించారు. మృతులు మంగళగిరికి చెందిన మునీర్ బాషా, జరీనా గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.
విజయవాడలో ఆదివారం రాత్రి భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని రాజీవ్ గాంధీ పార్క్ వద్ద యువతీ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ శివారు ఎనికేపాడుకు చెందిన ఇద్దరు స్కూల్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కృష్ణలంక సీఐ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లా పెనమలూరు శివారు గంగూరులో ఆదివారం యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి మందలించిందనే కారణంతో భార్గవ్ (24) ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనమలూరు పోలీసులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో పాలిటెక్నిక్ సీట్ల భర్తీకై నిర్వహించే వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ రేపు సోమవారం నుంచి ప్రారంభం కానుంది. రేపటి నుంచి జూన్ 3వరకు కౌన్సిలింగ్ జరుగుతుందని సంబంధిత వర్గాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, SRR కాలేజీ, ఆంధ్రా లయోలా కళాశాలలో వెబ్ కౌన్సిలింగ్ కోసం ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
దూరవిద్యా విధానంలో డిప్లొమా ఇన్ అపారెల్ మర్చండైజింగ్ కోర్సులో అడ్మిషన్లకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సులో చేరాలనుకున్న విద్యార్థులు జూన్ 30లోపు అడ్మిషన్ పొందవచ్చని ఇగ్నో వర్శిటీ సూచించింది. అడ్మిషన్లకై https://ignouadmission.samarth.edu.in/ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని ఇగ్నో వర్గాలు సూచించాయి.
బాపులపాడు మండలం రేమల్లె మోహన్ స్పింటెక్ క్వార్టర్స్లో శనివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కూలీలు షిఫ్ట్ దిగి క్వార్టర్స్కి వెళ్లి వంట వండుతుండగా గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దేవరాజ్ (2), వనిత (30), సాయినాధ్ (27), లక్ష్మీబాయి (20)లకు తీవ్ర గాయాలవ్వగా.. నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు.
పామర్రులో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఆరుగురికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని SI ప్రవీణ్ కుమార్ రెడ్డి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులో అరెస్టైన నిందితులను తదుపరి చర్యల నిమిత్తం గుడివాడ కోర్టులో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. కేసు విచారించిన న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించామని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
కొల్లేరు సరస్సులోని ఆటపాక పక్షుల కేంద్రంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో వారం రోజులుగా బోటు షికారు నిలిచిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బోటు షికారు లేదని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రానికి ఏటా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలి వస్తుంటారు. ప్రస్తుతం సరస్సులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో కళావిహీనంగా మారింది.
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్ష ను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. ఈ పరీక్షకు 1460 మంది అభ్యర్థులకు గాను 888 మంది పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షను 08 పరీక్ష కేంద్రాలలో నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష ను ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించామన్నారు.
విజయవాడ- కాజీపేట సెక్షన్లో మూడో లైన్ పనులు జరుగుతున్నందున ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లు ఈ నెల 29 వరకు మధిర(TG) స్టేషన్లో ఆగవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాయి.
.నం.12861 విశాఖపట్నం- మహబూబ్నగర్
.నం.17201 గుంటూరు- సికింద్రాబాద్
.నం.12713 విజయవాడ- సికింద్రాబాద్
.నం.12705 గుంటూరు- సికింద్రాబాద్
Sorry, no posts matched your criteria.