India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్ – బెంజిసర్కిల్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్ రూట్కు మళ్లిస్తారు. * ఆటోనగర్ వైపు నుంచి బస్టాండ్ వెళ్లే వాహనాలు ఆటోనగర్ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.
జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూములను మంగళవారం ఎన్నికల అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత తదితర చర్యలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని ఓటర్లు ఎక్కువమందే వినియోగించుకున్నారు. 1,006 మంది నోటాకు జై కొట్టారు. నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓటింగ్ శాతం పరంగా నోటా 6వ స్థానంలో నిలిచింది. – మీరెపుడైనా నోటాకు ఓటేశారా..?
అనివార్య కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోని ఉద్యోగులు నేడు, రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అంతర్ జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నం పాండురంగ హైస్కూల్ లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రధాని మోదీ బుధవారం విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ రోజు మోదీ పర్యటించే 2 కి.మీ పరిధిలో రెడ్ జోన్(నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఆ రోజు పీవీఆర్ మాల్ వద్దకు ప్రధాని రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు(1.3కి.మీ) రోడ్ షో నిర్వహిస్తారు. 5 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ తెలిపారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా పవన్ రానున్నట్లు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని హెచ్ మార్ట్ వద్ద ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
విస్సన్నపేట టౌన్లో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. తిరువీధి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తోట కాపలగా ఉండగా మామిడి తోటకు సాయంత్రం నీళ్లు పెడదామని మోటార్ వేయగా కరెంట్ షాక్కు గురయ్యాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఈ కింది హెల్ప్ లైన్ ఫోన్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు.
హెల్ప్ లైన్ నంబర్లు :
గన్నవరం – 9885970848
గుడివాడ – 9676993147
పెడన – 9553125124
మచిలీపట్నం – 9010021352
అవనిగడ్డ – 7981826714
పామర్రు – 9989347699
పెనమలూరు – 9966485895
కైకలూరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తరఫున ప్రముఖ సినీ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనను గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. ఆటపాక నుంచి ఏలూరు రోడ్డు వరకు రోడ్ షో ద్వారా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
Sorry, no posts matched your criteria.