India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెనమలూరు మండలం కానూరు గ్రామానికి చెందిన ఆరేపల్లి వాగ్దేవి (8) మంళగవారం <<13291695>>రాత్రి అదృశ్యమైంది. <<>>తమ పాప కనబడుటలేదని తండ్రి నాగరాజు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెనమలూరు సీఐ రామారావు మీడియాకు తెలిపారు. పాప గురించి ఆచూకీ తెలిసినవారు పెనమలూరు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సీల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖల కార్యక్రమాలు ప్రతివారం సమీక్షిస్తామని అన్నారు.
ఈ నెల 22వ తేదీ బుధవారం నుంచి అగ్ని -వీర్-వాయు ‘సంగీతకారుల’ కోసం భారత వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం తెలిపారు. ఆసక్తిగల అవివాహితులైన స్త్రీ, పురుషులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ ఈ మేరకు సూచించారు.
కంకిపాడు మండలం దావులూరులో దారుణం చోటు చేసుకుంది. అంగవైకల్యంతో ఉన్న ‘దివ్యాంగురాలి’ పై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారని బాలిక తల్లి కంకిపాడు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు ‘రెండు వారాల’ నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండటంతో.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో గర్భవతని తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సందీప్ తెలిపారు.
ట్రాక్ భద్రతా పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు, విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లను కొద్ది రోజులపాటు రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) తెలిపింది. ఈ మేరకు ట్రైన్ నెం.22701 విశాఖపట్నం- గుంటూరు, నెం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్లను మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
అమెరికాలో విజయవాడ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. 2004-09 వరకు మచిలీపట్నం ఎంపీగా చేసిన బాడిగ రామకృష్ణ కుమార్తె అయిన జయ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె ఇదే కోర్టులో కమిషనర్గా వ్యవహరిస్తున్నారు. దీంతో అమెరికాలో జడ్జిగా నియమితులైన తొలి తెలుగు మహిళగా జయ రికార్డు సృష్టించారు.
జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం కృష్ణా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 16 అసెంబ్లీ, 2 MP స్థానాలున్నాయి. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటేశారని మంత్రి జోగి రమేశ్, కొడాలి నాని తదితరులు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని దేవినేని ఉమా, బుద్దా వెంకన్న తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
జగ్గయ్యపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని తొర్రకుంటపాలెంలో ఓ మహిళ గృహంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ జానకి రామ్, పట్టణ-1 ఎస్సై సూర్యభగవాన్, సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
గుడివాడ అసెంబ్లీ స్థానంలో తాజా ఎన్నికల్లో 82.51% పోలింగ్ నమోదు కాగా 1,68,537 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వీరిలో పురుషులు 81,119, స్త్రీలు 87,408, ఇతరులు 10 మంది ఓటేశారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే మహిళల ఓట్లు 6,289 ఎక్కువగా ఉన్నాయి. ఈ ఓట్లు తమకే పడ్డాయని అటు వైసీపీ, టీడీపీ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి వెనిగండ్ల రాము, కొడాలి నాని పోటీ చేస్తుండగా జూన్ 4న తీర్పు వెలువడనుంది.
ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా ఓట్ల లెక్కింపు వేగవంతం అవుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో డెమో నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా లెక్కించాలనే అంశంపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు.
Sorry, no posts matched your criteria.