India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబుతో బీజేపీ జాతీయ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఉదయం తాడేపల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై వారితో చర్చించారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర విషయాలపై చర్చ జరిపినట్లు సమాచారం.
ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏప్రిల్ 28న ఆదివారం ఉదయం 7 గంటలకు కృష్ణా జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్ 23 పురుషుల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్ త్రినాధ్ రాజ్ గురువారం తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల వారు ఎవరైనా ఆధార్ కార్డ్, జనన ధ్రువీకరణ పత్రంతో ఈ ఎంపికలలో పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారులు తమ సొంత క్రీడా దుస్తులతో హాజరవ్వాలని చెప్పారు.
పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా టాపర్గా నిలిచిన గుడివాడకు చెందిన ఏకేటీపీ ఎంజీహెచ్ హై స్కూల్ విద్యార్థి అల్లంపల్లి భాను ప్రసన్నను జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా అభినందించారు. మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో ప్రసన్నను ఆమె సత్కరించారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ప్రసన్న 590 మార్కులు సాధించారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు మొత్తం 142 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎంపీ స్థానానికి దాదాపు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకరిద్దరు మాత్రమే ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేయాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.
విజయవాడకు చెందిన IFS అధికారి అబ్దుల్ రవూఫ్ తెలుగువారి ఖ్యాతిని పెంచారు. సివిల్స్ ప్రిపేర్ అయిన ఇతను మూడో ప్రయత్నంలో IFSకు సెలక్ట్ అయ్యారు. 2022-24 శిక్షణ సమయంలో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి 7 బంగారు పతకాలు సాధించారు. బుధవారం డెహ్రడూన్లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీటిని అందుకున్నారు.
ఇవే తన చివరి ఎన్నికలని అవనిగడ్డ జనసేన MLA అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం దింటిమెరకలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే నాలుగేళ్లుగా బీడుగా ఉన్న 4వేల ఎకరాలను సాగు భూమిగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తీర ప్రాంత గ్రామాల పరిరక్షణ కోసం కరకట్ట మరమ్మతులు వేయించి తాగు, సాగు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.
నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత, లబ్బీపేటకు చెందిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థిగా పత్రాలను దాఖలు చేశారు. అలాగే మరొక కవి, శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మంగళగిరి నుంచి శాసనసభకు ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు.
విజయవాడ పోలీస్ కమీషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి రామకృష్ణ ని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలలోపు విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న కాంతి రానా టాటాను ఎన్నికలకు సంబంధం లేని విధులు అప్పగించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
మండలంలోని మునిపెడ అడ్డ రోడ్డు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. విజయవాడ నుంచి నరసాపురం పెళ్లికి వెళ్తున్న కారు మునిపెడ వద్ద రోడ్డుపై పడి ఉన్న గేదెను తప్పించబోయి పంట బోధిలోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పెళ్లి కుమార్తె తల్లి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ 6వ రోజుకి చేరింది. 6వ రోజైన బుధవారం జిల్లాలో 57 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం MP స్థానానికి 06 దాఖలవ్వగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం అసెంబ్లీకి 08, గన్నవరం09, అవనిగడ్డ08, పెడన07, పామర్రు05, పెనమలూరు09, గుడివాడ 05నామినేషన్లు దాఖలైనట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.