Krishna

News April 15, 2024

విజయవాడ: పోలీసుల అదుపులో అనుమానితులు.?

image

విజయవాడలో సీఎం జగన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్ గన్లు తదితర వస్తువులను వాడే వాళ్ల గురించి ఆధారలు సేకరిస్తున్నట్లు సమాచారం. గత 15 రోజులుగా గంగానమ్మ గుడి పరిధిలోని కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా ఆరు బృందాలతో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

News April 15, 2024

నేడు సీఎం జగన్ షెడ్యూల్ ఇదే

image

సీఎం జగన్ యాత్ర నేడు కేసరపల్లి నుంచి ప్రారంభం కానుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారని తెలిపారు.

News April 15, 2024

విజయవాడ: ‘జగన్‌పై దాడి ఘటనలో దోషులను వెంటనే పట్టుకోవాలి’

image

సీఎం జగన్‌పై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదన్నారు. జగన్‌పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని అన్నారు. అనంతరం దోషులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.  

News April 14, 2024

విజయవాడలో 500 కేజీల గంజాయి స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూరల్ మండలం గూడవల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 500 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ.. తనిఖీ చేస్తుండగా గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 14, 2024

ఆకాశాన్నంటుతున్న నూజివీడు రసాల ధరలు

image

మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూజివీడులో చిన్నరసాల ధర (డజన్) రూ.300 నుంచి రూ.350 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నల్ల తామర వ్యాప్తితో ఈ ఏడాది మామిడి పూత చాలావరకు మాడిపోయింది. దీంతో దిగుబడి పడిపోయి.. ఊరగాయకు సైతం కాయలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ధరలను చూస్తుంటే ఇక ఈ ఏడాది మామిడి పండ్లు తినడం ‘భారమే’నంటున్నారు.

News April 14, 2024

సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా

image

సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా పడింది. శనివారం రాత్రి విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేయగా జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు సీఎం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పెడనలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15న జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News April 14, 2024

విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌‌తో రాళ్లదాడి

image

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.

News April 13, 2024

విజయవాడ: జగన్‌పై క్యాట్‌బాల్‌‌తో రాళ్లదాడి

image

విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్‌నగర్‌లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.

News April 13, 2024

కంకిపాడులో వివాహిత ఆత్మహత్య

image

ఈడుపుగల్లులో శ్రీపతి శ్రావ్య (25)అనే వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావ్య డైరీ కనిపించడం లేదని, ఆ డైరీని స్వాధీనం చేసుకుంటే నిజాలు బయటకు వస్తాయని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

News April 13, 2024

విజయవాడలో CM జగన్ భారీ బహిరంగ సభ

image

సీఎం జగన్ ఈ నెల 27 లేదా 28న విజయవాడ వెస్ట్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే రోజు ఆయన మరో 3 బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 24న టెక్కలిలో ముగియనుంది. 25న జగన్ నామినేషన్ అనంతరం, ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!