India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కైకలూరు అసెంబ్లీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. బుధవారం కలిదిండి మండలం కోరుమల్లులో సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతందన్నారు. వేమవరప్పాడు, తామరకొల్లు, వింజరం, ఆచవరం గ్రామాల మీదుగా కైకులూరుకు చేరుకుని హీరో వెంకటేష్ అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లడతారన్నారు. కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విజయవాడలో మోదీ టూర్ సందర్భంగా.. గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలను మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు ట్రాఫిక్ మళ్లించారు. బుడంపాడు అండర్ పాస్ నుంచి నారాకోడూరు, చేబ్రోలు, పొన్నూరు, భట్టిప్రోలు, రేపల్లె, అవనిగడ్డ, మచిలీపట్నం మీదుగా హనుమాన్ జంక్షన్ దగ్గర్లోని NH16 వైపు వెళ్లాలి. GNT నుంచి HYD వెళ్లే వాహనాలు చుట్టుగుంట నుంచి పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదుగా ప్రయాణించాలి.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* వైజాగ్ – హైదరాబాద్ మధ్య <<13204421>>రాకపోకలు<<>> సాగించే భారీ వాహనాలు హనుమాన్ జంక్షన్, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం రూట్లో వెళ్లాలి.
* వైజాగ్- చెన్నై మధ్య ప్రయాణించే భారీ వాహనాలు హనుమాన్జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, పులిగడ్డ, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట మార్గంలో వెళ్లాలి.
మధ్యాహ్నం 2 – రాత్రి 9 గంటల వరకు <<13204379>>ట్రాఫిక్ ఆంక్షలు<<>>
* మచిలీపట్నం- విజయవాడ మధ్య తిరిగే బస్సులు ఆటోనగర్ గేటు, మహానాడు రోడ్డు, రామవరప్పాడు రింగ్, పడవల రేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి. * ఏలూరు- విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సులు రామవరప్పాడు రింగ్, పడవలరేవు, BRTS రోడ్డు, సీతన్నపేట గేట్, ఏలూరు లాకులు, పాత ప్రభుత్వాసుపత్రి రూట్లో వెళతాయి.
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. * RTC వై జంక్షన్ – బెంజిసర్కిల్ వరకు ఎంజీ రోడ్డుపై వాహనాలు అనుమతించరు. * ఎంజీ రోడ్డుపై ప్రయాణించే వాహనాలను ఏలూరు రోడ్డు, 5వ నంబర్ రూట్కు మళ్లిస్తారు. * ఆటోనగర్ వైపు నుంచి బస్టాండ్ వెళ్లే వాహనాలు ఆటోనగర్ గేటు, పటమట, కృష్ణవేణి స్కూల్ రోడ్డు, స్క్యూ బ్రిడ్జి, కృష్ణలంక మీదుగా ప్రయాణించాలి.
జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూములను మంగళవారం ఎన్నికల అధికారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత తదితర చర్యలను చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చని సందర్భంలో NOTAకు ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ 2013లో అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ అవకాశాన్ని ఓటర్లు ఎక్కువమందే వినియోగించుకున్నారు. 1,006 మంది నోటాకు జై కొట్టారు. నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఓటింగ్ శాతం పరంగా నోటా 6వ స్థానంలో నిలిచింది. – మీరెపుడైనా నోటాకు ఓటేశారా..?
అనివార్య కారణాల వల్ల పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోని ఉద్యోగులు నేడు, రేపు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పించినట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. అంతర్ జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నం పాండురంగ హైస్కూల్ లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు.
ప్రధాని మోదీ బుధవారం విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ రోజు మోదీ పర్యటించే 2 కి.మీ పరిధిలో రెడ్ జోన్(నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. డ్రోన్లు, బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఆ రోజు పీవీఆర్ మాల్ వద్దకు ప్రధాని రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు(1.3కి.మీ) రోడ్ షో నిర్వహిస్తారు. 5 వేల మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
బాపులపాడు మండలంలోని హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 8వ తేదీన పర్యటిస్తున్నట్లు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేశ్ తెలిపారు. గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా పవన్ రానున్నట్లు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని హెచ్ మార్ట్ వద్ద ఆయన ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.