India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని సి.గుడిపాడు గ్రామానికి చెందిన పుల్లారావు(21)అనే యువకుడు శ్రమల దినాలలో జపమాల ఆచరించి యోగేశ్వరం పుణ్యక్షేత్రాలు దర్శించేందుకు తోటి జపమాల దారులతో కలిసి వెళ్లాడు. అక్కడ పుల్లారావు శనివారం రాత్రి ప్రమాదవశాత్తు సముద్రంలో కొట్టుకుని పోయి మృతిచెందాడు. గమనించిన స్థానికులు వెంటనే అతని మృతదేహాన్ని అదివారం తన గ్రామానికి తరలించారు.
మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వివాహిత శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిని పెనుగంచిప్రోలు మండలం కొనకంచికి చెందిన సతీశ్తో గత ఏడాది వివాహం చేశారు. శ్రీలక్ష్మికి 2సార్లు గర్భస్రావం కావడంతో భవిష్యత్తులో పిల్లలు పుట్టరని భర్త, అత్తమామలు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సీపీ క్రాంతి రానా టాటా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల నగరంలో పనిచేస్తున్న కింది స్థాయి పోలీసు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలు ఆరోపణలు రావడంతో సీపీ శనివారం ట్రాఫిక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సిబ్బంది ఉద్యోగంలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకై పేద విద్యార్థులకు 1వ తరగతిలో అడ్మిషన్లకై ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కాగా అడ్మిషన్ల ఆన్లైన్ దరఖాస్తు గడువు నేడు ఆదివారంతో ముగియనుంది. అడ్మిషన్ కావాల్సిన వారు గ్రామ సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గన్నవరం MEO కె.రవికుమార్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్ పి రాజాబాబు జిల్లా ప్రజలకు ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు పునరుద్ధానం పొందిన పర్వదినం ఈస్టర్ అన్నారు. అటువంటి పర్వదినం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.
ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కృష్ణా జిల్లాలో ఆదివారం కింద పేర్కొన్న మండలాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు డిగ్రీలు, సెంటీగ్రేడ్లలో నమోదవుతాయని స్పష్టం చేస్తూ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
☞కంకిపాడు 40
☞ఉయ్యూరు 40
☞బాపులపాడు 40.1
☞గుడివాడ 39.2
☞గన్నవరం 40.3
☞పెనమలూరు 40.1
☞ఉంగుటూరు 40.3
☞పెదపారుపూడి 39.9
☞తోట్లవల్లూరు 39.5
☞పామర్రు 38.7
ఎన్నికలో నేపథ్యంలో జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. CP కాంతిరాణా టాటా మాట్లాడుతూ.. పశ్చిమ DCP పరిధిలో ప్రకాశం బ్యారేజ్, గుంటుపల్లి, పాముల కాలువ, నున్న పవర్ గ్రిడ్ ప్రాంతాల్లోని చెక్పోస్టుల్లో రూ.5.55లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 1టౌన్ స్టేషన్ పరిధిలో రూ.10.55లక్షల నగదు, 79.1గ్రాముల గోల్డ్ పట్టుకుని ఎన్నికల అధికారులకు అందిచామన్నారు.
కోడూరుకు చెందిన బాలికను మందపాకల గ్రామానికి చెందిన ఓ యువకుడు(19) అపహరించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను అపహరించి తీసుకెళ్లాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని, బాలికను హైదరాబాద్లో గుర్తించి స్టేషన్కి తరలించారు. ఆపై బాలికను విచారించగా, యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఆ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు.
నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒకే నాయకుడు రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందలేదు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలశౌరి ఈసారి జనసేనలో చేరి NDA కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలిస్తే 2 వేర్వేరు పార్టీల నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన తొలి నాయకుడిగా గుర్తింపు పొందుతారు. మరి మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.