Krishna

News April 10, 2024

ఎన్టీఆర్: జిల్లాలో ఈనెల 13న నిజం గెలవాలి ముగింపు సభ

image

చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ముగింపు సభను ఈ నెల 13న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గత 6 నెలలుగా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను పరామర్శించిన భువనేశ్వరి వారికి ఆర్థిక సాయం అందచేశారు. ఈ మేరకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీడీపీ నేత కేశినేని చిన్ని చెప్పారు.

News April 10, 2024

విజయవాడ: వైఎస్సార్ హెల్త్ విశ్వవిద్యాలయంలో క్రీడా పోటీలు

image

విజయవాడ: వైఎస్సార్ హెల్త్ విశ్వవిద్యాలయంలో 24వ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ ఈ త్రిమూర్తి రాజు బుధవారం తెలిపారు. ఈ పోటీలు ఏప్రిల్ 13వ తేదీ నుంచి 15 వరకు జరుగుతాయన్నారు. ఈ పోటీలలో 25 మెడికల్, డెంటల్ కళాశాలల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని ఆయన చెప్పారు.

News April 10, 2024

వల్లభనేని వంశీ ముంగిట అరుదైన రికార్డు

image

గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి 2014, 19 ఎన్నికల్లో గెలిచిన వంశీ వల్లభనేని తాజాగా వైసీపీ తరఫున బరిలోకి దిగనున్నారు. గన్నవరంలో 1955 నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలు ఎవరూ సాధించలేదు. 2024 ఎన్నికలలో వంశీ గెలిస్తే గన్నవరం గడ్డపై హ్యాట్రిక్ కొట్టిన మొదటి నాయకుడవుతారు. టీడీపీ నుంచి ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు బరిలో ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటారో కామెంట్ చేయండి.

News April 10, 2024

అవనిగడ్డ: 70 కేసులు ఉన్న దొంగ అరెస్ట్

image

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ వలిని మంగళవారం అరెస్ట్ చేశామని అవనిగడ్డ ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. అవనిగడ్డలోని ఓ బ్యాంకులో రుణం చెల్లించేందుకు సోమవారం రూ.50 వేలు తీసుకొచ్చిన వృద్ధురాలు కృష్ణకుమారిని నమ్మించి నగదుతో పరారయ్యాడు. కాగా, నాగూర్ వలి గజదొంగ అని అతనిపై 70 కేసులు ఉన్నాయన్నారు. బ్యాంకులకు వచ్చే వృద్ధులను టార్గెట్ చేసుకొని వారిని నమ్మించి మోసం చేస్తుంటాడని తెలిపారు.

News April 10, 2024

వైసీపీలోకి పోతిన మహేశ్.?

image

విజయవాడ పశ్చిమ టికెట్ ఆశించి భంగపడి, జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేశ్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడితో కలుస్తానన్నారు. జనసేన అధ్యక్షుడికి సొంత పార్టీపై ప్రేమ లేదని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను బట్టి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమిలో భాగంగా వెస్ట్ టికెట్ సుజనా చౌదరికి దక్కిన విషయం తెలిసిందే.

News April 10, 2024

కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం(MTM), తిరుపతి(TPTY) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07121 TPTY- MTM మధ్య నడిచే రైలును ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం, నెం.07122 MTM- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, పెడన, గుడివాడ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.

News April 9, 2024

కృష్ణా: పీజీ విద్యార్థుల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలో డిసెంబర్ 2023లో నిర్వహించిన పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు(2022- 23) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీవాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 22వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.9,00 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. 

News April 9, 2024

విజయవాడ: భవానిపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

విజయవాడ భవానిపురం ఖబరస్థాన్ వద్ద రోడ్డు పక్కన సైడ్ కాలవలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు భవానిపురం పోలీసులు తెలిపారు. మృతుడు వయసు 40 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఫొటోలోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే భవానిపురం పోలీసులకు తెలియజేయాలని సీఐ కృష్ణ కోరారు.  అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు. 

News April 9, 2024

NTR: ప్రయాణీకుల రద్దీ మేరకు రేపు ప్రత్యేక రైలు 

image

ప్రయాణీకుల రద్దీ మేరకు బుధవారం విజయవాడ మీదుగా భువనేశ్వర్- మైసూరు మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ (నెం. 06216)భువనేశ్వర్‌లో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరి గురువారం ఉదయం 03.25 నిమిషాలకు విజయవాడ, రాత్రి 7.15కి మైసూరు చేరుకుంటుందన్నారు. ఈ ట్రైన్ ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతుందని చెప్పారు. 

News April 9, 2024

100 నిముషాల్లో చర్యలు తీసుకుంటాం: DK బాలాజీ

image

సి – విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదుల గురించి కలెక్టర్ DK బాలాజీ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సి – విజిల్ యాప్‌లో వచ్చే ఫిర్యాదులను 100 నిముషాల్లో పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నంలోని డీఈఓ ఆఫీసు ఆవరణలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పరిశీలన కేంద్రంలో విధులలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.