Krishna

News April 21, 2024

ఈ నెల 23 ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

image

ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ నెల 23వ తేదీ ఉదయం నిర్వహించడానికి దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తేదీ మంగళవారం ఉదయం 5.55 గంటలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే ప్రదక్షిణలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగిస్తారు.

News April 21, 2024

విజయవాడలో నవ వరుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో నవ వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడి కాలనీలో చోటు చేసుకుంది. అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడి కాలనీ బ్లాక్ నంబర్ 24లో మేరీ గ్రేసీ, వెంకట్ నివాసం ఉంటున్నారు. నెల రోజుల కిందటే గ్రేసీ, వెంకట్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 21, 2024

VJA: బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు

image

బాలికను వేధిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన బాలిక(16)ను లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. శనివారం కూడా కళ్యాణ్ బాలికను వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లిదండ్రులు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 21, 2024

నేడు మాంసం దుకాణాలు బంద్: విఎంసి కమిషనర్

image

మహావీర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలో మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు.. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. కబేళాకు సెలవని పేర్కొన్నారు. నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసం విక్రయించే దుకాణ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణ యజమానులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

News April 21, 2024

విజయవాడ తూర్పులో ఓటర్లు ఎలాంటి తీర్పునిస్తారో?

image

విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం 13వ సారి ఎన్నికలు జరగబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో భారీ విజయాలను చవిచూసి, హ్యాట్రిక్‌ సాధించేందుకు టీడీపీ తరఫున గద్దె రామ్మోహన్‌ బరిలో నిలవగా.. వైసీపీ తరఫున మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాశ్ మొదటిసారిగా తూర్పు బరిలో ప్రత్యర్థిగా తలపడుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అవినాశ్ అంటున్నారు. మరి మీ కామెంట్.

News April 20, 2024

బంటుమిల్లిలో రోడ్డు ప్రమాదం.. వీఆర్ఓ మృతి

image

బంటుమిల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఓ వెంకట వరప్రసాద్(62) మృతి చెందారు. చోరంపూడి వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ శనివారం ఉదయం మచిలీపట్నం నుంచి తన ద్విచక్ర వాహనంపై చోరంపూడి వస్తుండగా కొర్లపాడు వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న మారుతి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే అతడిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News April 20, 2024

కృష్ణా: జిల్లాలో 3వ రోజు 13 నామినేషన్‌‌లు

image

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో భాగంగా మూడవ రోజైన శనివారం జిల్లాలో మొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఒక నామినేషన్ దాఖలవ్వగా .. గన్నవరం అసెంబ్లీ స్థానానికి 04, మచిలీపట్నంకు 03, పెడనకు 02, పెనమలూరుకు 1, పామర్రుకు 1, గుడివాడకు1 నామినేషన్ దాఖలైనట్టు అధికారులు తెలిపారు. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 

News April 20, 2024

బంటుమిల్లిలో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

image

మండలంలోని నెహ్రూ నగర్‌లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

News April 20, 2024

విజయవాడ: పవన్ కళ్యాణ్‌పై పోతిన మహేశ్ ఫైర్

image

జనసేన పార్టీ ఎకౌంట్‌లో ఎంత డబ్బు ఉందో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాను నాలుగేళ్ల నుంచి విడుదల చేయకుండా తన బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు పవన్ వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

News April 20, 2024

కృష్ణా: ట్రేడింగ్ పేరుతో మోసం.. రూ.35 లక్షలు స్వాహా

image

ఆన్లైన్‌లో ట్రేడింగ్ చేసి రూ.35 లక్షలు మోసపోయానంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నమోదు చేశారు. పోరంకికి చెందిన శ్రీకాంత్ ఆన్లైన్ ట్రేడింగ్‌లో సుమారు రూ.35 లక్షలు పెట్టుబడి పెట్టారు. తనకు డబ్బు అవసరమై విత్ డ్రా చేద్దామని అడగ్గా.. రెండు రోజుల పడుతుందని వారు తెలిపి అతని ఖాతాను బ్లాక్‌లో పెట్టారన్నాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.