Krishna

News March 30, 2024

వైసీపీ నుంచి సిద్ధం.. జనసేన నుంచి ఎవరు.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం MP, అవనిగడ్డ ఎమ్మెల్యే స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అభ్యర్థులను పవన్ ప్రకటించలేదు. దీంతో ఇక్కడ పోటీ విషయమై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మరోవైపు YCP నుంచి సింహాద్రి చంద్రశేఖర్, సింహాద్రి రమేశ్ బాబు ఎన్నికలకు సిద్ధమై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా జనసేన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.

News March 30, 2024

నిష్పక్షపాతంగా ఎన్నికల నియమావళి అమలు: ఢిల్లీ రావు

image

విజయవాడ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికల నియమావళిని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.

News March 29, 2024

సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నారు: కృష్ణయ్య

image

బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయపార్టీ నేతలు ప్రజల్ని ఓటర్లుగా చూస్తే, సీఎం జగన్ ఒక్కరే ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తున్నారన్నారు. సీఎం జగన్ ముందు చూపుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, ప్రజల బంగారు భవిష్యత్కు బాట వేస్తున్నారని ఆయన తెలిపారు. 

News March 29, 2024

ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..?

image

రానున్న ఎన్నికల్లో ఏపీలో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలి విడతగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించనున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీలు చెరో 15 అసెంబ్లీ, రెండు లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

News March 29, 2024

దేవినేని ఉమాకు వసంత బర్త్‌డే విషెస్

image

మైలవరం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బర్త్ డే విషెస్ తెలిపారు. మైలవరం టికెట్ ఉమా ఆశించగా.. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంతకే అధిష్ఠానం టికెట్ ఇచ్చింది. గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండి విమర్శలు చేసుకున్న ఇద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా ఎదురుపడిన దాఖలాలు లేవు. ఈక్రమంలో ఉమాకు వసంత విషెస్ చెప్పడం గమనార్హం.

News March 29, 2024

క్రైస్తవులకు బోడే క్షమాపణ చెప్పాలి: మంత్రి జోగి రమేశ్

image

పెనమలూరులో నేడు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొని క్రైస్తవ మందిరాల్లో ప్రార్థనలునిర్వహించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మాట్లాడుతూ.. బోడె ప్రసాద్ బూట్లు వేసుకొని సిలువ మోయడం క్రైస్తవులకు అవమానించడమేనన్నారు. ఆయన వెంటనే క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News March 29, 2024

తిరువూరు: పోలీస్ గన్‌మెన్ మోహన్ మృతి

image

తిరువూరు మండలం కొమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోలీస్ గన్‌మెన్ మారిపోగు మోహన్ రోడ్డు ప్రమాదంలో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. విజయవాడ లాండ్ ఆర్డర్ డీసీపీ వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మోహన్ బైకు మీద తిరువూరు వైపు వస్తుండగా మంగళగిరి వడ్డేశ్వరం వద్ద వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో మోహన్ మృతిచెందాడు. మోహన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 29, 2024

31 తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్: జేసీ గీతాంజలి

image

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 55,562 మంది రైతుల నుంచి రు.1070.07 కోట్ల విలువైన 4,88,590 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ నెల 31 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఆ తర్వాత కేంద్రాలను మూసివేస్తామని ఆమె చెప్పారు. ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 28, 2024

ఎన్టీఆర్: ప్రయాణికులకు శుభవార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్ (SC), దిబ్రుగఢ్ (DBRG) మధ్య విజయవాడ మీదుగా నడిచే స్పెషల్ ఫేర్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నెం.07046 SC- DBRG మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు ప్రతి సోమవారం, నం. 07047 DBRG- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు ప్రతి గురువారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు విశాఖపట్నం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News March 28, 2024

కృష్ణా: ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

ట్రాక్ భద్రత పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు, విశాఖపట్నం మధ్య ప్రయాణించే ఉదయ్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌లను కొన్ని రోజులపాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR)తెలిపింది. ట్రైన్ నం.22701 విశాఖపట్నం- గుంటూరు, నం.22702 గుంటూరు- విశాఖపట్నం ట్రైన్‌లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.