India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల ఆధ్వర్యంలో కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల నెట్ బాల్ మహిళల టోర్నమెంట్ 20వ తేదీ నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి వి.లక్ష్మీ కనకదుర్గ తెలిపారు. ఈ టోర్నీలో కృష్ణా వర్శిటీ జట్టు ఎంపిక చేసే యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ ఆధ్వర్యంలో జరుగనున్న అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నీకి పంపనున్నట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలని చెప్పారు.
కృష్ణా వర్సిటీ పరిధిలోని బీపీఈడీ/డీపీఈడీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 25,26, 27, 29 తేదీల్లో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పరీక్షలు జరుగుతాయని, సబ్జెక్టువారీగా పరీక్షల షెడ్యూల్ కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.
రూరల్ మండలంలోని పార్నాసలో అక్క ఇంజినీరింగ్, చెల్లెలు ఇంటర్మీడియట్లో తప్పడంతో ఇద్దరూ సోమవారం పురుగు మందు తాగారు. చెల్లే చికిత్స పొందుతూ మృతిచెందగా.. అక్క బయటపడింది. ఎస్సై లక్ష్మీనరసింహమూర్తి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
విజయవాడలో సీఎం జగన్పై దాడిని సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎయిర్ గన్లు తదితర వస్తువులను వాడే వాళ్ల గురించి ఆధారలు సేకరిస్తున్నట్లు సమాచారం. గత 15 రోజులుగా గంగానమ్మ గుడి పరిధిలోని కాల్స్ వివరాలు సేకరిస్తున్నారు. మొత్తంగా ఆరు బృందాలతో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
సీఎం జగన్ యాత్ర నేడు కేసరపల్లి నుంచి ప్రారంభం కానుందని సీఎం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు రూట్ మ్యాప్ను విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, జొన్నపాడు మీదుగా యాత్ర గుడివాడ చేరుకుంటుంది.
మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుని రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారని తెలిపారు.
సీఎం జగన్పై దాడి ఘటనలో దోషులను తక్షణమే పట్టుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైసీపీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో హింసకు తావులేదన్నారు. జగన్పై దాడి ఘటనలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను నిగ్గుతేల్చాలని అన్నారు. అనంతరం దోషులను వెంటనే పట్టుకోవాలని డీజీపీని కోరినట్లు చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రూరల్ మండలం గూడవల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో 500 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీశ్ మాట్లాడుతూ.. తనిఖీ చేస్తుండగా గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అక్రమంగా గంజాయి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూజివీడులో చిన్నరసాల ధర (డజన్) రూ.300 నుంచి రూ.350 వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నల్ల తామర వ్యాప్తితో ఈ ఏడాది మామిడి పూత చాలావరకు మాడిపోయింది. దీంతో దిగుబడి పడిపోయి.. ఊరగాయకు సైతం కాయలు దొరకని పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ధరలను చూస్తుంటే ఇక ఈ ఏడాది మామిడి పండ్లు తినడం ‘భారమే’నంటున్నారు.
సీఎం జగన్ పెడన పర్యటన వాయిదా పడింది. శనివారం రాత్రి విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్ షోలో ఉన్న సీఎం జగన్ పై రాయితో దాడి చేయగా జగన్ గాయపడిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచనల మేరకు సీఎం జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పెడనలో నిర్వహించాల్సిన రోడ్ షో, బహిరంగ సభను వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 15న జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
విజయవాడలో సీఎం జగన్ చేస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగ్నగర్లో జరుగుతున్న నేఫథంలో, జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు ఆగంతకులు పూలతోపాటు రాయి విసరడంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. క్యాట్బాల్లో రాయిపెట్టి విసరడంతో గాయం అయినట్లు సమాచారం. వెంటనే వైద్యులు ట్రీట్మెంట్ చేశారు. ఈ ఘటనలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డాడు.
Sorry, no posts matched your criteria.