Krishna

News May 10, 2024

ఘంటసాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కృష్ణా జిల్లా ఘంటసాల మండల పరిధిలోని దాలిపర్రు గ్రామ శివారులో ఉన్న జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఘంటసాల గ్రామం దిరిశం వాని గూడెంకు చెందిన కొక్కిలిగడ్డ ఇస్సాకు మృతిచెందాడు. మచిలీపట్నం నుంచి ఘంటసాల వస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆటోలో నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఘటనపై ఎస్సై ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 10, 2024

కృష్ణా: ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ మణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 08674-295953, 8555 952320 నెంబర్లను సంప్రదించాలన్నారు.

News May 10, 2024

కృష్ణా: కృష్ణప్రసాద్‌లకు విజయం దక్కేనా

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన, మైలవరంలలో కృష్ణప్రసాద్ కాగిత, కృష్ణప్రసాద్ వసంత టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో దేవినేని ఉమాపై విజయం సాధించిన వసంత ఇటీవల పార్టీ మారి మైలవరం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 2019లో టీడీపీ తరఫున పెడన నుంచి బరిలోకి దిగిన కాగిత గెలుపు చవిచూడలేదు. తాజాగా పెడన నుంచి కాగిత, మైలవరంలలో వసంత బరిలోకి దిగుతుండగా ఓటర్లు వీరిని కరుణిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

News May 10, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17239 గుంటూరు- విశాఖపట్నం(మే 11 నుంచి 13), నం.17240 విశాఖ- గుంటూరు(మే 12 నుంచి 14) ట్రైన్‌కు ఒక ఛైర్ కార్ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అదనపు బోగీ ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.

News May 10, 2024

కృష్ణా: 50% పైబడి ఓట్లు సాధించింది వీరే..

image

2019 ఎన్నికలలో ఉమ్మడి కృష్ణాలోని పలు స్థానాల్లో పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లు సాధించిన పలువురు నేతలు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించారు. కొడాలి నాని (గుడివాడ)- 53.5% రక్షణనిధి (తిరువూరు)- 50.73%, ఎం.అప్పారావు(నూజివీడు)- 50.84%, కైలే అనిల్(పామర్రు)- 56.15%, మొండితోక జగన్(నందిగామ)- 51.32% ఓట్లు సాధించారు. కాగా, వీరిలో కొడాలికి జగన్ కేబినెట్‌గా పౌరసరఫరాల శాఖ మంత్రిగా చోటు దక్కింది.

News May 10, 2024

అమరావతి కోసమే పశ్చిమ సీటు త్యాగం చేశాం: పవన్

image

రాజధాని అమరావతి మనుగడ కోసమే విజయవాడ పశ్చిమ సీటు బీజేపీకి త్యాగం చేశానని గురువారం జరిగిన రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంపై పవన్ మాట్లాడుతూ.. తొలుత పశ్చిమ సీటు జనసేనకు ఖాయమైందని, బీజేపీ అగ్రనేతలు అమరావతిలో తమ ప్రాధాన్యం కోసం ఈ స్థానం అడగడం వల్ల ఇచ్చానన్నారు. పశ్చిమ స్థానం బీజేపీకి ఇచ్చినప్పుడు.. అమరావతి, రాష్ట్ర భవిష్యత్ కాపాడాలని బీజేపీ అగ్రనేతలను కోరానన్నారు.

News May 10, 2024

NTR: 50% పైబడి ఓట్లు సాధించి నేడు పోటీకి దూరంగా..

image

2014, 2019లో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తాజా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన పోలైన ఓట్లలో 50.73% ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి KS జవహర్‌పై 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో రక్షణనిధిని కాదని, వైసీపీ నల్లగట్ల స్వామిదాసుకు టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 

News May 10, 2024

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి: బాలాజీ

image

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటు విలువైనదని గుర్తించి గ్రామస్తులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ అప్రమత్తమై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి గురువారం గ్రామస్తులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు.

News May 9, 2024

గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం

image

పట్టణంలోని పలు వార్డుల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీ మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం గుడివాడ ఎలా ఉందో, అభివృద్ధి లేకుండా ఇప్పటికీ అలాగే ఉందని, వెనిగండ్ల రాము గెలిస్తే, గుడివాడ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గుడివాడలో అవకాశాలు లేకపోవడంతో తన లాంటి వారి అందరూ పక్క రాష్ట్రానికి వెళ్లి స్థిరపడ్డారన్నారు. 

News May 9, 2024

కృష్ణా: పలు రైళ్లకు అదనపు బోగీలు

image

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే పలు ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.12749 మచిలీపట్నం- బీదర్ (మే 9 నుంచి11), నం.12750 బీదర్- మచిలీపట్నం (మే 10 నుంచి12) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, ఒక థర్డ్ ఏసీ కోచ్ అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు బోగీల ద్వారా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి బెర్తులు లభిస్తాయన్నారు.