Krishna

News March 21, 2024

మచిలీపట్నం: ఆరుగురు వాలంటీర్లపై వేటు

image

మచిలీపట్నం మండలం చిన్నాపురంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొన్నట్లు పై అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఆరుగురు వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ MPDO ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్లపై చర్యలు తీసుకుంటున్నా కొందరు నిబంధనలు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు నేతలు ఆరోపిస్తున్నారు.

News March 21, 2024

ఎన్నికల ప్రచార ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కృష్ణా కలెక్టర్

image

సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ప్రసార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (MCMC)ని ఏర్పాటు చేసినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కమిటీ ముందస్తు అనుమతి ఇవ్వడంతో పాటు
పెయిడ్ న్యూస్‌ను పర్యవేక్షిస్తుందన్నారు.

News March 20, 2024

టీడీపీ జెండాలతోనే బోడె ప్రసాద్ ప్రచారం

image

పెనమలూరు టికెట్ విషయంలో టీడీపీ అధిష్ఠానం లెక్కలు వేసుకునే పనిలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం పెనమలూరులో బోడె ప్రసాద్, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులంతా టీడీపీ జెండాలతోనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఇక చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనని పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.

News March 20, 2024

వైసీపీలోకి వంగవీటి నరేంద్ర

image

కాపు సంఘం రాష్ట్ర నేత వంగవీటి నరేంద్ర బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నరేంద్ర ఇప్పటి వరకు బీజేపీలో పని చేశారు. ఈయన వంగవీటి రాధాకృష్ణకు సోదరుడు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి, కాపు సంఘం నేతలు పాల్గొన్నారు.

News March 20, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్‌లో శ్రీదేవికి కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.

News March 20, 2024

పెనమలూరు కూటమి అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్?

image

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్‌ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.

News March 20, 2024

కృష్ణా: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్(ANUEET)-2024 రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తి చేసిన వారికి బీటెక్‌లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను మే నెలలో నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చని చెప్పారు.

News March 20, 2024

కృష్ణా: నాడు వైసీపీకి ప్రత్యర్థులు.. నేడు వైసీపీ అభ్యర్థులు

image

2019లో వైసీపీకి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన దేవినేని అవినాశ్, వల్లభనేని వంశీ తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగనున్నారు. 2019లో గుడివాడలో టీడీపీ తరపున బరిలో దిగి ఓడిన అవినాష్ వైసీపీలోకి చేరి తాజాగా విజయవాడ తూర్పు నుండి బరిలో దిగనున్నారు. నాడు టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలో చేరి గన్నవరం నుంచి మరోసారి బరిలో నిలిచారు. వీరిని గెలుపు వరించేనా.. మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

News March 20, 2024

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని?

image

నేడో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు కొందరు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. విజయవాడ తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును దాదాపు ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో విజయవాడ టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే.

News March 20, 2024

అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచండి: కృష్ణా కలెక్టర్

image

ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకుల్లో జరిపే లావాదేవీల వివరాలను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్ జిల్లాలో కోడ్ అమలులో ఉందన్నారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై నిఘా ఉంచి వాటి వివరాలను పంపాలన్నారు. ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఎక్కువ మందికి సొమ్ము జమ అవుతుంటే ఆ వివరాలను తెలియజేయాలన్నారు.