India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖరీఫ్ మిగులు ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 228 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతు సేవ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. 128 రైస్ మిల్లులకు ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చామన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల అలినేషన్, 22Aలో ఉన్న ప్రైవేటు భూములు, భూముల అసైన్మెంట్, ఇనాం భూములు, ROR & వెబ్ ల్యాండ్, రీసర్వే తదితర రెవెన్యూ అంశాలలో తలెత్తుతున్న సమస్యలను చర్చించారు.

నేటి నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని కోడూరు మండల ఎఫ్డీఓ డి. స్వామివారి రావు ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేది నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు యాంత్రిక ఇంజిన్ నావలలో వేట చేయుట నిషేధించినట్లు చెప్పారు. కోడూరు మండలం పాలకాయతిప్ప లాండింగ్ సెంటర్లోని మర పడవల యజమానులు, షరతులు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు బోటు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.

గన్నవరం మాజీ MLA వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. విజయవాడ SC, ST కోర్టు న్యాయ అధికారి హిమబిందు గత శుక్రవారం ఈ పిటిషన్ విచారించి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా సత్యవర్ధన్ అనే యువకుడిని అపహరించిన కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం విధితమే.

పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 19 మందికి రూ.16.68లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.

మచిలీపట్నంలో సోమవారం అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, తదితరులు లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భవానీ ఐలాండ్కు రోప్వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.

మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ వద్ద హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. కొక్కిలిగడ్డకు చెందిన రాయన కృష్ణ తేజస్ (18), నాగ జశ్వంత్ బైకుపై మోపిదేవి వెళ్లేందుకు హైవే పైకి రాగానే వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ తేజస్ మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగ జస్వంత్(11) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లాలో బైక్ ర్యాలీలు, డీజే సౌండ్ బాక్స్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని మచిలీపట్నం డీఎస్పీ రాజా పేర్కొన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని డ్రోన్ కెమెరాలతో నిశితంగా పర్యవేక్షిస్థామన్నారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. అర్జీలు ఇచ్చేందుకు వచ్చే వారు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
Sorry, no posts matched your criteria.