Krishna

News March 7, 2025

కృష్ణా: DRDA PDగా హరినాథ్ బాబు బాధ్యతలు 

image

కృష్ణా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వై.హరినాథ్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. హరినాథ్ బాబు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి కృష్ణాజిల్లా డీఆర్డీఏ పీడీగా బదిలీపై వచ్చారు.

News March 7, 2025

దక్షిణ చిరువోలు లంకలో రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ 

image

అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంకలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గ్రామ సచివాలయంలో రికార్డులు పరిశీలించి అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూమి నిజనిర్ధారణ (గ్రౌండ్ ట్రూతింగ్), భూమి ధ్రువీకరణ (గ్రౌండ్ వాలిడేషన్) ప్రక్రియ సక్రమంగా జరిగితే రీ సర్వేలో నాణ్యమైన ఫలితాలు పొందవచ్చన్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 7, 2025

గుడివాడ: కొడాలి నాని అనుచరులకు షాక్

image

మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, గొర్ల శ్రీనుకు గుడివాడ పోలీసులు శుక్రవారం 41ఏ నోటీసులు ఇచ్చారు. వాలంటీర్ల బలవంతపు రాజీనామా, లిక్కర్ గోదాం కేసుల్లో వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో కొడాలి నాని, మాజీ బెవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జె.సి. మాధవీలతారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది.

News March 7, 2025

కృష్ణా జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు గన్నవరం, పెనమలూరు నుంచి ఎక్కువగా విజయవాడకు వస్తుంటారు. విజయవాడలో కాలేజీలు కూడా ఉండటంతో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విజయవాడ వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

News March 7, 2025

తోట్లవల్లూరు: మృతుడి ఒంటిపై పచ్చబొట్లు (అప్డేట్)

image

తోట్లవల్లూరులో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులకు వివరాల మేరకు.. మండలంలోని చాగంటిపాడు శివారు కళ్లెంవారిపాలెం వద్ద కృష్ణానది ఒడ్డున ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. మృతుడి ఎడమ చేతి మీద డిజైన్, బ్రూస్‌లీ అని, కుడి చేతి మీద నాయక్, ప్రేమ కావాలి, కాజల్, అమ్మానాన్న, గంగా అని చాతిపైన పోలమ్మ, కాజల్, బసవమ్మ అని పచ్చబొట్టులు ఉన్నాయి.VRO ఫిర్యాదతో SI కేసు నమోదు చేశారు.

News March 6, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

★ గన్నవరంలో వాయిదా పడిన పవన్ పర్యటన ★ కృష్ణా జిల్లాలో 40 డిగ్రీలు ఎండ★ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 సర్వే : కలెక్టర్ ★ మొవ్వ: రాజీకి పిలిచి.. హత్య ★ VJA: `సాఫ్వేర్ ఉద్యోగి కాదు అమ్మాయిల బ్రోకర్’★ గన్నవరం: తీవ్రమవుతున్న వెటర్నరీ విద్యార్థులు నిరసనలు★ గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి★ ఉయ్యూరు: ప్రభుత్వ ఉద్యోగి సూసైడ్ నోట్

News March 6, 2025

MTM: యూజీ ఫస్ట్ సెమ్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ అనుబంధ కళాశాలలకు సంబంధించి UG మొదటి సెమిస్టర్ ఫలితాలను, UG వన్ టైమ్ పరీక్షా ఫలితాలను గురువారం విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ విడుదల చేశారు. 7,212 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 4,302 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఉత్తీర్ణతా శాతం 59.65%గా నమోదైందన్నారు. ఫస్ట్ సెమిస్టర్ పునఃమూల్యాంకనం కొరకు ఈ నెల 19వ తేదీ లోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 6, 2025

గూడూరు వద్ద ప్రమాదం.. డ్రైవర్ మృతి

image

విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ బొల్లా మోహన్ రావు దుర్మరణం చెందారు. వాహనంలో ఉన్న ప్యాసింజర్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News March 6, 2025

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

image

పేద‌రిక నిర్మూలనే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్ పార్ట‌న‌ర్‌షిప్ (P4) స‌ర్వేకు రూప‌క‌ల్ప‌న చేసిందని, ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వ‌ర‌కు జిల్లాలో నిర్వహించే ఈ సర్వేను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో MPDOలు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.

News March 6, 2025

గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ 

image

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు.