Krishna

News August 6, 2024

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

image

జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నుజ్జు నుజ్జై శరీరం ఛిద్రమైఉంది. మృతుడు పడి ఉన్న తీరని చూస్తే భారీ వాహనం ఢీకొన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చిల్లకల్లు ఎస్ఐ సూచించారు.

News August 6, 2024

నేడు విజయవాడకు రానున్న మాజీ సీఎం

image

జగ్గయ్యపేట వైసీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై ఆదివారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మాజీ సీఎం జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News August 6, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేడు వర్షాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులంతా అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురుస్తున్న సమయంలో చెట్లు, కరెంట్ పోల్స్ వద్ద నిలబడవద్దని తెలిపారు.

News August 5, 2024

కృష్ణా: TODAY TOP NEWS

image

* రేపు విజయవాడకు YS జగన్
* ఎన్నికల బరిలో కేశినేని చిన్ని
* మైలవరంలో వైసీపీ కార్యాలయం మూసివేత
* కృష్ణా: బాలికపై కామాంధుడు అత్యాచారం
* గుడివాడ: కాలువలో పడి యువకుడి మృతి
* విజయవాడ: అన్నా చెల్లెళ్లు ఇద్దురూ కేటుగాళ్లే
* గుడివాడ: హోటల్‌లో కుళ్లి పోయిన చికెన్

News August 5, 2024

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందజేసే NMMS (2024-25) పరీక్షకై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్థులకు డిసెంబర్ 8న పరీక్ష నిర్వహిస్తామని, ఆసక్తి కలిగిన విద్యార్థులు https://bse.ap.gov.in/అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 6లోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

News August 5, 2024

కృష్ణా: బీ ఫార్మసీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 8, 12,14,17, 20, 22 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News August 5, 2024

రేపు విజయవాడకు మాజీ సీఎం జగన్

image

మాజీ సీఎం జగన్ రేపు విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన మధ్యాహ్నం 2:25 గంటలకు బయలుదేరి 3.45గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గన విజయవాడ మొగల్రాజపురంలోని సన్రైజ్ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ ఆదివారం గాయపడిన వైసీపీ నేత శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. అనంతరం తాడేపల్లి స్వగృహానికి చేరుకుంటారు. 

News August 5, 2024

గుడివాడ: కాలువలో పడి యువకుడి మృతి

image

గుడివాడలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బండి ప్రేమ్ కుమార్ (26) సోమవారం పెద్ద కాలువలో పడి బైక్ మెకానిక్ మృతి చెందాడు. అతను ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడని స్థానికులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రేమ్ కుమార్ మృతితో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News August 5, 2024

విజయవాడ: అన్నాచెల్లెళ్లు.. ఇద్దరూ కేటుగాళ్లే

image

అడ్డదారిలో రూ.కోట్లు అర్జించడంలో అన్నా చెల్లెళ్లు ఆరితేరారు. ఇటీవల హైదరాబాద్‌లో రవిచంద్రారెడ్డి(29), ఆయన సోదరి చందనారెడ్డి అలియాస్ యామిని అలియాస్ సౌమ్య గుట్టు రట్టవడంతో వారి మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పరారీలో ఉన్న వారి కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో ఉద్యోగాలు ఇస్తామని ఓ సంస్థ పేరుతో రూ.15 కోట్ల మేరా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.

News August 5, 2024

మైలవరంలో వైసీపీ కార్యాలయం మూసివేత

image

మైలవరంలో అద్దె చెల్లించలేదని YCP కార్యాలయాన్ని మూసేశారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకుడు నాగిరెడ్డికి చెందిన భవనంలో కార్యాలయ్నాన్ని ప్రారంభించారు. అప్పట్లో నిర్వహణ భారం అధిష్ఠానమే భరించేది. కానీ పార్టీ ఓడిపోవడంతో రెండు నెలలుగా కార్యాలయ నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఎన్నికలకు ముందు నియమించిన ముగ్గురు పరిశీలకులు అందుబాటులో లేకపోవడం, పోటీ చేసిన అభ్యర్థికి నిర్వహణ భారంగా మారడంతో మూసి వేశారని సమాచారం.