Krishna

News October 10, 2025

ఉయ్యూరులో రూ. 12 లక్షలు టోకరా

image

తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి దామోదర్, ఆయన కుమారుడు యువ కళ్యాణ్ ఒకరి వద్ద రూ.12 లక్షలు కాజేశారు. ఉయ్యూరులో దామోదర్ ‘విజయ దుర్గ UPVC విండోస్ అండ్ డోర్స్’ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. షాపుకు వచ్చిన ఓ కస్టమర్ తిరుమల వెళ్తున్నాడని తెలుసుకొని, తనకి అక్కడ పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఈ మొత్తం వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 10, 2025

కృష్ణా : SC, ST అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు

image

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల వివరాలు, బాధితులకు తక్షణ పరిహారం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.

News October 10, 2025

కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. నేటి నుంచి బోధనేతర యాప్‌ల బహిష్కరణ

image

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.

News October 9, 2025

కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. రేపటి నుంచి బోధనేతర యాప్‌ల బహిష్కరణ

image

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.

News October 9, 2025

షాపుల యజమానులు అనుమతులు తీసుకోవాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ పురస్కరించుకొని బాణసంచా తయారీ కేంద్రాలు, షాపులు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. గురువారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడారు. ప్రజల భద్రత, శ్రేయస్సులో భాగంగా పోలీస్ వారికి సహకరించాలన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు తయారు చేసినా, నిల్వ ఉంచిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు.

News October 9, 2025

విద్యార్థుల ఆరోగ్యం పట్ల దృష్టి సాధించండి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

News October 9, 2025

పెట్రోల్ బంకుల్లో కనీస సౌకర్యాలు కరువు..?

image

కృష్ణా జిల్లాలో పుట్టగొడుగుల్లా పెరుగుతున్న పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కనీస సౌకర్యాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో సుమారు 70 శాతం బంకుల్లో టాయిలెట్, తాగునీరు, గాలిమిషన్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గాలిమిషన్ పనిచేయడం లేదు, మరికొన్ని బంకుల్లో టాయిలెట్లు శుభ్రంగా లేవు. సిబ్బందికి కూడా కనీస విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం.

News October 9, 2025

నేడు కృష్ణా వర్శిటీలో క్రీడల పండుగ

image

కృష్ణా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం క్రీడల పండుగ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి ఓ ప్రకటనలో తెలిపారు. పురుషులకు, మహిళలకు వాలీబాల్, టేబుల్ టెన్నిస్, చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాల పండుగ ఉంటుందన్నారు. సోలో, గ్రూప్‌ల వారీగా పాటలు, డ్యాన్స్ పోటీలు, స్కిట్స్, ఫ్లాష్ మాబ్ పోటీలు ఉంటాయని ఆమె తెలిపారు.

News October 9, 2025

ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025 -26 సంవత్సరానికి సంబంధించి ధాన్యం సేకరణ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలం పోరంకిలోని 3వ సచివాలయం నుంచి వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణకు చేపట్టాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

News October 8, 2025

పెనమలూరు: భర్త మందులు తీసుకురాలేదని ఆత్మహత్య

image

కానూరులో నివాసం ఉంటున్న మధులత 5ఏళ్ల నుంచి సోరియాసిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. భర్త నాగేశ్వరరావుకు మందులు తీసుకురమ్మని వాట్సాప్‌లో చీటీ పెట్టగా.. అందులో అండర్ లైన్ చేసిన మందు మాత్రమే భర్త తీసుకువచ్చాడు. అన్ని మందులు తేకుండా ఒక ముందు మాత్రమే తెచ్చాడని భర్తను ప్రశ్నించగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్థాపానికి గురైన మధులత ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.