India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు డీకే బాలాజీని ఎంపిక చేసింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మచిలీపట్నం పోలీస్ కమిషనరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర్ రావు, పోలీస్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంలో ఉన్న ప్రేరణాత్మక ఘట్టాలను వివరించారు. ఈ సందర్భంగా సిబ్బందికి మిఠాయి పంచిపెట్టారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని ANU సూచించింది.
ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ, ఆధ్వర్యంలో ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్. వీర రాఘవయ్య ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ను పరిశీలించారు.
విజయవాడ పోలీసు చర్యలను సీఎం చంద్రబాబు అభినందించారు. Suraksha For Safer Neighbourhoods చొరవ అభినందనీయమని కొనియాడారు. వెయ్యికంటే ఎక్కువ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రాముఖ్యత చాటుతోందని చెప్పారు. ఈ తరహా పోలీసింగ్ పరిపాలన ప్రజలకు మెరుగైన సేవ చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. హైటెక్ ఈగల్ వెహికల్స్ ప్రారంభించడం కూడా ఆయన అభినందించారు.
అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ HYDలోని ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. పీపీ వివరాల మేరకు మియాపూర్కు చెందిన బాలిక(16)కు రమేష్ పరిచయమయ్యాడు. దీంతో ఆమెను విజయవాడ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం గదిలో బంధించి అత్యాచారం చేసి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. చార్జీషీటు వేయగా కోర్టు తీర్పునిచ్చింది.
సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన వాళ్లు జనసేనలోకి చేరుతున్నారు అనే దానిపై ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారు జనసేన, బీజేపీ పార్టీలో చేరితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు ఇంకా పార్టీల్లో చేరలేదని అలాంటి వాళ్లను తీసుకోవద్దని చెబుతున్నామని ఆమె పేర్కొన్నారు.
విజయవాడలోని మహానాడు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జక్కుల వినయ్, జీవన్, గోపి అనే యువకులు ఓ రెస్టాంరెంట్లో చెఫ్లుగా పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని స్కూటీపై ముగ్గురు వస్తుండగా మహానాడు జంక్షన్ వద్ద ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో గోపి స్పాట్లోనే మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CRDAలో డిప్యూటేషన్ విధానంలో 8 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. FEB 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడాలని విజయవాడలోని CRDA కార్యాలయం నుంచి తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 3వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.