Krishna

News July 30, 2024

కృష్ణా: మూడు రైళ్లు రద్దు

image

చక్రధరపూర్‌ రైలు ప్రమాద ఘటన కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 3 రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు జూలై 31 & ఆగస్టు 2న నం.18189 టాటా- ఎర్నాకులం, ఆగస్టు 1న నం.02863 హౌరా- యశ్వంత్‌పూర్, ఆగస్టు 3న నం.02864 యశ్వంత్‌పూర్- హౌరా రైళ్లను రద్దు చేశామని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

News July 30, 2024

విజయవాడ: 2 గంటల్లో బాలికను కనిపెట్టిన పోలీసులు

image

తల్లి మందలించిందనే కారణంతో నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ పోలీస్ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమై బాలికను రెండు గంటల్లోపే కనిపెట్టి డీసీపీ హరికృష్ణ తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.

News July 30, 2024

ఎన్టీఆర్: వీడియోలు తీసి బహుమతులు గెలవండి

image

సైబర్ భద్రత, రహదారి భద్రత, మహిళలు & బాలల భద్రతపై అవగాహన కల్పించేలా 1- 3 నిముషాల నిడివితో కూడిన వీడియో కాంటెస్ట్‌ను విజయవాడ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు 3 కేటగిరీలలో ఎంపికైన బెస్ట్ వీడియోలకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు నగదు బహుమతి ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆగస్టు 5లోపు రిజిస్టర్ చేసుకుని, 15లోపు తమ వీడియోలను vzapolicevideocontest@gmail.comకు పంపాలని కోరారు.

News July 30, 2024

ప్రచారపిచ్చితో ఖజానాను జగన్ గుల్ల చేశాడు: దేవినేని

image

ఎన్టీఆర్: తన ప్రచారపిచ్చితో రాష్ట్ర ఖజానాను జగన్ గుల్ల చేశాడని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్ చేశారు. తన ముచ్చట తీర్చుకునేందుకు మాజీ సీఎం జగన్ రూ.700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. రీ సర్వేలో అవకతవకలు చేయడమే కాక, ప్రజల ఆస్తులపై జగన్ తన పేరు బొమ్మలు వేసుకుని అహంకారపూరితంగా వ్యవహరించాడని ఉమ ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.

News July 30, 2024

VJA: బాలికపై అత్యాచారం.. కోర్టు సంచలన తీర్పు

image

అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు సోమవారం సంచలన తీర్పునిచ్చారు. విజయవాడ భవానిపురానికి చెందిన ఓ బాలికను గురుసాయిచంద్ర పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 2019 సెప్టెంబర్ 29న చంద్ర సాయి, గొల్లసాయి, తరుణ్ బాలికను రూంకు తీసుకెళ్లి మత్తుమందు కలిపి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ కేసులో ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష ఒక్కొక్కరికి రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News July 30, 2024

కృష్ణా: MBA/ MCA పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలోని కళాశాలలలో MBA/ MCA విద్యార్థులకు నిర్వహించే సప్లిమెంటరీ (One time Opportunity) పరీక్షల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలైంది. Y13, Y14, Y15, Y16, Y17, Y18తో ప్రారంభమయ్యే రిజిస్టర్డ్ నెంబర్ కలిగిన విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు ఆగస్టు 5లోపు అపరాధ రుసుము లేకుండా ఒక్కో సబ్జెక్టుకు రూ.2,000 ఫీజు చెల్లించాలని వర్శిటీ సూచించింది. వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలంది.

News July 29, 2024

శివచంద్రారెడ్డికి భద్రత కల్పించాలి: హైకోర్టు

image

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి తొలగించిన సెక్యూరిటీని తక్షణం పునరుద్ధరించాలని హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివచంద్రారెడ్డి గన్‌మెన్లను ఇటీవల ఉపసంహరించడంపై హైకోర్టులో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

News July 29, 2024

కృష్ణా: రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

image

విజయవాడ శివారు గొల్లపూడి వద్ద సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ అని స్థానికులు గుర్తించారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News July 29, 2024

కృష్ణా: ‘1వ తేదీనే పింఛన్ల పంపిణీ పూర్తవ్వాలి’

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆగస్ట్ 1వ తేదీనే పింఛన్లు 100% పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఉద్యోగులను ఆదేశించింది. కృష్ణా జిల్లాలో 2,42,321, ఎన్టీఆర్ 2,35,477 మందికి గత నెలలో పింఛన్ అందజేశారు. ఆగస్ట్ నెలలో ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50-100 మంది లబ్ధిదారులు ఉండేలా సంబంధిత అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.

News July 29, 2024

రెండో విడత కౌన్సెలింగ్‌ జాబితా ఆగస్టు 3న విడుదల 

image

ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్‌కు అర్హుల జాబితాను ఆగస్టు 3న విడుదల చేయనున్నట్లు అడ్మిషన్లు కన్వీనర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. తొలి విడత కౌన్సెలింగ్ అనంతరం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 736 సీట్లు మిగిలిపోయాయన్నారు. వాటి భర్తీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.