India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి.
ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్ను రైతులకు తెలియజేయాలని సూచించారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.
గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పెనమలూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గంగూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడే. సమాచారం అందుకున్న పోలీసేులు అక్కడికి చేరుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈ వ్యక్తి తెలిస్తే పెనమలూరు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.
తోటమూల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమైన ఘటన పెడన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పెడన పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆర్. గంగాధర్ పోలీసులను అలర్ట్ చేసి, పెడన సీఐ పర్యవేక్షణలో 4 పోలీసు బృందాలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు.
*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మాజీ మంత్రి పేర్నినాని లేఖ రాశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న కోణాన్ని తెలుసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు.
కృష్ణాజిల్లా పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ప్రశంసించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాద్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసుల స్పందించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, సత్తెనపల్లి DSP, సీఐలకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆమె Xలో పోస్ట్ చేశారు.
పోరంకికి చెందిన వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. అమలాపురం టౌన్ సీఐ వీరబాబు వివరాల ప్రకారం.. ప్రేమ విఫలమైన డాక్టర్ యలమంచిలి వెంకట్ జైనేంద్రి ( 28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జైనేంద్రి కిమ్స్ హాస్పిటల్లో వైద్యుడిగా పనిచేశారు. వారం రోజుల నుంచి లాడ్జిలో ఉంటూ విపరీతంగా మద్యం త్రాగి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.