Krishna

News January 11, 2025

విజయవాడలో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పుస్తకాలంటే అమితమైన ప్రేమ. పుస్తక ప్రియుడైన పవన్ విజయవాడ బుక్ ఫెయిర్‌ను శనివారం ఉదయం సందర్శించారు. మాములుగా ఐతే మధ్యాహ్నం నుంచి పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుంది. కానీ పవన్ కోసం ఉదయం రెండు గంటల పాటు స్టాల్స్‌ను ఓపెన్ చేసి ఉంచారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు పుస్తక కేంద్రాలకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్‌లో పుస్తకాలను పరిశీలించారు.

News January 11, 2025

వందే భారత్ సీటింగ్ సామర్థ్యం పెంచిన రైల్వే అధికారులు

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈనెల 13 నుంచి నం.20708, 20707 వందే భారత్ రైళ్లు 16కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 7 నుంచి 14కి పెంచామని, తద్వారా 530గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,128కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 

News January 11, 2025

విజయవాడలో పవన్ కళ్యాణ్ పర్యటన

image

విజయవాడ నగరంలో శనివారం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్థానిక పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా తిలకించారు. ఈ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పవన్ పరిశీలించారు. పలు రకాల పుస్తకాలను స్వయంగా ఆయన పర్యవేక్షణ చేశారు. అనంతరం నిర్వహకులు పలు పుస్తకాలను పవన్‌కు అందించి వాటి విశిష్టతను వివరించారు. 

News January 11, 2025

విజయవాడ: యువతి ఆత్మహత్య.. కేసు నమోదు

image

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో వేముల సబ్బులు అనే యువతి ఆత్మహత్యపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆదివారం రామవరప్పాడు గ్రామంలో ఇంట్లో తండ్రి, కూతుర్లు ఉంటున్న సమయంలోనే మరొక గదిలోకి వెళ్లి యువతి ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. 

News January 11, 2025

వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి నం.20833,84 వందేభారత్ రైళ్లు 20 కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 14 నుంచి 18కి పెంచామని, తద్వారా 1,128గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,440కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

News January 11, 2025

కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)-విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08534 CHZ-VSKP రైలును ఈనెల 11,13,16,18 తేదీలలో, నం.08533 VSKP-CHZ రైలును ఈనెల 12,15,17న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయి. 

News January 11, 2025

కృష్ణా: ట్రాక్టర్లతో బరులు ధ్వంసం చేసిన పోలీసులు

image

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కోడి పందేల నిర్వహణకై ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బరులను రెవెన్యూ అధికారులతో కలసి ధ్వంసం చేశామన్నారు. శాంతియుత వాతావరణంలో సంక్రాంతి పండుగను జిల్లా వాసులు జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది Xలో సూచించారు. 

News January 10, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 3,4,5,6,7 తేదీలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

News January 10, 2025

ఉయ్యూరు: G3 థియేటర్‌కు నోటీసులు

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో G3 శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఈ థియేటర్ బెనిఫిట్‌ షో వేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ ద్వారా తెలిపారు.

News January 10, 2025

పోరంకిలో మహిళ హత్య  UPDATE

image

పోరంకిలో రాణి హత్యకు గురైన ఘటనకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. రాణి కూతురు భర్త నరేశ్‌తో విభేదాల కారణంగా తన కూతురిలో తల్లి వద్దే ఉంటోంది. అయితే వారి కూతురి బడికి పంపకుండా మాల్‌లో పనికి పంపేవారు. ఈ విషయంపై అల్లుడు గురువారం అత్త ఇంటికొచ్చి తన కూతురిని చదివించకుండా పనికి పంపుతున్నారంటూ హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు. 

error: Content is protected !!