India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.
పెనమలూరు మండలంలోని పోరంకిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. అత్తను అల్లుడు బండరాయితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పోరంకికి చెందిన ఉమ్మడి రాణి(65)ని ఆమె అల్లుడు నారబోయిన నరేశ్ రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులకు శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి. పీజీ విద్యార్థుల పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు సెలవుల మూడ్లోకి వెళ్లనున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రెండు రోజులు యూనివర్సిటీకి శెలవు ప్రకటించారు. సోమవారం నుంచి శనివారం వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 20 నుంచి కృష్ణా వర్సిటీ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
ఇబ్రహీంపట్నంలో ఈనెల 7న ఎస్తేరు (పాస్టర్) అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఎస్తేరుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జీవమణికి గతంలో పెళ్లి కాగా, భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఈక్రమంలో షేక్ నాగూర్ వలీతో జీవమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి మందలించడంతో కక్ష పెంచుకొని హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేపై వర్క్షాప్ నిర్వహించారు.
మొవ్వ మండలం కూచిపూడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయ్యంకి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న అయ్యంకి గ్రామానికి చెందిన నాగరాజు(39), పెద్ద మునేశ్వరరావు (60) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 28,30, ఫిబ్రవరి 1,3 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పెడన కలంకారీ ఆర్టిజాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ను కలిసి పెడనలో ఏర్పాటు చేయనున్న కలంకారీ క్లస్టర్ గురించి చర్చించారు.
విశాఖపట్నంలో నేడు బుధవారం పర్యటించనున్న ప్రధాని మోదీ పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని మచిలీపట్నం- గుడివాడ- భీమవరం- నిడదవోలు రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుదీకరణ చేసిన లైన్లను నేడు ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం రైల్వే లైన్ను రూ.4,612 కోట్లతో చేపట్టగా ఆ లైన్లను మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యాన్ని మాయం చేశారన్న వాటిపై అన్ని ఆధారాలు ఉన్నాయని బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. గోడౌన్ మేనేజర్ నుంచి పేర్ని నాని బ్యాంకు అకౌంట్కు డబ్బులు బదిలీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నానికి బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారన్నారు. బెయిల్ పిటీషన్ను 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
Sorry, no posts matched your criteria.