Krishna

News January 7, 2025

కృష్ణా జిల్లాలో 15.40లక్షల మంది ఓటర్లు 

image

ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ-2025లో భాగంగా కృష్ణాజిల్లాలో 15,40,356 మంది తమ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మొత్తం 15,40,356 మంది ఓటర్లలో 7,46,385 మంది పురుషులు, 7,93,916 మంది స్త్రీలు, 55 మంది థర్డ్ జెండర్ ఉన్నారన్నారు. అత్యధికంగా పెనమలూరు నియోజకవర్గంలో 2,95,051 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. 

News January 7, 2025

‘నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు సబ్ కమిటీ’

image

జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ జనరేట్ చేయాలన్నారు.

News January 7, 2025

కృష్ణా: ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిన ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం అనంతరం అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ పూర్తి వివరాలకు https://ntr.ap.gov.in/notice_category/recruitment/ చూడవచ్చని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

News January 7, 2025

అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాల్సిందే: కలెక్టర్ 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం ద్వారా అందిన అర్జీల‌ను నిర్దేశ గ‌డువులోగా నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల్సిందేన‌ని, రెవెన్యూ స‌ద‌స్సుల అర్జీలపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ మందిరంలో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు.

News January 6, 2025

కృష్ణా: ఆ పరీక్షలలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే.!

image

మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం కానిస్టేబుల్(మహిళలు) అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో 543 మందికిగాను 304 మంది బయోమెట్రిక్‌కు హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 148 మంది డిస్ క్వాలిఫై అయ్యారని, ఇవాళ హాజరైనవారిలో 156 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది. 

News January 6, 2025

వైఎస్ జగన్‌ను కలిసిన విజయవాడ మేయర్ 

image

నూతన సంవత్సర సందర్భంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాల పరిస్థితిపై వారు జగన్‌తో చర్చించినట్లు సమాచారం. 

News January 6, 2025

కృష్ణా: MBA పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-ANU పరిధిలో MBA (ఇంటర్నేషనల్ బిజినెస్& ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈనెల 22 నుంచి ఫిబ్రవరి 7 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.

News January 6, 2025

కృష్ణా: ‘నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయండి’

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సత్వరమే నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారీగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలన్నారు.

News January 6, 2025

కోడి పందాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: కలెక్టర్ 

image

కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జిల్లాలో కోడి పందాలు జ‌ర‌ుగకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సోమవారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో కలెక్టర్ స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 

News January 6, 2025

వేడేక్కిన కృష్ణాజిల్లా రాజకీయం 

image

కృష్ణాజిల్లాలో రాజకీయం మరోసారి వేడేక్కింది. నూజివీడులో YCP నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని MLA యార్లగడ్డ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నూజివీడు TDP నాయకులు స్పందించారు. యార్లగడ్డ తన నియోజకవర్గం చూసుకోవాలని పార్థసారథి వర్గీయులు నిన్న వార్నింగ్ ఇచ్చారు. పక్క నియోజకవర్గాలపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. కాగా సారథి వర్గీయుల వ్యాఖ్యలపై యార్లగడ్డ వర్గం కౌంటర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

error: Content is protected !!