India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీ-ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
విజయవాడ మీదుగా ప్రయాణించే పట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ప్రయోగాత్మకంగా ఖమ్మం, మంచిర్యాల స్టేషన్లలో స్టాప్ ఇచ్చామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.22669 ఎర్నాకులం- పట్నా ట్రైన్కు ఈ నెల 27 నుంచి ఖమ్మం, మంచిర్యాలలో స్టాప్ ఇచ్చామన్నారు. ఈ నిర్ణయంతో ఈ రైలు బయలుదేరే, గమ్యస్థానం చేరుకునే సమయాలలో మార్పులు లేవని రైల్వే అధికారులు చెప్పారు.
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల జరిగిన బీ-ఫార్మసీ 7వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఆర్వో ప్లాంటును జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ మంగళవారం పరిశీలించారు. ఆర్వో ప్లాంట్ ద్వారా సురక్షితమైన తాగునీరు కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు అందించాలని తెలిపారు. ప్రతి నెలా 15 రోజులకు ఒకసారి ఫిల్టర్లు పనితీరును పరిశీలించాలని, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని అధికారులకు తెలిపారు.
*ఇబ్రహీంపట్నం: మిస్ అయిన బాలుడి మృతి
*విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు
*విజయవాడ: MPDO అదృశ్యంపై వీడిన మిస్టరీ
* కృష్ణా: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మహిళ బలి
*నూజివీడులో కూలిన ప్రభుత్వ భవనం
*పామర్రులో YS జగన్పై ఫిర్యాదు
*ఇబ్రహీంపట్నంలో సందడి చేసిన సినీ నటులు
*బడ్జెట్పై YS షర్మిల కీలక వ్యాఖ్యలు
*MPDO కోసం 25 కిలోమీటర్లు వెతికారు.
మాదకద్రవ్యాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1933 నెంబరుకు కాల్ చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెంబరును ఏర్పాటు చేసిందని ఏపీ పోలీసు యంత్రాంగం తెలిపింది. ఈ కేంద్రం 24 గంటలు పనిచేస్తుందని, ఫిర్యాదుదారులు, డ్రగ్స్ బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారని పేర్కొంది.
కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన LLM 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
టీడీపీ కూటమి ప్రభుత్వ కృషి ఫలితంగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా కేటాయింపులు జరిగాయని మంత్రి కొలుసు పార్థసారథి ట్వీట్ చేశారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందని కొలుసు వ్యాఖ్యానించారు. టీడీపీ సర్కారు చేసిన నిర్విరామ కృషి వలన విభజన చట్టంలోని హామీలు నెరవేరుతున్నాయని కొలుసు ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ఇంటి ముందు ఆడుకుంటున్న సిద్ధార్థ నాయక్(3) మంగళవారం అదృశ్యం అయ్యాడు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. <<13690032>>గంటల వ్యవధిలోనే ఆడుకుంటూ <<>>ప్రమాదవశాత్తు సమీపంలోని ఎన్టీటీపీఎస్ బూడిద కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. న్యాయం చేయాలంటూ బాలుడి మృతదేహంతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ముందు ఆందోళనకు దిగారు.
పమిడిముక్కల మండలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మంటాడకు చెందిన స్రవంతికి ఓ యాప్ నిర్వహాకులు వంద రూపాయలు పెట్టుబడి పెడితే 400 వస్తాయని నమ్మబలికారు. దీంతో ఆమె ఆదివారం రూ.1,35,000లు పెట్టుబడి పెట్టింది. నిర్వాహకుల నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
Sorry, no posts matched your criteria.