India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
*జగ్గయ్యపేటలో సందడి చేసిన హీరోయిన్
*బ్రాహ్మణిపై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
* విజయవాడ: యువతి ప్రైవేట్ ఫొటోలు షేర్
* నూజివీడు IITలో నేడు కౌన్సెలింగ్
* విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్
*కొడాలి నాని PAపై దాడి
*నూజివీడు IIIT విద్యార్థులకు లోకేశ్ భరోసా
* ఎన్టీఆర్: ‘బాబాయి హత్య గుండెపోటుగా చిత్రీకరణ’
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన పీజీ-ఆర్ట్స్ గ్రూపుల 1వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జులై 29వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. వివరాలకు https://kru.ac.in/వెబ్సైట్ చూడాలని సూచించింది.
రాష్ట్ర బడ్జెట్పై మంత్రి కొలుసు పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీకి వెళుతూ.. ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ సర్కారు కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నామని, త్వరలో రాష్ట్రానికి దిక్సూచిలాంటి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. వైసీపీ పాలనలో అన్ని శాఖల్లో దోపిడీ మాత్రమే జరిగిందన్నారు.
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 16 మంది MLAలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా..వారిలో కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే వర్ల, కాగిత, కొలికపూడి, సుజనా, యార్లగడ్డ, వెనిగండ్ల మొదటి గళం వినిపించనున్నారు. మరి మీ MLA ఏ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు పసుపు దుస్తులు, కండువాలు ధరించి అసెంబ్లీకి హాజరు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రజా ప్రతినిధులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.. సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనుంది.
మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్ అప్లోడ్ చేసుకొని ఒంటరి మహిళలకు వల వేసిన నిత్య పెళ్లికొడుకును గవర్నర్ పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మోహన్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తానంటూ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఒంటరి మహిళలను మోసం చేసి నగదు వసూలు చేసి పారిపోయేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
లక్ష కడితే రూ.10 లక్షలు ఇస్తామంటూ పవన్, నాగూర్, అనిత, నాగరాజు అనే నలుగురు మోసం చేశారంటూ, నున్న పోలీసులకు గుంటూరుకు చెందిన సరస్వతి అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ముఠా డబ్బుతో ఉన్న ఒక గోడౌన్ చూపించి లక్షకు పది లక్షలిస్తామంటే అప్పు చేసి రూ.36 లక్షలు వారికి ఇచ్చానని సరస్వతి పోలీసులకు తెలిపింది. విజయవాడ సుందరయ్యనగర్లోని నాగూర్ ఇంటికి వచ్చి డబ్బు అడగగా స్పందించలేదని బాధితురాలు వాపోయింది.
విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా, ఖాళీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ హైజీనిస్ట్-1, డెంటల్ టెక్నీషియన్-1, డెంటల్ మెకానిక్-1 పోస్టుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం https://gdchvja.in/ వెబ్సైట్ చూసుకోవాలని తెలిపారు.
విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో డిస్ట్రిక్ట్ కమిటీ ద్వారా, ఖాళీ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ హైజీనిస్ట్-1, డెంటల్ టెక్నీషియన్-1, డెంటల్ మెకానిక్-1 పోస్టుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం https://gdchvja.in/ వెబ్సైట్ చూసుకోవాలని తెలిపారు.
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ కలెక్టర్ సృజన తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 0866-2575833 నెంబర్తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో ఎక్కడైనా అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.