India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2025-26 సంవత్సరానికి సంబంధించి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఈనెల 7,8 తేదీలలో బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్లో నిర్వహిస్తున్నామని APCPDCL తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పై తేదీలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వినియోగదారులు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామంది.
కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామంలోని ఇసుక రీచ్లో అక్రమ తవ్వకాలపై కలెక్టర్ లక్ష్మిశ విచారణకు ఆదేశించారు. పెండ్యాల ఇసుక రీచ్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదులు, మీడియా కథనాలపై స్పందించిన కలెక్టర్ దీనిపై ఆదివారం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం వెలువడింది.
విజయవాడకు చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన పద్మకు అమలాపురానికి చెందిన సతీశ్తో 5 నెలల క్రితం పెళ్లైంది. ఉద్యోగరీత్యా వారు భాగ్యలక్ష్మి కాలనీలో నివాసముంటున్నారు. శనివారం ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో క్షణికావేశంలో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రాష్ట్ర BJP అధ్యక్ష పదవి రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా పేరు కీలకంగా వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధీశ్వరికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నందున సంక్రాంతి అనంతరం బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సుజానాతో పాటు MLC పీవీఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పురిగళ్ల రఘురాం పేర్లు వినిపిస్తున్నాయి.
గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామం బయట పామాయిల్ తోట వద్ద నుంచి కొండగట్టు పైకి తెల్లవారుజామున 3 గంటలకు పులి, దాని పిల్లలు రోడ్డు దాటిందని ఆర్టీసీ కండక్టర్ రవికిరణ్ చెప్పాడు. హనుమాన్ జంక్షన్, ఆగిరిపల్లి సర్వీస్ రూట్లో కండక్టర్ రవికిరణ్ తెల్లవారుజామున ఆగిరిపల్లి నుంచి గన్నవరం వస్తుండగా పులి పిల్లలు రోడ్డు దాటుతుండటం చూసి భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశానన్నాడు.
గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగివ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.
బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనపై పెనమలూరు P.S.లో కేసు నమోదైంది. సనత్ నగర్లో బాలిక కుటుంబ సభ్యులతో ఉంటూ ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తోంది. ఈ క్రమంలో కంకిపాడుకు చెందిన విజయబాబు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 2న బాలికకు ఫోన్ చేసి బయటకు వెళ్దామని చెప్పి కంకిపాడుకు తీసుకెళ్లాడు. బాలికను రూంలో బంధించి లైంగిక దాడి చేసి, 3వ తేదీన పంపాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరుణాచలప్రదేశ్లో సీఆర్పిఎఫ్ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. భౌతిక కాయం రావడానికి మరొక రోజు ఆలస్యం అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు రావలసిన భౌతికకాయం వాతావరణం అనుకూలించక ఫ్లైట్ రద్దు అవ్వడంతో ఆలస్యమైందన్నారు. 5వ తేదీ బంటుమిల్లిరోడ్డులోని ఆయన నివాసం వద్దకు తీసుకురానున్నట్లు తెలిపారు.
విజయవాడలోని ఓ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కళ్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా గత వారం రోజుల క్రితం విద్యార్థిని HOD మందలించడంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ .. మృతి చెందగా యాజమాన్యం కాలేజీకి సెలవు ప్రకటించింది. కారణమైన హెచ్.ఓ.డి. ని సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. శుక్రవారం గొల్లపూడి సచివాలయం సెంటర్లో జరిగిన ప్రమాదంలో అతను మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అతను ఎవరనేది తెలియలేదని.. గుర్తిస్తే భవానిపురం పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.