Krishna

News January 11, 2025

వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి నం.20833,84 వందేభారత్ రైళ్లు 20 కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 14 నుంచి 18కి పెంచామని, తద్వారా 1,128గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,440కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

News January 11, 2025

కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)-విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08534 CHZ-VSKP రైలును ఈనెల 11,13,16,18 తేదీలలో, నం.08533 VSKP-CHZ రైలును ఈనెల 12,15,17న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయి. 

News January 11, 2025

కృష్ణా: ట్రాక్టర్లతో బరులు ధ్వంసం చేసిన పోలీసులు

image

కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కోడి పందేల నిర్వహణకై ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బరులను రెవెన్యూ అధికారులతో కలసి ధ్వంసం చేశామన్నారు. శాంతియుత వాతావరణంలో సంక్రాంతి పండుగను జిల్లా వాసులు జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది Xలో సూచించారు. 

News January 10, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 3,4,5,6,7 తేదీలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

News January 10, 2025

ఉయ్యూరు: G3 థియేటర్‌కు నోటీసులు

image

రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో G3 శ్రీనివాస థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంటకు ఈ థియేటర్ బెనిఫిట్‌ షో వేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని థియేటర్ యాజమాన్యానికి ఉయ్యూరు టౌన్ పోలీసులు నోటీస్ ద్వారా తెలిపారు.

News January 10, 2025

పోరంకిలో మహిళ హత్య  UPDATE

image

పోరంకిలో రాణి హత్యకు గురైన ఘటనకు సంబంధించి పోలీసులు పలు విషయాలు వెల్లడించారు. రాణి కూతురు భర్త నరేశ్‌తో విభేదాల కారణంగా తన కూతురిలో తల్లి వద్దే ఉంటోంది. అయితే వారి కూతురి బడికి పంపకుండా మాల్‌లో పనికి పంపేవారు. ఈ విషయంపై అల్లుడు గురువారం అత్త ఇంటికొచ్చి తన కూతురిని చదివించకుండా పనికి పంపుతున్నారంటూ హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు. 

News January 10, 2025

ఆ సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫోన్ చేయండి: సీపీ

image

గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.

News January 10, 2025

పెనమలూరులో అత్తను చంపిన అల్లుడు

image

పెనమలూరు మండలంలోని పోరంకిలో గురువారం రాత్రి దారుణం జరిగింది. అత్తను అల్లుడు బండరాయితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. కుటుంబ కలహాల నేపథ్యంలో పోరంకికి చెందిన ఉమ్మడి రాణి(65)ని ఆమె అల్లుడు నారబోయిన నరేశ్ రాయితో కొట్టడంతో మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉయ్యూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 9, 2025

కృష్ణా: రేపటి నుంచి సెలవులు

image

కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులకు శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి. పీజీ విద్యార్థుల పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు సెలవుల మూడ్‌లోకి వెళ్లనున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రెండు రోజులు యూనివర్సిటీకి శెలవు ప్రకటించారు. సోమవారం నుంచి శనివారం వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 20 నుంచి కృష్ణా వర్సిటీ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

News January 9, 2025

NTR: తల్లిని హత్య చేసిన కూతురు

image

ఇబ్రహీంపట్నంలో ఈనెల 7న ఎస్తేరు (పాస్టర్) అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఎస్తేరుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జీవమణికి గతంలో పెళ్లి కాగా, భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఈక్రమంలో షేక్ నాగూర్ వలీతో జీవమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి మందలించడంతో కక్ష పెంచుకొని హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.