India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం.ఫార్మసీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఆర్టీసీ బస్సు ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం VJA నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న RTC మెట్రో బస్సు అదుపుతప్పి ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించారు. ఈ క్రమంలో హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం.ఫార్మసీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
విజయవాడలో విషాద ఘటన వెలుగు చూసింది. మాచవరం సీఐ ప్రకాశ్ వివరాల మేరకు.. చుట్టుగుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. తనకు ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడిగాడు. వాళ్లు నిరాకరించడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్లో సీఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గుడివాడకు చెందిన కర్ర రామకృష్ణ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం తన స్వగ్రామమైన గుడివాడలోని ఎన్జీవో కాలనీకి తీసుకురానున్నారు. రామకృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశభక్తులందరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఈ నెల 17లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ/బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలకు https://cfw.ap.nic.in/ వెబ్సైట్ చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులు సూచించారు.
ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్, అగర్తల మధ్య (ట్రైన్ నం. 07029/07030) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6 నుంచి సికింద్రాబాద్ – అగర్తల, అగర్తల – సికింద్రాబాద్ రైలు ఈ నెల 10 నుంచి నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మద్యం తాగే చోటుతో వచ్చిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామవరప్పాడుకు చెందిన వైకుంఠం న్యూ ఇయర్ రోజు ఓ శ్మశాన వాటికలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే రోజు వైకుంఠం తాగే చోట సాయి అనే వ్యక్తి ఉండడంతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి తీసుకురాగా.. మళ్లీ వైకుంఠం బయట వెళ్లాడు. మరో సారి ఘర్షణ పడడంతో సాయి కత్తితో హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
విజయవాడలో బుక్ ఫెయిర్ గురువారం ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు స్టాల్స్లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. మెగాస్టార్ చిరంజీవి సినీప్రస్థానం గురించి యూ.వినాయకరావు రచించిన “మెగాస్టార్ లెజెండ్ బుక్”ను ఆయన తీసుకున్నారు. సంబంధిత ఫొటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో ఎ.కొండూరుకు చెందిన దారావత్ <<15046039>>చంద్రశేఖర్ (25) మృతి చెందడం<<>>పై పోలీసులు వివరణ ఇచ్చారు. కార్డియాటిక్ అరెస్ట్తో మరణించినట్లు వైద్యులు వెల్లడించారన్నారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన రిపోర్టుల్లో అతనికి SEPSIS కారణంగా WBC కౌంట్ 30వేలకు చేరిందన్నారు. అతను గత 5 రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.