Krishna

News July 20, 2024

నేడు కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవులు

image

కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు.

News July 20, 2024

నేడు కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవులు

image

కృష్ణా జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహేరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమాచారాన్ని జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియజేయాలన్నారు.

News July 19, 2024

ఎన్టీఆర్: డీసీపీగా గౌతమ్ శాలి బాధ్యతలు

image

ఎన్టీఆర్ జిల్లా లా అండ్ ఆర్డర్ డీసీపీగా గౌతమ్ శాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా నేరుగా వచ్చి తనను సంప్రదించవచ్చన్నారు. గతంలో ఆమె అనంతపురం ఎస్పీగా పని చేసి విజయవాడ డీసీపీగా వచ్చారు.

News July 19, 2024

మంత్రి కొల్లు రవీంద్రను కలిసిన జనసేన మహిళా నేత అరుణ

image

మంత్రి కొల్లు రవీంద్రను జనసేన మహిళా నేత రాయపాటి అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని చూసి వైసీపీ నేతల వెన్నులో వణుకుపుడుతోందని ఆమె అన్నారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాతో ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు. 

News July 19, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బోధనా సిబ్బందికి 23న డెమో

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాసంస్థల్లో పార్ట్‌టైమ్ గెస్ట్ ఉపాధ్యాయ/అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈనెల 23న డెమో నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారిణి ప్రేమావతి తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఈ డెమో జరగనున్నట్లు ఆమె చెప్పారు. ఈ ఉద్యోగాలకు బీఈడీ, పీజీ, టెట్ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.

News July 19, 2024

విజయవాడ: ఇన్ స్ట్రా గ్రామ్‌లో ప్రేమ.. బాలిక అదృశ్యం

image

ఇన్‌స్ట్రాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక(16)ఇల్లు వదిలి అదృశ్యమైన ఘటన అజిత్‌సింగ్‌నగర్ PS పరిధిలో జరిగింది. కుంటుంబ సభ్యుల వివరాలు.. బాలిక 10వ తరగతి పూర్తి చేసింది. తరచూ..ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి ప్రశ్నించింది. తిరుపతికి చెందిన జాన్సన్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లి మందలించింది. ఆ రాత్రి నుంచి తమ కుమార్తె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

News July 19, 2024

కృష్ణా: ఆక్వాటిక్ క్రీడాకారులకు ముఖ్య గమనిక

image

విజయవాడలోని VMC సర్ విజ్జి ఈత కొలనులో ఆగస్టు 4న ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఆక్వాటిక్ జట్టు ఎంపిక పోటీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆక్వాటిక్ సంఘ కార్యదర్శి రమేశ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీల్లో పాల్గొనే స్విమ్మర్లు(17-25 సంవత్సరాలలోపు వారు మాత్రమే) జులై 30లోపు జాతీయ స్విమ్మింగ్ సమాఖ్య UID సంఖ్యతో ఆక్వాటిక్ సంఘం వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని రమేశ్ సూచించారు.

News July 19, 2024

కృష్ణా: బంగారం దోచుకెళ్లిన కేసులో నిందితుడికి జైలు శిక్ష

image

గుడివాడకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి వద్ద గోల్డ్ చైన్ దొంగిలించిన కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు(37)కు న్యాయస్థానం 3ఏళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2022 ఫిబ్రవరిలో ఆమె కోదాడ వెళుతుండగా.. ఆమెతో మాటలు కలిపిన నిందితుడు మత్తుమందు ఇచ్చి బంగారం దోచుకున్నాడు. వృద్ధురాలు కేసు నమోదు చేయగా విజయవాడ పోలీసులు ఛార్జిషీట్ వేయగా, గురువారం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. 

News July 19, 2024

కృష్ణా: ఈ నెల 21న చెస్ జట్ల ఎంపిక పోటీలు

image

గుడివాడ త్రివేణి స్కూల్‌లో ఈ నెల 21న కృష్ణా జిల్లా అండర్-11 బాలబాలికల చెస్ జట్ల ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా చెస్ సంఘ కార్యదర్శి NM ఫణికుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల బాలలు ఈ నెల 20లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోటీల్లో ఎంపికైనవారు ఈ నెల 27, 28 తేదీలలో భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కృష్ణా జిల్లా తరఫున ఆడతారని ఫణికుమార్ చెప్పారు.

News July 19, 2024

కృష్ణా: పర్యవేక్షక కమిటీల్లో సభ్యుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

SC, ST అత్యాచార నిరోధక చట్ట అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షక కమిటీలో నాన్ అఫిషియల్ సభ్యులను నియమించేందుకు అధికారులు అర్హులైన వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షాహిద్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.