Krishna

News January 7, 2025

వీరవల్లి: ప్రియుడి మోజులో కూతురిని రోడ్డుపై వదిలిన తల్లి

image

బాపులపాడు మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నంద్యాల(D) పొన్నవరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తె (11)ను తీసుకొని గతేడాది నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య, కూతురు కనిపించడం లేదని ఆమె భర్త రవి నంద్యాల పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడు మోజులో పడి బిడ్డను తల్లి వీరవల్లి రోడ్డుపై వదిలేసింది. సోమవారం బాలికను గుర్తించి నంద్యాల పోలీసులకు అప్పగించనున్నట్లు వీరవల్లి SI శ్రీనివాస్ తెలిపారు.

News January 7, 2025

పెనుగొలనులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

image

గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.

News January 7, 2025

జగన్‌కు షాక్ ఇచ్చిన విజయవాడ కోర్ట్

image

పాస్‌పోర్టు విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్‌ను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. పాస్‌పోర్టు దరఖాస్తుకు NOC ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. 2024లోనే పాస్‌పోర్టు ఎక్స్‌పైర్ అయినట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. కాగా పాస్‌పోర్టు ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని జగన్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు సూచించింది. 

News January 7, 2025

కృష్ణా: సంక్రాంతి స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్ ఇవే.!

image

విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)-తిరుపతి(TPTY) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02764 CHZ-TPTY రైలు ఈనెల 8,11,15న, నం.02763 TPTY-CHZ రైలు ఈనెల 9,12,16న నడుపుతామన్నారు. నం.02764 రైలు చర్లపల్లిలో పై తేదీలలో సాయంత్రం 6.55కి బయలుదేరి తరవాతి రోజు అర్ధరాత్రి 12.10కి విజయవాడ, ఉదయం 7.15కి తిరుపతి చేరుకుంటాయన్నారు. 

News January 7, 2025

కృష్ణా జిల్లాలో 15.40లక్షల మంది ఓటర్లు 

image

ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ-2025లో భాగంగా కృష్ణాజిల్లాలో 15,40,356 మంది తమ ఓటు హక్కు నమోదు చేయించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మొత్తం 15,40,356 మంది ఓటర్లలో 7,46,385 మంది పురుషులు, 7,93,916 మంది స్త్రీలు, 55 మంది థర్డ్ జెండర్ ఉన్నారన్నారు. అత్యధికంగా పెనమలూరు నియోజకవర్గంలో 2,95,051 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. 

News January 7, 2025

‘నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు సబ్ కమిటీ’

image

జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ జనరేట్ చేయాలన్నారు.

News January 7, 2025

కృష్ణా: ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

image

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిన ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల పరిశీలన, అభ్యంతరాల పరిష్కారం అనంతరం అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. మెరిట్ లిస్ట్ పూర్తి వివరాలకు https://ntr.ap.gov.in/notice_category/recruitment/ చూడవచ్చని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 

News January 7, 2025

అర్జీల‌ను గ‌డువులోగా ప‌రిష్క‌రించాల్సిందే: కలెక్టర్ 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం ద్వారా అందిన అర్జీల‌ను నిర్దేశ గ‌డువులోగా నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల్సిందేన‌ని, రెవెన్యూ స‌ద‌స్సుల అర్జీలపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య సమావేశ మందిరంలో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మంలో కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు.

News January 6, 2025

కృష్ణా: ఆ పరీక్షలలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే.!

image

మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం కానిస్టేబుల్(మహిళలు) అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో 543 మందికిగాను 304 మంది బయోమెట్రిక్‌కు హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 148 మంది డిస్ క్వాలిఫై అయ్యారని, ఇవాళ హాజరైనవారిలో 156 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది. 

News January 6, 2025

వైఎస్ జగన్‌ను కలిసిన విజయవాడ మేయర్ 

image

నూతన సంవత్సర సందర్భంగా విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గాల పరిస్థితిపై వారు జగన్‌తో చర్చించినట్లు సమాచారం.