Krishna

News January 6, 2025

కృష్ణా: MBA పరీక్షల రివైజ్డ్ టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-ANU పరిధిలో MBA (ఇంటర్నేషనల్ బిజినెస్& ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఈనెల 22 నుంచి ఫిబ్రవరి 7 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని సూచించింది.

News January 6, 2025

కృష్ణా: ‘నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయండి’

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సత్వరమే నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారీగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలన్నారు.

News January 6, 2025

కోడి పందాలు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: కలెక్టర్ 

image

కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జిల్లాలో కోడి పందాలు జ‌ర‌ుగకుండా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై సోమవారం క‌లెక్ట‌రేట్‌లోని శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో కలెక్టర్ స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. 

News January 6, 2025

వేడేక్కిన కృష్ణాజిల్లా రాజకీయం 

image

కృష్ణాజిల్లాలో రాజకీయం మరోసారి వేడేక్కింది. నూజివీడులో YCP నేతలు అక్రమ మైనింగ్ చేస్తున్నారని MLA యార్లగడ్డ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నూజివీడు TDP నాయకులు స్పందించారు. యార్లగడ్డ తన నియోజకవర్గం చూసుకోవాలని పార్థసారథి వర్గీయులు నిన్న వార్నింగ్ ఇచ్చారు. పక్క నియోజకవర్గాలపై అసత్య ప్రచారం మానుకోవాలన్నారు. కాగా సారథి వర్గీయుల వ్యాఖ్యలపై యార్లగడ్డ వర్గం కౌంటర్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

News January 6, 2025

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!

image

కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు. 

News January 6, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్(2022, 23, 24 బ్యాచ్‌లు) రెగ్యులర్& సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఈనెల 29 నుంచి నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 18లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

News January 6, 2025

నేడు తాడేపల్లి చేరుకోనున్న మాజీ సీఎం జగన్ 

image

బెంగుళూరు వెళ్లిన మాజీ సీఎం జగన్ సోమవారం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 5.20కి ఆయన బెంగుళూరు నుంచి గన్నవరం చేరుకుంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5.30కి గన్నవరంలో రోడ్డు మార్గాన బయలుదేరి 6 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి మాజీ సీఎం జగన్ చేరుకుంటారని ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 

News January 6, 2025

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!

image

కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు. 

News January 6, 2025

ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా

image

ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.

News January 5, 2025

కృష్ణా: విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

image

2025-26 సంవత్సరానికి సంబంధించి అమలు చేయనున్న విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై విజయవాడలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరగనుంది. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఈనెల 7,8 తేదీలలో బృందావన కాలనీలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నామని APCPDCL తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పై తేదీలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకు వినియోగదారులు అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తామంది.