Krishna

News July 17, 2024

బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ మీదుగా KSR బెంగుళూరు, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.18463/18464 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌‌లు ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18463 ట్రైన్‌కు నవంబర్ 14, 18464 ట్రైన్‌కు నవంబర్ 15 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లు ఉంటాయన్నారు.

News July 16, 2024

ఎన్టీఆర్: అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పిన APSRTC

image

పౌర్ణమి గిరి ప్రదక్షిణకు అరుణాచలం వెళ్లే భక్తుల కోసం విజయవాడ నుంచి అరుణాచలానికి ఆర్టీసీ స్పెషల్ సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నామని సంస్థ అధికారులు తెలిపారు. జూలై 19న ఈ బస్సులు విజయవాడ, ఆటోనగర్ డిపోల నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం మీదుగా అరుణాచలం వెళతాయన్నారు. ఈ బస్సు టికెట్లను APSRTC అధికారిక వెబ్‌సైట్ https://www.apsrtconline.in/లో బుక్ చేసుకోవచ్చన్నారు.

News July 16, 2024

కృష్ణా: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కౌన్సిలింగ్ తేదీలు ఇవే 

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల కౌన్సిలింగ్‌ను ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య అమరేంద్ర కుమార్ తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయలలో, 24, 25 తేదీల్లో ఒంగోలు అభ్యర్థులకు ఇడుపులపాయలోనూ, 26,27 తేదీల్లో శ్రీకాకుళం అభ్యర్థులకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. 

News July 16, 2024

కృష్ణా: ప్రయాణీకుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణీకుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా తిరునల్వేలి(TEN), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.06087 TEN- SHM ట్రైన్‌ను జూలై 18, 25 తేదీలలో నం.06088 SHM- TEN ట్రైన్‌ను జూలై 20, 27 తేదీలలో నడపనున్నట్లు SCR తెలిపింది. ఈ ట్రైన్లు ఏపీలో విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని పేర్కొంది.

News July 16, 2024

కృష్ణా: అన్న క్యాంటీన్లకు రూ.2 లక్షల విరాళం 

image

ఏపీ పెన్షన్‌దారుల సంఘ సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు. ఈ మేరకు పెన్షన్‌దారుల సంఘ ప్రతినిధులు త్వరలో ప్రభుత్వం ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లకు రూ.2 లక్షల విరాళం సీఎంకు అందించారు. ఈ సందర్భంగా వారు రూ.2 లక్షల చెక్కును చంద్రబాబుకు సంఘ సభ్యులు అందజేయగా, పెన్షన్‌దారుల సంఘానికి సీఎం అభినందనలు తెలిపారు. 

News July 16, 2024

సచివాలయ సెక్రటరీ జనరల్‌గా ప్రసన్నకుమార్

image

ఆంధ్రప్రదేశ్ సచివాలయ (శాసనసభ, శాసనమండలి) సెక్రటరీ జనరల్‌గా సుప్రీంకోర్ట్ మాజీ రిజిస్ట్రార్ సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న డా.PPK రామానుజాచార్యులు రాజీనామా చేయడంతో ప్రసన్నకుమార్ తాజాగా సెక్రటరీ జనరల్‌గా నియామకమయ్యారు. ప్రసన్నకుమార్ గతంలో ఢిల్లీ అసెంబ్లీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

News July 16, 2024

కృష్ణా: ‘మాతా,శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి’

image

కలెక్టర్ DK బాలాజీ మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సమావేశ మందిరంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశమై మాతా శిశు మరణాల రేటు తగ్గేందుకు అధికారులు కృషి చేయాలన్నారు.

News July 16, 2024

శానిటేషన్‌లో ప్రజల భాగస్వామ్యం అవసరం: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం, దోమల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేసుకోవాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వారం ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించాలన్నారు.

News July 16, 2024

కృష్ణా: ‘పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం’

image

పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో మంగళవారం ఆయన ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో పామాయిల్ అత్యధికంగా సాగవుతుందని, గత సంవత్సరం నుంచి అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో సైతం పామాయిల్ సాగుతున్నట్లుగా గుర్తించామని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

News July 16, 2024

కృష్ణా జిల్లాలో 36.2 మి.మీల వర్షపాతం

image

కృష్ణా జిల్లాలో 36.2 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను వెల్లడించారు. అత్యధికంగా బంటుమిల్లి మండలంలో 88.8 మి.మీలు నమోదవ్వగా అత్యల్పంగా బాపులపాడు మండలంలో 1.6 మి.మీలు వర్షపాతం నమోదైందని వివరించారు.