Krishna

News July 16, 2024

కృష్ణా: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జులై 31 వరకు పెంచినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News July 16, 2024

కృష్ణా: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జూలై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News July 16, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.13351 ధన్‌బాద్- అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా ఈ ట్రైన్ నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ ట్రైన్‌కు తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News July 16, 2024

VJA: ఇన్‌స్టా రీల్స్‌ మార్ఫింగ్‌‌లో చిక్కుకున్న అక్కాచెల్లెళ్లు

image

తాడేపల్లిగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్ల ఇన్‌స్టా రీల్స్‌ మార్ఫింగ్‌‌పై కేసు నమోదైంది. బాధితురాళ్ల వివరాల ప్రకారం.. తాము INSTA రీల్స్ చేస్తామని, వాటిని గంగాధర్‌ అనే వ్యక్తి డౌన్‌లోడ్‌ చేసుకుని ముఖాలు మార్చి నగ్న చిత్రాలు తయారు చేసి వేధిస్తున్నాడని విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ స్పందించి నిందితుడిది కృష్ణా జిల్లా మోపిదేవిగా గుర్తించి అక్కాచెల్లెళ్లకు న్యాయం చేస్తామన్నారు.

News July 16, 2024

విజయవాడ: కిడ్నీ రాకెట్ నిందితుడి అరెస్ట్

image

విజయవాడ కిడ్నీ రాకెట్‌ కేసులో ఒక నిందితుడిని గుంటూరు నగరపాలెం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని ఓ ముఠా గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు వద్ద కిడ్నీ తీసుకున్నారు. చివరికి డబ్బు ఇవ్వకుండా మోసం చేయడంతో మధుబాబు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి అనే వ్యక్తిని పట్టుకున్నారు.

News July 16, 2024

కైకలూరు: లాభాల బాటలో రూప్‌చంద్‌ చేపలు

image

కైకలూరు- ముదినేపల్లి మార్కెట్‌లో అసాధారణంగా రూప్‌చంద్‌ రేటు, అటు శీలావతి రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధరణంగా కేజీ రూప్ చంద్‌‌ను పెంచడానికి రైతుకు అన్నీ ఖర్చులు కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. నేడు మార్కెట్‌లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలకడంతో రూ.15 నుంచి రూ.20లు రైతుకు గిట్టుబాటు అవుతుంది. చేపల సాగు లాభాల బాట పట్టడం శుభసూచకం అని రైతులంటున్నారు.

News July 15, 2024

కృష్ణా జిల్లాలో TODAY టాప్ న్యూస్ ఇవే

image

* కృష్ణా: యువతకు శుభవార్త చెప్పిన APSSDC
* కృష్ణా: రోడ్డు ప్రమాదంలో 16 నెలల బాలుడి మృతి
* జగ్గయ్యపేట ఫ్యాక్టరీ ఘటన.. మరో వ్యక్తి మృతి
* కంచికచర్ల వద్ద ఘోర విషాదం.. ముగ్గురి మృతి
* విజయవాడలో అర్ధరాత్రి కారు బీభత్సం
* కృష్ణా జిల్లాలో తగ్గని ఉల్లి, టమాటా ధరలు
* విజయవాడలో కారు డ్రైవర్ ఆత్మహత్య
* కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక
* ఎన్టీఆర్ జిల్లాలో 65 పోస్టల్ ఉద్యోగాలు

News July 15, 2024

ఎన్టీఆర్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 68 అర్జీల స్వీకరణ

image

విజయవాడ పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీపీ రాజశేఖర్ బాబు 68 అర్జీలను స్వీకరించినట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు విజయవాడ కమీషనరేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్జీలను సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని సీపీ ఆదేశించారని కమీషనరేట్ స్పష్టం చేసింది. 

News July 15, 2024

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషిచేద్దాం: మంత్రి కొలుసు

image

ఏలూరు జిల్లా అధికారులతో సోమవారం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయా శాఖల ముఖ్య అధికారులు, కలెక్టర్ సెల్వి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశించి మంత్రి కొలుసు మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేద్దామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

News July 15, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రద్దు చేసిన విజయవాడ-గూడూరు విక్రమసింహపురి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. నం.12744 విజయవాడ-గూడూరు రైలును ఈ నెల 17 నుంచి, నం.12743 గూడూరు-విజయవాడ రైలును ఈ నెల 18 నుంచి యథావిధిగా నడుపుతామన్నారు.