Krishna

News January 21, 2025

వీరులపాడు: బైక్ అదుపు తప్పి యువకుడు మృతి

image

వీరులపాడు మండల పరిధిలోని వెల్లంకి గ్రామంలో సోమవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కంచె సంతోష్ మెహతాగా గుర్తించారు. తమకు అండగా ఆసరాగా ఉంటాడనే కొడుకు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 21, 2025

పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి

image

పమిడిముక్కలలో నిన్న జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24)లు మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెద్ద కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతిల విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

News January 21, 2025

విచారణ కమిటీ ముందు హాజరైన కొలికపూడి

image

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాస్ సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, పద్ధతి మార్చుకోవాలని కమిటీ హెచ్చరించినట్లు తెలస్తుంది. పార్టీకి చెడ్డపేరు వస్తుందని, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కాగా విచారణ నివేదికను కమిటీ అధిష్ఠానానికి పంపనుంది.

News January 21, 2025

ఎస్పీని కలిసిన అవనిగడ్డ నూతన డీఎస్పీ విద్యశ్రీ

image

అవనిగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన తాళ్లూరి విద్యశ్రీ సోమవారం కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర రావును మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి డీఎస్పీ పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అవనిగడ్డ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. 

News January 20, 2025

విజయవాడ: పీజీఆర్ఎస్‌కు 92 ఫిర్యాదులు

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి 92 ఫిర్యాదులు వచ్చాయని డీసీపీ ఏబీటీఎస్. ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

News January 20, 2025

‘కుష్టు’ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం: కలెక్టర్‌ 

image

కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి పిబ్రవరి 2వ తేది వరకు జిల్లాలో కుష్టు వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకిని ‘కుష్టు’ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో కుష్టు వ్యాధి పరీక్షలకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. 

News January 20, 2025

కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో BA. LLB కోర్సు(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్(Y 18 నుంచి Y 21 బ్యాచ్‌లు) రెగ్యులర్&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 10 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 27లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU సూచించింది. 

News January 20, 2025

పమిడిముక్కల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

పమిడిముక్కల మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్రం(23), ముక్త దుర్గ బాబు(24) లు బైక్‌పై వెళ్తుండగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై కెసిపి ఫ్లైఓవర్ గోడను అదుపుతప్పి ఢీకొనడంతో మృతి చెందారు. కాకినాడ నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఉదయాన్నే మంచు ప్రభావంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పమిడిముక్కల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News January 20, 2025

కైకలూరు: పాత కక్షలతో హత్య.. పట్టుకున్న పోలీసులు

image

పాత కక్షల కారణంగా పథకం ప్రకారం కాపుకాసి హత్య చేసిన నిందితుడు బోధనపు శ్రీనివాసరావును అరెస్టు చేసారని ఏలూరు డీఎస్పీ డి. శ్రావణకుమార్ తెలిపారు. ఆదివారం కైకలూరు సర్కిల్ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కొన్నిరోజుల క్రిందట కలిదిండి మండలం సంతోషపురం గ్రామ మాజీ సర్పంచ్ కాలువ నల్లయ్య హత్యకు గురయ్యారు. విచారణ చేపట్టి తక్కువ సమయంలో ఈ కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు.

News January 20, 2025

విజయవాడలో యువకుడి ఆత్మహత్య

image

విజయవాడ నగరంలోని రాధనగర్‌లో శనివారం వాచ్‌మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు