Krishna

News July 15, 2024

కృష్ణా: నేడు ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ డే

image

కృష్ణా జిల్లాలో రెగ్యులర్, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలపై రేపు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వారి పరిధిలోని ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

News July 15, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

విజయవాడ మీదుగా సికింద్రాబాద్, గూడూరు మధ్య ప్రయాణించే సింహపురి ఎక్స్‌ప్రెస్‌లకు అదనంగా 2 జనరల్ కోచ్‌‌లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12710/12709 సింహపురి ఎక్స్‌ప్రెస్‌ ప్రస్తుతం 2 జనరల్ కోచ్‌లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 12710 ట్రైన్‌ను నవంబర్ 8 నుంచి, 12709ట్రైన్‌ను నవంబర్ 9 నుంచి 2 అదనపు జనరల్ కోచ్‌లతో నడుపుతామన్నారు.

News July 15, 2024

కృష్ణా: ఆరు రోజులపాటు పినాకిని ఎక్స్‌ప్రెస్‌ రద్దు

image

విజయవాడ, చెన్నై సెంట్రల్ మధ్య ప్రయాణించే పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను ట్రాక్ మరమ్మతుల కారణంగా ఆరు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 5 నుంచి 10 వరకు నం.12712 చెన్నై సెంట్రల్-విజయవాడ, నం.12711 విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని కోరారు.

News July 14, 2024

సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం: సీఎం చంద్రబాబు

image

మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏపీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.

News July 14, 2024

కృష్ణా: టుడే టాప్ న్యూస్

image

*విజయవాడ రైల్వే డివిజన్‌పై CBI దృష్టి, * జగన్‌పై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు, *ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి, *విజయవాడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డు క్లోజ్, * కృష్ణా: ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు, * కేతిరెడ్డి చెప్పిన మాట నిజం: పేర్ని నాని, *ఫారిన్ అమ్మాయితో..NTR జిల్లా అబ్బాయి పెళ్లి, , *ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా: MP బాలశౌరి, *మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు,

News July 14, 2024

కృష్ణా: మాజీ మంత్రి స్మారకార్థం అంబులెన్స్ అందజేత

image

మాజీ మంత్రి దివంగత పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ ఆదివారం ఆయన స్మారకార్థం అధునాతన ఆంబులెన్స్ అందజేసింది. ఈ మేరకు పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఆదివారం సీఎం చంద్రబాబుకు అంబులెన్స్‌ను అందజేశారు. కాగా ఉపేంద్ర 1996-99 మధ్య విజయవాడ లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. 

News July 14, 2024

విజయవాడ: టీటీ ర్యాంకింగ్ టోర్నీలో యశ్వంత్‌కు కాంస్యం

image

రాజమండ్రిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో విజయవాడకు చెందిన యశ్వంత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అండర్-11 సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. యశ్వంత్ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు. అనంతరం యశ్వంత్‌ను కోచ్ దామోదరరెడ్డి, భార్గవి, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

News July 14, 2024

విజయవాడ దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

image

విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు ముసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతుండటంతో ఘాట్‌ రోడ్డు మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఆషాడం సారె సమర్పణకు వస్తున్న భక్తులతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

News July 14, 2024

కృష్ణా: గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిలకలపూడి (మచిలీపట్నం)లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు చిలకలపూడిలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 

News July 14, 2024

ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.