Krishna

News December 31, 2024

కృష్ణా: న్యూఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం 

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో న్యూఇయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలుకళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 31, 2024

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో నేడు 4,67,553 మందికి పింఛన్లు 

image

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా నేడు 4,67,553 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,30,619 మందికి రూ.98,186,95,00, కృష్ణా జిల్లాలో 2,36,934 మందికి రూ.1,01,33,81,000 జనవరి నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు ముందుగానే అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

News December 30, 2024

కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/pg-2-semester-results/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

News December 30, 2024

విజయవాడలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

విజ‌య‌వాడ న‌గ‌ర అవ‌సరాల‌కు త‌గ్గ‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నుల‌పై దృష్టి పెట్టింద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహ‌న్ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో స‌మ‌ష్టి కృషితో ర‌హ‌దారుల‌తో పాటు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషిచేస్తున్న‌ట్లు సోమ‌వారం న‌గ‌రంలో ప‌లు ప్రాంతాల్లో వారు ప‌ర్య‌టించారు. అనంతరం ఆయా కాలనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై చర్చించారు.

News December 30, 2024

పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు

image

పేర్ని నానికి చెందిన సివిల్ సప్లయిస్ బఫర్ గోడౌన్‌లో మాయమైన రేషన్ బియ్యాన్ని లెక్కతేల్చిన అధికారులు అదనంగా షార్టేజీని గుర్తించారు. ఆ బియ్యానికి ఫైన్ చెల్లించాలంటూ జాయింట్ కలెక్టర్ గోడౌన్ యజమానురాలు జయసుధకు సోమవారం నోటీసులు జారీ చేశారు. 378 టన్నుల షార్టేజీని గుర్తించి రూ.3.37 కోట్లు ఫైన్ విధించారు. ముందుగా చెల్లించిన రూ.1.70 కోట్లు మినహాయించి రూ.1.68కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

News December 30, 2024

విజయవాడ: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

image

విజయవాడలో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్‌ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లపై చర్చించారు. కాగా పవన్‌ ప్రీరిలీజ్‌కు హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News December 30, 2024

2024: ఉమ్మడి కృష్ణా పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 16 నియోజకవర్గాల్లో 14 వైసీపీ, టీడీపీ 2 సీట్లలో గెలిచింది. ఈసారి 16 నియోజకవర్గాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. 2 ఎంపీ సీట్లతో పాటు 13 స్థానాల్లో టీడీపీ, ఒకటి జనసేన, 2 స్థానాల్లో బీజేపీ నెగ్గాయి. మంత్రులుగా కొల్లు రవీంద్ర, పార్థసారథి కొనసాగుతున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని ఓడిపోవడం గమన్హారం.

News December 30, 2024

రాజీనామాను వెనక్కి తీసుకున్న కార్పొరేటర్

image

విజయవాడ మేయర్‌కు టీడీపీ నేత చన్నగిరి రామరామ్మోహన్ రావు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన తన వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేశానని, అయితే మరల రాజీనామా పత్రాన్ని వెనక్కి తీసుకున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీకి నిబద్ధత కలిగి ఉంటానని, ఎమ్మెల్యే బొండా ఉమా సహకారంతో డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. 

News December 30, 2024

కృష్ణా: వాయిదా పడిన పీజీ పరీక్షలు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జనవరి 3న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామని పేర్కొంది. 

News December 30, 2024

విజయవాడలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.