India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో వేసిన పిటిషన్ న్యాయమూర్తి కొట్టివేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తూ పేర్ని నాని పిటిషన్ వేయగా దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి పిటిషన్ను కొట్టి వేశారు. కాగా ఈ కేసులో 2వ నిందితుడిగా ఉన్న మానస తేజ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ Jan 2కి వాయిదా పడింది.
పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో హైకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈ కేసులో నాని సతీమణి జయసుధ, మేనేజర్ మానస తేజ నిందితులు. శనివారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు అవ్వగా సోమవారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. అదేవిధంగా జిల్లా కోర్టులో జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు జరగనున్నాయి.
నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్” 2వ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్లు వార్తొలుస్తున్నాయి. 2025 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్లో జనవరి 2న, మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జనవరి 4న, 2వ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జనవరి 8న నిర్వహిస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. “డాకు మహారాజ్” టీం వీటిని ధృవీకరించాల్సి ఉంది.
రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి కొంత మంది పోలీసులు సహకరిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతోందన్నారు. అధికారులు పేర్ని నానికి సహకరిస్తున్నారని తేలితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషులను చట్టం ముందు నిలబెడతామన్నారు. అవసరమైతే ఈ కేసును సిట్ కు అప్పగిస్తామన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలోని కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ 1వ సెమిస్టర్(2024- 25 విద్యాసంవత్సరం) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను 2025 JAN 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ సిబ్బంది తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు JAN 8లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర పురుషుల మహిళల వాలీబాల్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ తెలిపారు. జిల్లాలో ఆసక్తిగల క్రీడాకారులు 27వ తేదీన ఉదయం ఇందిరా గాంధీ స్టేడియంలో గల వాలీబాల్ క్రీడా మైదానం ఆధార్ కార్డ్, నేటివిటీ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు.
క్రీడాకారుల భవిష్యత్తే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, దానికి అనుగుణంగా క్రీడా సంఘాలు, శాప్ అధికార యంత్రాంగం సమన్వయం చేసుకుని క్రీడాకారులకు అన్ని విధాలుగా తోడ్పాటు నందించాలని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ అధికారులకు, కోచ్లకు క్రీడారంగంలో అమలు చేయాల్సిన అంశాలపై సోమవారం ఆయన దిశానిర్ధేశం చేశారు.
అమరావతి నిర్మాణంలో రూ.100కోట్లకు పైబడి పనులను ప్యాకేజీల వారీగా కాంట్రాక్టు సంస్థలకు అప్పగించేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. ఈ పనులలో కాంట్రాక్టు సంస్థలు భాగస్వామ్యం అయ్యేందుకు సులభతర విధానాన్ని రూపొందించామని కమిషనర్ కె.భాస్కర్ తాజాగా విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్గా నమోదయ్యేందుకు రిజిస్ట్రేషన్కై https://crda.ap.gov.in/ వెబ్సైట్ చూడాలన్నారు.
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ, కుమారుడు కిట్టుతో పాటు గోడౌన్ మేనేజర్ మానసతేజ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి శనివారం పోలీసులు వెళ్లగా.. ఆయన లేకపోవడంతో ఆ ఇంటికి నోటీసులు అంటించామని పోలీసులు పేర్కొంటున్నారు.
విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ప్రభుత్వం తరఫున సెమీ క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబుతో పాటు కూటమి మంత్రులు, నాయకులు పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.